Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

మత్తుపదార్థాలు, సైబర్ నేరాలే అతిపెద్ద ముప్పు…సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్: దేశంలో పెరుగుతున్న మత్తుపదార్థాల బెడద, సైబర్ నేరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నేడు పోలీసు బలగాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు ఇవేనని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు 74వ బీఎన్ ముల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ 2026 ముగింపు వేడుకల్లో సీఎం ప్రసంగిస్తూ… సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి రెండు వైపులా పదునున్న కత్తిలా మారడంతో నేరాల స్వరూపం గణనీయంగా రూపాంతరం చెందిందని అన్నారు. ఈ కొత్త […]
Read more

ఢిల్లీలో అంతర్జాతీయ సైబర్ మోసాల సిండికేట్‌ను ఛేదించిన పోలీసులు!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అంతర్జాతీయ సైబర్ మోసాల సిండికేట్‌ను పోలీసులు ఛేదించారు. ఈమేరకు రూ. 300 కోట్లకు పైగా విలువైన మోసాలతో సంబంధం ఉన్న ఒక ప్రధాన అంతర్జాతీయ సైబర్ మోసాల సూత్రధారి పాటు మరో 10 మందిని అరెస్టు చేసారు. దర్యాప్తులో భాగంగా, పోలీసులు పలు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఒక నెట్‌వర్క్‌ను కనుగొన్నారు. దీనికి అంతర్జాతీయ సైబర్ మోసాల సిండికేట్‌లతో, ముఖ్యంగా కంబోడియాలోని వాటితో సంబంధాలు ఉన్నాయి. “నేరాల ద్వారా వచ్చిన సొమ్మును మళ్లించడానికి […]
Read more

ట్రంప్‌ గడువుకు ముందే… 45 రోజుల కాల్పుల విరమణను పరిశీలిస్తున్న అమెరికా, ఇరాన్!

పశ్చిమాసియా: రాబోయే 48 గంటల్లో ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరకపోతే “మేము ఆ దేశం మొత్తాన్ని పేల్చివేస్తున్నాం” అని ట్రంప్‌ ఓవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు యుద్ధానికి శాశ్వత ముగింపు పలికే అవకాశం ఉన్న 45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం నిబంధనలపై అమెరికా, ఇరాన్, ప్రాంతీయ మధ్యవర్తుల బృందం చర్చించినట్లు ఆక్సియోస్ వార్తాసంస్థ నివేదించింది. రాబోయే 48 గంటల్లో పాక్షిక ఒప్పందం కుదిరే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఉద్రిక్తతలు తీవ్రతరం కాకుండా నిరోధించడానికి ఇదే […]
Read more

వచ్చే సీజన్ నుంచి తెలంగాణలో ఉపగ్రహ ఆధారిత పంటల ప్రణాళిక!

హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే వ్యవసాయ సీజన్ నుంచిఉపగ్రహ ఆధారిత పంట ప్రణాళికను అమలు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో పంట విస్తీర్ణాన్ని అంచనా వేయడానికి, అలాగే మార్కెటింగ్, డిమాండ్, ఉత్పత్తి, సరఫరా, నిల్వపై నిర్ణయాలు తీసుకోవడానికి ఉపగ్రహ చిత్రాలను (శాటిలైట్ ఇమేజింగ్) ఉపయోగించనున్నట్లు ఆయన తెలిపారు. ఈమేరకు సచివాలయంలో జరిగిన ఒక సమావేశంలో మంత్రి ఉపగ్రహ ఆధారిత పంట మ్యాపింగ్‌ను సమీక్షించారు. ఈ సమావేశానికి వ్యవసాయ కార్యదర్శి సురేంద్ర […]
Read more

“మొత్తం ఇరాన్‌ను పేల్చేస్తాం”… ట్రంప్ అల్టిమేటం!

వాషింగ్టన్: గడువు ముగిసేలోపు టెహ్రాన్ వాషింగ్టన్‌తో శాంతి ఒప్పందానికి రాలేకపోతే ‘మొత్తం ఇరాన్‌ను పేల్చేస్తాం’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ పౌరులకు అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని ట్రంప్ బెదిరించారు. దీనికి ఇరాన్‌ ధీటుగా స్సందించింది. అమెరికా దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలలోని మౌలిక సదుపాయాలపై దాడులతో ప్రతీకారం తీర్చుకుంటామని టెహ్రాన్ హెచ్చరించింది. యాక్సియోస్ నివేదిక ప్రకారం, యుద్ధానికి శాశ్వత ముగింపు పలికే అవకాశం ఉన్న 45 రోజుల […]
Read more

ఫిబ్రవరిలో మైనారిటీలపై ద్వేషపూరిత నేరాలు 60 శాతం పెరిగాయి!

