Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

దేశంలో పెరుగుతున్న అసమానత…మోడీ ప్రభుత్వ ఆర్థిక గణాంకాలపై కాంగ్రెస్ విమర్శలు!

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌కు ముందు “ది రియల్ స్టేట్ ఆఫ్ ది ఎకానమీ 2026” అనే నివేదికను కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది. భారతదేశంలో అసమానత తీవ్రంగా పెరుగుతోందని, మోడీ ప్రభుత్వం హయాంలో సంక్షేమ ఖర్చులు క్రమంగా తగ్గుతున్నాయని ఆరోపించింది. టాప్ 10% వద్ద 65% సంపద ఉంటే, సగం జనాభా కేవలం 6.4% సంపదతో ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈమేరకు మాజీ ఎంపీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) పరిశోధన విభాగం ఛైర్మన్ […]
Read more

యూజీసీకి వ్యతిరేకంగా బరేలీ సిటీ మేజిస్ట్రేట్‌ రాజీనామా… క్రమశిక్షణారాహిత్యమంటూ సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం!

లక్నో: కొత్తగా తీసుకువచ్చిన యూజీసీ (UGC) నిబంధనలు జనరల్ కేటగిరీకి వ్యతిరేకంగా, వివక్షతతో ఉన్నాయని ఆరోపిస్తూ బరేలీ సిటీ మేజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి జనవరి 26న తన పదవికి రాజీనామా చేశారు. ఇలా చేయడం క్రమశిక్షణారాహిత్యం అంటూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అతడిని సస్పెండ్‌ చేసింది. సోమవారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అగ్నిహోత్రిని షామ్లి జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. కాగా, తన రాజీనామా లేఖలో అగ్నిహోత్రి… కొత్త UGC నిబంధనలను తీవ్రంగా ఖండించారు, […]
Read more

సోషల్ మీడియా మాయాజాలం… ‘వ్యూస్’ వేటలో మృగ్యమవుతున్న నైతిక విలువలు!

ముజాహిద్ ముహమ్మద్ ఒకప్పుడు ప్రతిభ అనేది కష్టానికి ప్రతిరూపంగా ఉండేది. కానీ నేడు, అది కేవలం కొన్ని సెకన్ల ‘రీల్’ (Reel) చుట్టూ తిరుగుతోంది. అదృశ్యంగా అల్లుకుపోయిన ఇంటర్నెట్ తీగలు యువతను ఎంతలా బంధించాయంటే, తమ కళ్లముందున్న జీవితాన్ని కంటే కెమెరా లెన్స్ వెనుక ఉన్న ప్రపంచాన్నే వారు సర్వస్వంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో ‘వ్యూస్’ కోసం వారు పడుతున్న ఆరాటం చివరకు సామాజిక విలువలను, కనీస విచక్షణను కూడా బలి తీసుకుంటోంది.రీల్స్ పిచ్చి – కోల్పోతున్న […]
Read more

మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి స్వామినాథన్ వ్యాఖ్యలపై వివాదం!

చెన్నై: మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జి.ఆర్. స్వామినాథన్ తన మిగిలిన సర్వీస్ కాలంలో సనాతన ధర్మాన్ని తన హృదయంలో ఉంచుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా కొత్త వివాదానికి దారితీసింది. చెన్నైలో శనివారం దారా ఫౌండేషన్ నిర్వహించిన ‘ధార డివైన్ అవార్డ్స్ 2025’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… “నాకు నాలుగున్నర సంవత్సరాల సర్వీస్ ఉందని ఆశిస్తున్నాను. మిగిలిన ఈ కాలంలో నేను గొప్పతనాన్ని ప్రదర్శించాలి. నేను సనాతన ధర్మాన్ని నా హృదయంలో ఉంచుకోవాలని ఆయన అన్నారు.” కులం, మతం, […]
Read more

కుల గణనపై మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రశ్నించిన కాంగ్రెస్ !

న్యూఢిల్లీ: రాబోయే 2027 జనాభా లెక్కల్లో సమగ్ర కుల గణనకు మోడీ ప్రభుత్వం పూనుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ షెడ్యూల్ (ఫేజ్ 1)లోని 12వ ప్రశ్న ఇంటి యజమాని షెడ్యూల్డ్ కులం (SC), షెడ్యూల్డ్ తెగ (ST) లేదా ‘ఇతర’ వర్గాలకు చెందినవాడా అని మాత్రమే అడుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఆరోపించారు. ఇంటింటి సర్వేలో కులం గురించిన ప్రశ్నలు సమగ్రంగా లేవని, OBC, జనరల్ […]
Read more

ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు!

