Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

దళిత ప్రొఫెసర్‌పై వేధింపులు ఆపండి…సీఎంను కోరిన సామాజిక కార్యకర్తలు!

హైదరాబాద్: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో దళిత మహిళా ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతపై జరుగుతున్న వేధింపులను తక్షణమే ఆపాలని, ఆమెను ‘అర్బన్ నక్సల్స్’గా ముద్ర వేయడం మానుకోవాలని, ఆమె భద్రత, గౌరవం, శ్రేయస్సుకు భంగం కలిగించే ఎలాంటి చర్యలకైనా దూరంగా ఉండాలని దేశ, విదేశాలకు చెందిన సామాజిక కార్యకర్తలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. విప్లవ రచయిత పి. వరవరరావుతో పాటు విద్యావేత్తలు, సాంఘిక కార్యకర్తలు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, అన్ని వర్గాల ప్రజలు సహా 209 […]
Read more

మణిపూర్‌లోని 40 లోయ స్థానాలకు రాజ్యాంగ రక్షణ కావాలి… కేంద్రానికి లేఖ రాసిన బీజేపీ ఎమ్మెల్యే!

ఇంఫాల్/న్యూఢిల్లీ: మణిపూర్‌లోని 40 ఇంపాల్ లోయ అసెంబ్లీ స్థానాలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలని, ఆ స్థానాలను స్థానిక ప్రజల కోసం ప్రత్యేకంగా కేటాయించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఇమో సింగ్ కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారు. “…కొండ ప్రాంతాలకు ఇప్పటికే పలు సీట్లు రిజర్వ్ చేసారు. జనసాంద్రత అసమతుల్యతను నివారించడానికి, ఈ ప్రాంత సామాజిక-సాంస్కృతిక గుర్తింపును కాపాడటానికి ఈ డిమాండ్ ముందుకు తెచ్చానని ఆయన అన్నారు. లోయలోని ఆదివాసీ ప్రజల కోసం ఉద్దేశించిన 40 సీట్లకు […]
Read more

ఇరాన్‌తో ట్రంప్ ‘మహా ఒప్పందం’ కోరుకుంటున్నారు… జేడీ వాన్స్!

వాషింగ్టన్‌: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఒక సంకుచిత ఒప్పందం కాకుండా, ఒక సమగ్ర ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. నిన్న జార్జియా రాష్ట్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ… దాదాపు వారం రోజులుగా అమల్లో ఉన్న కాల్పుల విరమణకు సంబంధించిన ఒక వ్యూహంలో భాగంగానే చర్చలు కొనసాగుతున్నాయని వాన్స్ వివరించారు. “ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మనకు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంది. ఇది ఏడు రోజుల క్రితం […]
Read more

బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ల ‘విద్వేషపూరిత ఆలోచనా ధోరణి’ రాజ్యాంగాన్ని నాశనం చేస్తోంది…రాహుల్ గాంధీ!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ, దాని సైద్ధాంతిక మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ల “విద్వేషపూరిత ఆలోచనా ధోరణి” భారత రాజ్యాంగాన్ని పద్ధతి ప్రకారం నాశనం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని ఆయన ఆరోపించారు. సభను ఉద్దేశించి రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ… కాషాయ పార్టీ ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని, ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తోందని పేర్కొనారు. “బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు […]
Read more

ఏప్రిల్ 22 నుండి నిరవధిక సమ్మెకు దిగనున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు!

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. ఈమేరకు నిన్న ఆర్టీసీ ప్రతినిధులు, కార్మిక శాఖ కమిషనర్ మధ్య హైదరాబాద్‌లో జరిగిన సమావేశం విఫలమవడంతో, తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) సంయుక్త కార్యాచరణ సమితి (JAC) ఏప్రిల్ 22 నుండి రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. “మా డిమాండ్లు నెరవేర్చకపోతే, ఏప్రిల్ 21- 22 తేదీల మధ్య రాత్రి, అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత డిపో నుండి బయలుదేరాల్సిన మొదటి బస్సు డిపోలోనే ఉంటుందని” TGSRTC […]
Read more

ఓటరు జాబితా ప్రక్షాళనకు ఈసీ వాడుతున్న అల్గారిథంను రూపొందించింది ఎవరు?