హైదరాబాద్: ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా కనీసం 67 ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి, ఇది జనవరి గణాంకాలతో పోలిస్తే 60 శాతం ఎక్కువ. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 20 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత తెలంగాణలో 14 కేసులు నమోదయ్యాయి. వీటిలో 13 ముస్లింలపై, ఒకటి దళితులపై నమోదయ్యాయి. తెలంగాణలోని ఐదు కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. ఈ నెలలో బహిరంగ సభలలో నిరంతర ద్వేషపూరిత ప్రసంగాలు, అధికారంలో ఉన్న ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ముస్లింలపై కాల్పులు […]
Read more

కేరళ ప్రజలకు యూడీఎఫ్ ‘సరికొత్త ఆశ’…రాహుల్ గాంధీ!

తిరువనంతపురం: రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్షేత్రస్థాయి వాస్తవాలపై కేరళలో పార్టీ నాయకులతో చర్చించారు. ఈమేరకు వారితో కలిసి అల్పాహారం ఆస్వాదిస్తున్న ఒక వీడియోను రాహుల్‌ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోలో, ఆయన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీసన్, మరికొందరు పార్టీ అభ్యర్థులతో కలిసి అల్పాహారం చేస్తూ, మేధో వలసలు, ఉద్యోగాల కొరత, ఎఫ్‌సీఆర్‌ఏకు ప్రతిపాదిత సవరణలు వంటి […]
Read more

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం… ఉత్తర భారతంలో ప్రకంపనలు!

న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (ఎన్‌సిఎస్) తెలిపింది. కొన్ని సెకన్ల పాటు కొనసాగిన ఈ ప్రకంపనలు ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానాలలో సంభవించాయి. ఎలాంటి నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు లేవు. రాత్రి 9.42 గంటలకు సంభవించిన ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూ కుష్‌ ప్రాంతంలో 150 కిలోమీటర్ల లోతులో ఉందని ఎన్‌సిఎస్ తెలిపింది. ఉత్తరాదిన నిన్న […]
Read more

రెండు అమెరికా యుద్ధ విమానాలు, బ్లాక్ హాక్ హెలికాప్టర్లు కూల్చివేశామన్న ఇరాన్‌!

టెహ్రాన్‌: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం 36రోజుకు చేరింది. ఇరుపక్షాలు ఒకరిపై మరొకరు దాడులు తీవ్రతరం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్ రెండు అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేసింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లను రక్షించగా, మూడో పైలట్ ఆచూకీ ఇంకా లభించలేదు. అతని కోసం టెహ్రాన్ గాలిస్తోంది. మొదట, రెండు సీట్లు గల అమెరికా ఎఫ్-15ఈ జెట్‌ను ఇరాన్‌లో కూల్చివేశారు. దానిలోని ఇద్దరు సిబ్బందిలో ఒకరిని అమెరికా ప్రత్యేక దళాలు రక్షించాయని, మరొకరు గల్లంతయ్యారని అమెరికా మీడియా […]
Read more

కశ్మీర్‌లో ఉగ్రవాదిని చంపామన్న సైన్యం…’క్రూరమైన హత్య’ అంటున్న కుటుంబం!

జహంగీర్ అలీ…🖋️ శ్రీనగర్: మధ్య కశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో ఒక ఉగ్రవాదిని కాల్చి చంపినట్లు సైన్యం ప్రకటించిన ఒక రోజు తర్వాత, ఉగ్రవాదంతో ఎలాంటి సంబంధాలు లేని తమ కుమారుడే మృతి చెందాడని ఆరోపిస్తూ ఒక కుటుంబం నిన్న పోలీసులను ఆశ్రయించింది. గందర్‌బల్‌లోని లార్ ప్రాంతంలోని చౌంట్‌వాలివార్ గ్రామానికి చెందిన, కామర్స్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ అయిన 28 ఏళ్ల రషీద్ అహ్మద్ మొఘల్ కుటుంబం, మృతి చెందిన యువకుడు తమ కుటుంబాన్ని పోషించడానికి కష్టపడి పనిచేసేవాడని వివరిస్తూ గందర్‌బల్ […]
Read more
1 30 31 32 33 34 194

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.