Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిర్దోషికి ‘పీహెచ్‌డీ’ పట్టా!

ముంబయి: ప్రముఖ న్యాయవాది, జైలు హక్కుల కార్యకర్త, 2006 ముంబై రైలు పేలుడు కేసులో నిర్దోషిగా విడుదలైన మొదటి వ్యక్తి అబ్దుల్ వాహిద్ షేక్‌కు ఔరంగాబాద్‌లోని MGM విశ్వవిద్యాలయంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) డిగ్రీ ప్రదానం చేశారు. ఈ డిగ్రీని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ విలాస్ సక్పాల్ ఒక అధికారిక స్నాతకోత్సవ కార్యక్రమంలో అందించారు. “జైలు సాహిత్యం: స్వాతంత్య్రం తర్వాత” అనే శీర్షికతో ఆయన చేసిన డాక్టోరల్ పరిశోధన, భారతీయ జైళ్ల నుండి వెలువడే […]
Read more

ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం !

తిరువనంతపురం: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌-SIRను వ్యతిరేకిస్తూ కేరళ శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యులు కొన్ని సవరణలను సూచించారు, వాటిలో కొన్నింటిని తీర్మానం ఆమోదించడానికి ముందే ఆమోదించారు. మతం ఆధారంగా పౌరసత్వం ఇచ్చే పౌరసత్వ సవరణ చట్టాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించేవారు SIR ప్రక్రియను ఉపయోగించుకోవచ్చని, ఇది ప్రజాస్వామ్యానికి సవాలుగా మారుతుందని తీర్మానం ఆందోళన వ్యక్తం చేసింది. “ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఇటువంటి చర్యలను ధిక్కరిస్తూ, ఎన్నికల […]
Read more

తమిళనాడు తొక్కిసలాట ఘటనలో 40కి పెరిగిన మృతుల సంఖ్య…విజయ్ ఇంటి ముందు నిరసన!

చెన్నై: టీవీకే పార్టీ చీఫ్‌ శనివారం కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 40కి పెరిగింది. 60 మందికి పైగా ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు, కనీసం ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి కె పళనిస్వామి, బిజెపికి చెందిన నైనార్ నాగేంద్రన్, కె అన్నామలై, విసికె చీఫ్ తోల్ తిరుమావళవన్, పిఎంకె అగ్ర నాయకుడు అన్బుమణి రామదాస్ […]
Read more

నా భర్త అరెస్ట్‌ కోసం నాలుగేళ్ల క్రితమే వేట మొదలయింది…సోనమ్‌వాంగ్‌చుక్‌ భార్య ఆరోపణలు!

న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌ను ఆయన భార్య గీతాంజలి అంగ్మో తీవ్రంగా ఖండించారు. తన భర్తను లడఖ్ నుండి తీసుకెళ్లిన అధికారులెవరి నుండి తనకు ఎటువంటి సమాచారం రాలేదని, 48 గంటలకు పైగా గడిచిందని ఆంగ్మో చెప్పారు. నాలుగు సంవత్సరాల క్రితం లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడంతో వాంగ్‌చుక్‌ కోసం కేంద్రం వేట మొదలెట్టిందని ఆంగ్మో ఆరోపించారు. అంతేకాదు తమ లాభాపేక్షలేని సంస్థల్లో ఒకటైన హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, […]
Read more

సోనమ్ వాంగ్‌చుక్‌పై జాతీయ భద్రతా చట్టం…జోధ్‌పూర్‌ జైలుకు తరలింపు!

న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను క్రూరమైన జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి… వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న జోధ్‌పూర్‌కు ప్రభుత్వం తరలించింది. లద్దాఖ్ రాజధాని లేహ్‌లో బుధవారం జరిగిన హింసాకాండలో నలుగురు మరణించగా, 70 మంది గాయపడిన సంగతి తెలిసిందే. యువతను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాడన్న కారణంతో జాతీయ భద్రతా చట్టం(NSA) కింద డిజీపీ ఎస్.డి.సింగ్ జమ్వాల్ ఆధ్వర్యంలో సోనమ్ వాంగ్‌చుక్‌ను ఆయన సొంత గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర పాలిత […]
Read more

బాబ్రీ మసీదు నిర్మాణం ఒక ‘అపవిత్ర చర్య’…మాజీ సీజేఐ చంద్రచూడ్!