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)పై ఆల్ట్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కోల్‌కతాలోని సబర్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు సాబిర్ అహ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిశీలనలోని ఫలితాలు రూపకల్పనలో పక్షపాతాన్ని, పెద్ద ఎత్తున ఓటర్లను మినహాయించడాన్ని సూచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆల్ట్ న్యూస్, సాబర్ ఇన్‌స్టిట్యూట్ రెండూ బెంగాల్ SIRకు సంబంధించిన భారత ఎన్నికల సంఘం (ECI) డేటాను విశ్లేషించి, ఆందోళనకరమైన ధోరణులను గుర్తించాయి. రాష్ట్రంలో SIR ప్రక్రియ […]
Read more

డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేద్కర్‌…భారత రాజ్యాంగ నిర్మాత!

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి నేడు. ప్రతి ఏటా ఏప్రిల్ 14న ఆ మహనీయుడి జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజును ‘సమానత్వ దినోత్సవం’గా కూడా పిలుస్తారు. ఆయన సంఘ సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన నాయకుడిగా, దళితుల హక్కుల కోసం కృషి చేసిన మహనీయుడిగా చిరస్మరణీయులు. మధ్యప్రదేశ్‌లోని మహౌ (MHow) ప్రాంతంలో 1891లో జన్మించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్… భారతదేశ చరిత్రలో గొప్ప నాయకుడిగా నిలిచారు. చిన్నప్పటి నుంచే […]
Read more

ఢిల్లీ హైకోర్టు జడ్జీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు హాజరయ్యారని ఆరోపించిన కేజ్రీవాల్‌!

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వరనా కాంత శర్మ, ఆర్ఎస్ఎస్‌కు అనుబంధంగా ఉన్న న్యాయవాదుల సంఘం ‘అధివక్త పరిషత్’ నిర్వహించిన ఒక కార్యక్రమానికి నాలుగు సార్లు హాజరయ్యారని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. దీంతో ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగదని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తిని కోరారు. ఢిల్లీ మద్యం విధానం కేసును ‘రాజకీయమైనది’ అని ఆయన అభివర్ణించారు. “అధివక్త […]
Read more

శాంతి చర్చల్లో ప్రతిష్టంభనకు ప్రధాన కారణం ఇరాన్‌ అణు కార్యక్రమమే!

వాషింగ్టన్: పాకిస్తాన్‌లో ఇరాన్, అమెరికాల మధ్య వారాంతంలో జరిగిన చర్చల్లో టెహ్రాన్ అణు కార్యకలాపాలపై ఉన్న విభేదమే ప్రధాన ప్రతిష్టంభనకు కారణమైంది. వాషింగ్టన్ తన ప్రతిపాదనలో ఇరాన్ యురేనియం శుద్ధిని 20 ఏళ్ల పాటు నిలిపివేయాలని సూచించగా, కేవలం ఐదేళ్లకు మాత్రమే అంగీకరించగలమని టెహ్రాన్ చెప్పినట్లు ‘ది న్యూయార్క్ టైమ్స్’, ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ నివేదికలు పేర్కొన్నాయి. నివేదికల ప్రకారం, ఇస్లామాబాద్ చర్చల సందర్భంగా ఇరాన్ అణు కార్యకలాపాలను నిలిపివేసేందుకు అమెరికా, ఇరాన్‌లు ప్రతిపాదనలు మార్చుకున్నాయి, కానీ […]
Read more

తెలంగాణ విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లు…ఒక విశ్లేషణ!

హైదరాబాద్‌: తెలంగాణ విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లు-2026 ప్రకారం…మతసామరస్యానికి భంగం కలిగించే పోస్టులు, అల్లర్లు, ఘర్షణలను ప్రేరేపించే ప్రసంగాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లును తీసుకువస్తున్నారు. వ్యక్తులు, వర్గాల మధ్య అసమ్మతి, శత్రుత్వాన్ని రెచ్చగొట్టే చర్యలను నేరుగా ఎదుర్కొని, నివారించే ఒక సమగ్ర వ్యవస్థను సృష్టించడం దీని ప్రాథమిక లక్ష్యం. మతం, కులం, లింగం, భాష, ఇతర గుర్తింపులకు అతీతంగా, ముఖ్యంగా సోషల్ మీడియాలో పెరుగుతున్న విద్వేష ప్రసంగ సంఘటనల నేపథ్యంలో ఈ బిల్లు వచ్చింది. ఈ […]
Read more
1 46 47 48 49 50 214

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.