Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

కేరళ అభివృద్ధిపై పినరయి విజయన్, తెలంగాణ సీఎంల మధ్య మాటల యుద్ధం!

హైదరాబాద్: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గత వారం యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)కు మద్దతుగా ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేరళ సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. దీనిపై రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) ప్రభుత్వ హయాంలో కేరళ సాధించిన అభివృద్ధిపై విజయన్ చేసిన వాదనల గురించి సానుకూలమైన, వాస్తవ ఆధారిత చర్చ జరిపేందుకు తాను ఈరోజు తిరువనంతపురానికి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. పినరయి విజయన్‌కు […]
Read more

సీఈసీపై విపక్షాల అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించిన పార్లమెంట్!

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని కోరుతూ విపక్ష సభ్యులు సమర్పించిన అభిశంసన తీర్మానం నోటీసును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ తిరస్కరించారు. 193 మంది ఎంపీలు సంతకాలు చేసిన ఈ తీర్మానాన్ని ఎటువంటి కారణాలు పేర్కొనకుండా తిరస్కరించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) “పార్లమెంట్‌ను అపహాస్యం చేస్తోందని” ఆరోపించాయి. అయితే ఈ తీర్మాన నోటీసును క్షుణ్ణంగా పరిశీలించిన మీదట అందులో ఇమిడి […]
Read more

అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్‌!

టెహ్రాన్‌: కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. దానికి బదులుగా యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలని కోరుతూ పది-సూత్రాల డిమాండ్లను పంపినట్లు అధికారిక ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ తెలిపింది. ఈమేరకు టెహ్రాన్ పాకిస్థాన్ ద్వారా వాషింగ్టన్‌కు తన వైఖరిని నిన్న తెలియజేసింది. కాగా, ఈ డిమాండ్లలో ఈ ప్రాంతంలోని అన్ని సంఘర్షణలకు ముగింపు పలకడం, హర్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి సంబంధించిన ఒక ప్రోటోకాల్, ఆంక్షలను ఎత్తివేయడం, పునర్నిర్మాణానికి కట్టుబడి ఉండటం […]
Read more

అస్సాం మతపరంగా చీలిపోయినా…సీఎం హిమంత ‘భాష’తో సౌకర్యంగా లేమంటున్న మద్దతుదారులు!

తమన్నా నసీర్….🖋️ గౌహతి: ముస్లింలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ చేసిన విద్వేష వ్యాఖ్యలు అక్కడి ప్రజల్లో విభజన భావనను రేకెత్తించాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఈ రాష్ట్రంలో ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఉదాహరణకు ఒక కేస్‌ స్టడీని గమనిస్తే… గౌహతి శివార్లలోని చంద్రాపూర్‌లో ఒక టీ స్టాల్ వద్ద కూర్చుని ఉన్న 26 ఏళ్ల రోహన్ దాస్ మాట్లాడుతూ… “మియాలను అస్సాంలో ఉండటానికి ఎందుకు అనుమతించాలి? వారు అక్రమ వలసదారులు కాదా? వారిని […]
Read more

మత్తుపదార్థాలు, సైబర్ నేరాలే అతిపెద్ద ముప్పు…సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్: దేశంలో పెరుగుతున్న మత్తుపదార్థాల బెడద, సైబర్ నేరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నేడు పోలీసు బలగాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు ఇవేనని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు 74వ బీఎన్ ముల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ 2026 ముగింపు వేడుకల్లో సీఎం ప్రసంగిస్తూ… సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి రెండు వైపులా పదునున్న కత్తిలా మారడంతో నేరాల స్వరూపం గణనీయంగా రూపాంతరం చెందిందని అన్నారు. ఈ కొత్త […]
Read more

ఢిల్లీలో అంతర్జాతీయ సైబర్ మోసాల సిండికేట్‌ను ఛేదించిన పోలీసులు!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అంతర్జాతీయ సైబర్ మోసాల సిండికేట్‌ను పోలీసులు ఛేదించారు. ఈమేరకు రూ. 300 కోట్లకు పైగా విలువైన మోసాలతో సంబంధం ఉన్న ఒక ప్రధాన అంతర్జాతీయ సైబర్ మోసాల సూత్రధారి పాటు మరో 10 మందిని అరెస్టు చేసారు. దర్యాప్తులో భాగంగా, పోలీసులు పలు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఒక నెట్‌వర్క్‌ను కనుగొన్నారు. దీనికి అంతర్జాతీయ సైబర్ మోసాల సిండికేట్‌లతో, ముఖ్యంగా కంబోడియాలోని వాటితో సంబంధాలు ఉన్నాయి. “నేరాల ద్వారా వచ్చిన సొమ్మును మళ్లించడానికి […]
Read more

