Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

యూజీసీ ఈక్విటీ నిబంధనలను స్వాగతించిన జేఐహెచ్‌…సుప్రీం’స్టే’పై ఆందోళన!

న్యూఢిల్లీ: భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థలో వివక్షను పరిష్కరించే దిశగా యూజీసీ కొత్త మార్గదర్శకాలను జమాతే ఇస్లామీ స్వాగతించింది. అయితే తాజాగా వీటిపై సుప్రీం కోర్టు స్టే విధించడంపై మర్కజీ తాలీమి బోర్డు ఛైర్మన్ ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ ఆందోళన వ్యక్తం చేశారు. కులం, మతం, లింగం, వైకల్యం, ప్రాంతం వంటి కారణాలపై వివక్షను గుర్తించడం సానుకూల పరిణామం అయినప్పటికీ, ఈ నిబంధనల జమైన ప్రభావం వాటి అమలు, స్వయంప్రతిపత్తి, ప్రాతినిధ్య స్వభావంపై ఆధారపడి ఉంటుందని ఆయన […]
Read more

క్యాంపస్‌లలో కుల రక్కసి… నిబంధనలు సరిపోవా?

భారతీయ విద్యా వ్యవస్థలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాల్సిన విశ్వవిద్యాలయాలు నేడు వివక్షకు వేదికలుగా మారుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) విడుదల చేసిన గణాంకాలు మన విద్యా కుసుమాల్లో దాగి ఉన్న కుల వివక్ష విషాన్ని బయటపెట్టాయి. గత ఐదేళ్లలో కుల వివక్షకు సంబంధించిన ఫిర్యాదులు 118 శాతం పెరగడం అనేది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు, విద్యా రంగంలో వేళ్లూనుకున్న సామాజిక అసమానతలకు ఇది అద్దం పడుతోంది. పెరిగిన […]
Read more

‘మహా’ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన అజిత్ పవార్ విమాన ప్రమాదం!

ముంబయి: డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. 2024 వరకు షిండే ముఖ్యమంత్రిగా, బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్, పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ఈ ఏర్పాటు సజావుగా సాగింది. అయితే, అసెంబ్లీ ఎన్నికలలో లభించిన భారీ విజయం మహాయుతికి మొదటి పెద్ద సవాలును విసిరింది. బీజేపీ భారీ మెజారిటీతో అతిపెద్ద పార్టీగా అవతరించింది, రాష్ట్రంలోని 288 స్థానాలకు గాను 132 స్థానాలను గెలుచుకుంది, సొంతంగా మెజారిటీకి కేవలం 13 స్థానాలు తక్కువగా […]
Read more

ఖమ్మంలో భారీ సైబర్ స్కాం…మ్యూల్ ఖాతాల ద్వారా 650 కోట్లు విదేశాలకు తరలింపు!

హైదరాబాద్: ఖమ్మం పోలీసులు ఒక భారీ సైబర్ మోసాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇందులో భాగంగా కంబోడియా, మయన్మార్‌ల నుండి పనిచేస్తున్న అంతర్జాతీయ సైబర్ స్కామ్ నెట్‌వర్క్‌లకు సరఫరా చేసిన మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా దాదాపు రూ. 650 కోట్లను తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పటివరకు సుమారు 20 మంది నిందితులను అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు ఉదతనేని వికాస్ చౌదరి పరారీలో ఉన్నాడు. సత్తుపల్లి మండలం తుంబురు గ్రామానికి చెందిన 30 ఏళ్ల నిరుద్యోగి డిసెంబర్ […]
Read more

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం!

ముంబై: మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ విమాన ప్రమాదంలో మరణించారు. ఈరోజు ఉదయం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు విమానంలో ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు అజిత్ పవార్ వ్యక్తిగత సిబ్బంది కాగా, మరో ఇద్దరు పైలెట్లు ఉన్నారని డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది. ఘటనా స్థలం నుండి వచ్చిన […]
Read more

దేశంలో పెరుగుతున్న అసమానత…మోడీ ప్రభుత్వ ఆర్థిక గణాంకాలపై కాంగ్రెస్ విమర్శలు!