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 77వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన పరేడ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. తదనంతరం భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. కాగా, రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని… దేశ అభివృద్ధి ప్రస్తానమైన సాంస్కృతిక గొప్పతనం, ఆర్థిక పురోగతి, సైనిక బలాన్ని మన దేశం అద్భుతంగా ప్రదర్శించింది, ఇందులో క్షిపణులు, ఫైటర్ జెట్‌లు, ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉపయోగించిన అధునాతన ఆయుధాలు ఉన్నాయి. గణతంత్ర వేడుకలకు ఐరోపా […]
Read more

77 ఏళ్ల గణతంత్రం: ముస్లింల గుండెల్లో భయం.. రాజ్యాంగం నీడలో అన్యాయం!

దేశం 77వ గణతంత్ర దినోత్సవ ముంగిట ఉంది. ఎటు చూసినా త్రివర్ణ పతాకాలు, దేశభక్తి గీతాలు. కానీ, అదే జెండా నీడలో ఒక వర్గం పౌరులు తమ ప్రాణాల కోసం, ఆత్మగౌరవం కోసం విలవిలలాడుతున్నారు. గడిచిన రెండు వారాల రక్తచరిత్రను చూస్తే.. మనం జరుపుకునే ఈ వేడుకలు బాధితుల గాయాలపై ఉప్పు చల్లినట్లు అనిపించడం లేదా?రక్తసిక్తమైన వీధులు – మౌనమైన చట్టంమొరాదాబాద్‌లో ఒక యువకుడిని సజీవ దహనం చేసినా, జార్ఖండ్‌లో గుంపులుగా చేరి మనిషిని వేటాడి చంపినా.. […]
Read more

ఓవైసీ రాజకీయాలు…బీజేపీ దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఇంధనం!

ఖమర్ క్రాంతి న్యూఢిల్లీ: సంఘ్-బీజేపీ మాటే ‘ఓవైసీ అజెండా’ అని ఒక నానుడి. వాస్తవానికి ఇదొక లోతైన రాజకీయ వ్యూహం. దీన్ని అర్థం చేసుకోకుండా, ఈ రోజు దేశంలో పెరుగుతున్న అశాంతిని అర్థం చేసుకోవడం అసాధ్యం. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో… ముఖ్యంగా ముస్లిం యువతలో… కోపం, అవమానం, భయం, అదే సమయంలో ఒక నిర్దిష్ట నాయకుడిపై, ఒక నిర్దిష్ట పార్టీపై భావోద్వేగ అనుబంధం కనిపిస్తుంది. కానీ ఈ అనుబంధం రాత్రికి రాత్రే పుట్టుకొచ్చింది కాదు. ఇది ఓ […]
Read more

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌…ఐదుగురు మహిళలు సహా 17 మంది మావోయిస్టులు మృతి!

చైబాసా, జార్ఖండ్: సీపీఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీకి చెందిన ఉన్నత స్థాయి సభ్యుడు పతిరామ్ మాఝీ అలియాస్ అనల్‌దా నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఎన్‌కౌంటర్‌ అయ్యాడు. కాగా, సారండ అడవిలో 209 కోబ్రా, చైబాసా జిల్లా పోలీసులు, జార్ఖండ్ జాగ్వార్ సంయుక్తంగా మేఘాబురు ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈక్రమంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మొత్తం 17 మంది మావోస్టులు మృతి చెందారని ఆపరేషన్‌ ఐజీ మైఖేల్ రాజ్‌ వెల్లడించారు. అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే […]
Read more

బీజేపీ ‘డబుల్ ఇంజిన్’ తమిళనాడులో నడవదు…సీఎం స్టాలిన్‌!

చెన్నై: ప్రధాని మోదీ ‘డబుల్ ఇంజిన్’ వ్యాఖ్యలపై సీఎం స్ఠాలిన్‌ విరుచుకుపడ్డారు. అది తమిళనాడులో నడవదని ఆయన అన్నారు. మధురాంతకంలోని శివారు ప్రాంతంలో జరిగిన ఎన్డీఏ రాజకీయ సభలో ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదాన్ని “డమ్మీ ఇంజిన్” అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు స్టాలిన్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘డబుల్ ఇంజిన్’ ప్రవేశించని తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ […]
Read more
1 2 3 4 5 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.