Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

నిన్న అరెస్టయిన రాహుల్ గాంధీ సహా మిగతా నిరసనకారుల విడుదల!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం వైపు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న సందర్భంగా నిన్న ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విడుదలయ్యారు. ఇక ఈ నేతలతోపాటు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు ఛలో పార్లమెంట్‌లో పాల్గొని అరెస్ట్ అయిన 70 మంది నిరసనకారులకు కూడా విముక్తి లభించింది. నీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఆరోపణలపై జవాబుదారీతనం కోరుతూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ […]
Read more

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్త నిరసనలు!

న్యూఢిల్లీ: ప్రతిపాదిత భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA), ఇతర వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్లు సంయుక్త్ కిసాన్ మోర్చా (SKM) ప్రకటించింది. అలాగే, కేంద్రం ఈ ఒప్పందాలపై సంతకం చేయకుండా అడ్డుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరింది. రాష్ట్రపతికి రాసిన బహిరంగ లేఖలో, ప్రతిపాదిత భారత్-అమెరికా FTAపై సంతకం చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీని ఆదేశించాలని, ఇప్పటికే ఉన్న FTAలను రద్దు చేయాలని, ఆర్థిక వ్యవస్థ, స్వయం సమృద్ధి, జాతీయ సార్వభౌమాధికారంపై […]
Read more

జంతర్‌మంతర్‌ వద్ద పోలీసుల ముసుగులో గుర్తుతెలియని వ్యక్తులు!

న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనకారుల ఆందోళనలో ఢిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) తో పాటు, పేర్లు, యూనిఫాంలు లేని వ్యక్తులు (కొందరు సాధారణ దుస్తులలో) లాఠీలతో కొట్టారనే ఆరోపణలు, వీడియోలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ వ్యక్తులు ఉపయోగించిన లాఠీలకు స్క్రూలు, మేకులు అమర్చారని, దీనివల్ల విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయని బాధితులు పేర్కొన్నారు. దీంతో నిరసనకారులు ఈ అణచివేతను అమలు చేస్తున్న ఆ మనుషులు ఎవరని సూటిగా ప్రశ్నించారు? […]
Read more

‘ఇరాన్‌లో లభించినంత గొప్ప ఆతిథ్యం ప్రపంచంలో మరెక్కడా పొందలేదు’…గోస్వామి సుశీల్ జీ మహారాజ్!

న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరై తిరిగి వచ్చిన ‘భారతీయ సర్వ ధర్మ సంసద్’ (Indian Parliament of All Religions) జాతీయ కన్వీనర్ గోస్వామి సుశీల్ జీ మహారాజ్, తన పర్యటనను జీవితంలో అత్యంత అద్భుతమైన అనుభవాలలో ఒకటిగా అభివర్ణించారు. ఇరాన్ ఆతిథ్యం, ​​ఆ దేశం పట్ల ఉన్న దృక్పథం, భారత్-ఇరాన్ సంబంధాలు, గాజా సంఘర్షణ, ప్రపంచ శాంతి, ప్రపంచ సంక్షోభాల పరిష్కారంలో మతాల మధ్య సంభాషణ (interfaith dialogue) […]
Read more

ప్రధాని మోదీ యువత వ్యతిరేకి…సీజేపీ నిరసనకారులపై హింసపై రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: భారత దేశ చ‌రిత్ర‌లోనే యువ‌త‌ను అత్యధికంగా వ్య‌తిరేకించే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీయేనని కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం దేశ యువతను విఫలం చేయడమే కాకుండా, బలప్రయోగం ద్వారా వారిని చురుకుగా అణచివేస్తోందని ఆరోపించారు. పోటీ పరీక్షలలో పదేపదే జరుగుతున్న పేపర్ లీక్‌లకు నిరసనగా విద్యార్థులతో సహా వేలాది మంది కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) మద్దతుదారులు భారీ నిరసన చేపట్టిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వర్షాకాల […]
Read more

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు…విపక్షాల నినాదాల మధ్య ఉభయసభలు వాయిదా!

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజున ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో లోక్‌సభ కార్యకలాపాలు వాయిదా పడ్డాయి. దివంగత మాజీ ఎంపీలకు నివాళులు అర్పించడం ద్వారా స్పీకర్ ఓం బిర్లా సభ కార్యకలాపాలను ప్రారంభించారు. ఆ వెంటనే, ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించడంతో సభలో గందరగోళం నెలకొంది. శాంతిని పాటించాలని స్పీకర్ బిర్లా మరోసారి సూచిస్తూ, “పార్లమెంటు ప్రజాస్వామ్యానికి అత్యున్నత వేదిక, మాట్లాడేందుకు అందరికీ సమయం కేటాయిస్తామని అన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే […]
Read more

ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థలకు 670 కోట్లకు పైగా CSR నిధులను అందించిన ONGC!

న్యూఢిల్లీ: భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన ‘ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్’ (ONGC), 2013-2025 మధ్య కాలంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో సంబంధం ఉన్న 20 సంస్థలకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల కింద దాదాపు రూ. 671 కోట్లను మళ్లించిందని ‘ది న్యూస్ మినిట్’ (The News Minute) ప్రచురించిన ఒక నివేదిక పేర్కొంది. ఈ 12 ఏళ్ల కాలంలో ONGC ఆయా సంస్థలకు మొత్తం రూ. 670.97 […]
Read more

సీజేపీ ‘చలో పార్లమెంట్’… జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత!

న్యూఢిల్లీ: విద్యా సంస్కరణల డిమాండ్‌తో ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP) ఈరోజు తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌కు ముందు, న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసన ప్రదేశానికి రాజకీయ నాయకులు, నటులు, సామాన్య ప్రజలు భారీగా తరలివచ్చారు. నిర్ణీత కార్యక్రమానికి ముందే సుమారు 20,000 మంది ప్రజలు జంతర్ మంతర్ వద్ద , దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నారని CJP ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ గారూ… మీ జవాబుదారీతనం నిరూపించుకునే సమయం […]
Read more

పేపర్ లీక్‌ల వ్యవహారంలో మొత్తం విద్యా వ్యవస్థే భాగస్వామి, కానీ శిక్ష మాత్రం శూన్యం…రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: భారతదేశ విద్యా వ్యవస్థ మొత్తం పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో భాగస్వామిగా మారిందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనివల్ల 7.5 కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారని, కానీ ఒక్క దోషికి కూడా శిక్ష పడలేదని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగిన ‘ఛాత్రోన్ కీ గూంజ్’ (విద్యార్థుల గొంతుక) ర్యాలీలో మాట్లాడుతూ, అవినీతి, రాజకీయ జోక్యం కారణంగా దేశ పరీక్షా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థుల విశ్వాసాన్ని […]
Read more

సోనమ్ వాంగ్‌చుక్‌ దీక్ష భగ్నం…ఆసుపత్రికి తరలించిన పోలీసులు!

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను ఈరోపు తెల్లవారుజామున పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. నీట్ (NEET) పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా ఆయన నిరసన తెలుపుతున్నారు. సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్నందున, హైకోర్టు ఆదేశాలు, వైద్య నిపుణుల సలహా మేరకు తాము చర్యలు తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. “అవసరమైన వైద్య చికిత్స కోసం […]
Read more
1 3 4 5 6 7 97

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.