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌కు ముందు “ది రియల్ స్టేట్ ఆఫ్ ది ఎకానమీ 2026” అనే నివేదికను కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది. భారతదేశంలో అసమానత తీవ్రంగా పెరుగుతోందని, మోడీ ప్రభుత్వం హయాంలో సంక్షేమ ఖర్చులు క్రమంగా తగ్గుతున్నాయని ఆరోపించింది. టాప్ 10% వద్ద 65% సంపద ఉంటే, సగం జనాభా కేవలం 6.4% సంపదతో ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈమేరకు మాజీ ఎంపీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) పరిశోధన విభాగం ఛైర్మన్ […]
Read more

యూజీసీకి వ్యతిరేకంగా బరేలీ సిటీ మేజిస్ట్రేట్‌ రాజీనామా… క్రమశిక్షణారాహిత్యమంటూ సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం!

లక్నో: కొత్తగా తీసుకువచ్చిన యూజీసీ (UGC) నిబంధనలు జనరల్ కేటగిరీకి వ్యతిరేకంగా, వివక్షతతో ఉన్నాయని ఆరోపిస్తూ బరేలీ సిటీ మేజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి జనవరి 26న తన పదవికి రాజీనామా చేశారు. ఇలా చేయడం క్రమశిక్షణారాహిత్యం అంటూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అతడిని సస్పెండ్‌ చేసింది. సోమవారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అగ్నిహోత్రిని షామ్లి జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. కాగా, తన రాజీనామా లేఖలో అగ్నిహోత్రి… కొత్త UGC నిబంధనలను తీవ్రంగా ఖండించారు, […]
Read more

సోషల్ మీడియా మాయాజాలం… ‘వ్యూస్’ వేటలో మృగ్యమవుతున్న నైతిక విలువలు!

ముజాహిద్ ముహమ్మద్ ఒకప్పుడు ప్రతిభ అనేది కష్టానికి ప్రతిరూపంగా ఉండేది. కానీ నేడు, అది కేవలం కొన్ని సెకన్ల ‘రీల్’ (Reel) చుట్టూ తిరుగుతోంది. అదృశ్యంగా అల్లుకుపోయిన ఇంటర్నెట్ తీగలు యువతను ఎంతలా బంధించాయంటే, తమ కళ్లముందున్న జీవితాన్ని కంటే కెమెరా లెన్స్ వెనుక ఉన్న ప్రపంచాన్నే వారు సర్వస్వంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో ‘వ్యూస్’ కోసం వారు పడుతున్న ఆరాటం చివరకు సామాజిక విలువలను, కనీస విచక్షణను కూడా బలి తీసుకుంటోంది.రీల్స్ పిచ్చి – కోల్పోతున్న […]
Read more

మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి స్వామినాథన్ వ్యాఖ్యలపై వివాదం!

చెన్నై: మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జి.ఆర్. స్వామినాథన్ తన మిగిలిన సర్వీస్ కాలంలో సనాతన ధర్మాన్ని తన హృదయంలో ఉంచుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా కొత్త వివాదానికి దారితీసింది. చెన్నైలో శనివారం దారా ఫౌండేషన్ నిర్వహించిన ‘ధార డివైన్ అవార్డ్స్ 2025’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… “నాకు నాలుగున్నర సంవత్సరాల సర్వీస్ ఉందని ఆశిస్తున్నాను. మిగిలిన ఈ కాలంలో నేను గొప్పతనాన్ని ప్రదర్శించాలి. నేను సనాతన ధర్మాన్ని నా హృదయంలో ఉంచుకోవాలని ఆయన అన్నారు.” కులం, మతం, […]
Read more

కుల గణనపై మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రశ్నించిన కాంగ్రెస్ !

న్యూఢిల్లీ: రాబోయే 2027 జనాభా లెక్కల్లో సమగ్ర కుల గణనకు మోడీ ప్రభుత్వం పూనుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ షెడ్యూల్ (ఫేజ్ 1)లోని 12వ ప్రశ్న ఇంటి యజమాని షెడ్యూల్డ్ కులం (SC), షెడ్యూల్డ్ తెగ (ST) లేదా ‘ఇతర’ వర్గాలకు చెందినవాడా అని మాత్రమే అడుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఆరోపించారు. ఇంటింటి సర్వేలో కులం గురించిన ప్రశ్నలు సమగ్రంగా లేవని, OBC, జనరల్ […]
Read more
1 22 23 24 25 26 87

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.