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 2019లో ఇచ్చిన అయోధ్య తీర్పుకు విరుద్ధంగా, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) D.Y. చంద్రచూడ్ న్యూస్‌లాండ్రీకి వెబ్‌పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “బాబ్రీ మసీదు నిర్మాణం (16వ శతాబ్దంలో) ఒక ప్రాథమిక అపవిత్ర చర్య” అని పేర్కొనడం కొత్త వివాదానికి దారితీసింది. జస్టిస్ (రిటైర్డ్) చంద్రచూడ్ 2019 నవంబర్‌లో అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అప్పటి CJI రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో సభ్యుడు కూడా […]
Read more

ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ భద్రతపై అనుమానాలు!

న్యూఢిల్లీ: నకిలీ లాగిన్లు, ఫోన్‌నంబర్లను ఉపయోగించి ఓటరుజాబితాలోని ఓట్లను తొలిగించారని ఇటీవల లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఈసీ ప్రచురించిన ఓటరు జాబితాపై పలు అనుమానాలు తలెత్తాయి. సాఫ్ట్‌వేర్‌ సాయంతో కేంద్రీకృత పద్ధతిలో ఓట్ల చోరీకి అవకాశం ఉందా అంటూ సందేహాలు బయలుదేరాయి. రాహుల్‌ గాంధీ ఆరోపణలకు ప్రతిస్పందిస్తూ, ఎన్నికల కమిషన్ ఆసక్తికరంగా రెండు స్వరాలలో మాట్లాడింది. మొదట అది అతని ఆరోపణలను “తప్పు, నిరాధారమైనది” అని ఖండించినప్పటికీ, మరో రోజు […]
Read more

దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల దోషికి ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే!

హైదరాబాద్: పుష్కరం క్రితం అంటే 2013 దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో దోషి అసదుల్లా అక్తర్ ఉరిశిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఈ పేలుళ్లలో 18 మంది మరణించగా, 131 మంది గాయపడ్డారు. 2016లో ప్రత్యేక NIA కోర్టు అక్తర్ కు మరణశిక్ష విధించగా, ఈ ఏడాది ఏప్రిల్ 8న తెలంగాణ హైకోర్టు అతడి శిక్షను ధ్రువీకరించింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన సెప్టెంబర్ 20న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) […]
Read more

‘సోనమ్ వాంగ్‌చుక్ వ్యాఖ్యలు అల్లరి మూకలను రెచ్చగొట్టాయి’…లడఖ్ హింసపై కేంద్రం ఆరోపణ!

లేహ్/న్యూఢిల్లీ: లడఖ్‌లో జరిగిన ఘర్షణలకు సోనమ్ వాంగ్‌చుక్ వ్యాఖ్యలే కారణమని కేంద్రం ఆరోపించింది. ఈ ఘర్షణల్లో నలుగురు మరణించారు. 70 మంది గాయపడ్డారు. “నిరాహార దీక్షను విరమించాలని చాలా మంది నాయకులు కోరినప్పటికీ, వాంగ్‌చుక్‌ కొనసాగించాడు. “అరబ్ స్ప్రింగ్, నేపాల్ తరహా నిరసనలు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టాయని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిన్న ఉదయం 11:30 గంటల సమయంలో, వాంగ్‌చుక్ ప్రసంగాలతో ప్రేరేపితులైన ఆందోళనకారులు దీక్షా శిబిరం నుంచి […]
Read more

లైంగిక వేధింపులకు పాల్పడ్డ స్వామీజీపై కేసు నమోదు…పరారీలో గాడ్‌మ్యాన్‌!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రముఖ ఆశ్రమంలో లైంగిక వేధింపు ఆరోపణలు కలకలం రేపాయి. ఇక్కడి ఓ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అనేక మంది మహిళా విద్యార్థులు ఈ మేరకు ఆశ్రమ స్వామీజీపై పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు స్వయం ప్రకటిత కీచక దేవుడిపై కేసు నమోదు చేశారు. అయితే సదరు స్వామీజీ మాత్రం నిఘా ఉన్నప్పటికీ పోలీసులు కళ్లుగప్పి చల్లగా జారుకున్నాడు. ఆగస్టు 4న వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్‌లో […]
Read more
1 23 24 25 26 27 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.