ట్రంప్‌ గడువుకు ముందే… 45 రోజుల కాల్పుల విరమణను పరిశీలిస్తున్న అమెరికా, ఇరాన్!

పశ్చిమాసియా: రాబోయే 48 గంటల్లో ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరకపోతే “మేము ఆ దేశం మొత్తాన్ని పేల్చివేస్తున్నాం” అని ట్రంప్‌ ఓవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు యుద్ధానికి శాశ్వత ముగింపు పలికే అవకాశం ఉన్న 45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం నిబంధనలపై అమెరికా, ఇరాన్, ప్రాంతీయ మధ్యవర్తుల బృందం చర్చించినట్లు ఆక్సియోస్ వార్తాసంస్థ నివేదించింది. రాబోయే 48 గంటల్లో పాక్షిక ఒప్పందం కుదిరే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఉద్రిక్తతలు తీవ్రతరం కాకుండా నిరోధించడానికి ఇదే […]
Read more

వచ్చే సీజన్ నుంచి తెలంగాణలో ఉపగ్రహ ఆధారిత పంటల ప్రణాళిక!

హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే వ్యవసాయ సీజన్ నుంచిఉపగ్రహ ఆధారిత పంట ప్రణాళికను అమలు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో పంట విస్తీర్ణాన్ని అంచనా వేయడానికి, అలాగే మార్కెటింగ్, డిమాండ్, ఉత్పత్తి, సరఫరా, నిల్వపై నిర్ణయాలు తీసుకోవడానికి ఉపగ్రహ చిత్రాలను (శాటిలైట్ ఇమేజింగ్) ఉపయోగించనున్నట్లు ఆయన తెలిపారు. ఈమేరకు సచివాలయంలో జరిగిన ఒక సమావేశంలో మంత్రి ఉపగ్రహ ఆధారిత పంట మ్యాపింగ్‌ను సమీక్షించారు. ఈ సమావేశానికి వ్యవసాయ కార్యదర్శి సురేంద్ర […]
Read more

“మొత్తం ఇరాన్‌ను పేల్చేస్తాం”… ట్రంప్ అల్టిమేటం!

వాషింగ్టన్: గడువు ముగిసేలోపు టెహ్రాన్ వాషింగ్టన్‌తో శాంతి ఒప్పందానికి రాలేకపోతే ‘మొత్తం ఇరాన్‌ను పేల్చేస్తాం’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ పౌరులకు అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని ట్రంప్ బెదిరించారు. దీనికి ఇరాన్‌ ధీటుగా స్సందించింది. అమెరికా దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలలోని మౌలిక సదుపాయాలపై దాడులతో ప్రతీకారం తీర్చుకుంటామని టెహ్రాన్ హెచ్చరించింది. యాక్సియోస్ నివేదిక ప్రకారం, యుద్ధానికి శాశ్వత ముగింపు పలికే అవకాశం ఉన్న 45 రోజుల […]
Read more

ఫిబ్రవరిలో మైనారిటీలపై ద్వేషపూరిత నేరాలు 60 శాతం పెరిగాయి!

హైదరాబాద్: ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా కనీసం 67 ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి, ఇది జనవరి గణాంకాలతో పోలిస్తే 60 శాతం ఎక్కువ. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 20 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత తెలంగాణలో 14 కేసులు నమోదయ్యాయి. వీటిలో 13 ముస్లింలపై, ఒకటి దళితులపై నమోదయ్యాయి. తెలంగాణలోని ఐదు కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. ఈ నెలలో బహిరంగ సభలలో నిరంతర ద్వేషపూరిత ప్రసంగాలు, అధికారంలో ఉన్న ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ముస్లింలపై కాల్పులు […]
Read more
1 49 50 51 52 53 214

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.