Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

డీలిమిటేషన్‌పై అఖిలపక్షం ఏర్పాటు చేయండి…ప్రధాని మోదీని కోరిన తెలంగాణ సీఎం!

హైదరాబాద్: లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 నుంచి 850కి పారదర్శకంగా, సమ్మిళితంగా పెంచాలన్న కేంద్రం ప్రణాళికలపై చర్చించేందుకు, అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. తాను ప్రతిపాదించాలనుకుంటున్న ‘హైబ్రిడ్ నమూనా’ ద్వారా లోక్‌సభ సీట్ల పెంపుపై జాతీయ, రాజకీయ ఏకాభిప్రాయం సాధించాలని, అలాగే శాసనసభలను అనుసంధానం చేయకుండా మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలని ఆయన ప్రధానమంత్రిని కోరారు. “శాసనసభలో మహిళా […]
Read more

ఆప్‌ ఎంపీ అశోక్ మిట్టల్‌కు సంబంధించిన ఆస్తులపై ఈడీ దాడులు!

న్యూఢిల్లీ: రాజ్యసభలో డిప్యూటీ లీడర్‌గా నియమితులైన కొద్ది రోజులకే, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్‌కు సంబంధించిన ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈరోజు దాడులు నిర్వహించింది. పార్లమెంటులో రాఘవ్ చద్దా స్థానంలో మిట్టల్ నియమితులయ్యారు. నివేదికల ప్రకారం… దాడులు జరుగుతున్న ప్రదేశాలలో పంజాబ్‌లోని ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్ కూడా ఉంది. మిట్టల్ లవ్లీ గ్రూప్ యజమాని, ఈ విశ్వవిద్యాలయానికి వ్యవస్థాపకుడు, ఛాన్సలర్. ఆయన సోదరులు రమేష్, నరేష్ ఈ […]
Read more

మణిపూర్‌లోని 40 లోయ స్థానాలకు రాజ్యాంగ రక్షణ కావాలి… కేంద్రానికి లేఖ రాసిన బీజేపీ ఎమ్మెల్యే!

ఇంఫాల్/న్యూఢిల్లీ: మణిపూర్‌లోని 40 ఇంపాల్ లోయ అసెంబ్లీ స్థానాలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలని, ఆ స్థానాలను స్థానిక ప్రజల కోసం ప్రత్యేకంగా కేటాయించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఇమో సింగ్ కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారు. “…కొండ ప్రాంతాలకు ఇప్పటికే పలు సీట్లు రిజర్వ్ చేసారు. జనసాంద్రత అసమతుల్యతను నివారించడానికి, ఈ ప్రాంత సామాజిక-సాంస్కృతిక గుర్తింపును కాపాడటానికి ఈ డిమాండ్ ముందుకు తెచ్చానని ఆయన అన్నారు. లోయలోని ఆదివాసీ ప్రజల కోసం ఉద్దేశించిన 40 సీట్లకు […]
Read more

బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ల ‘విద్వేషపూరిత ఆలోచనా ధోరణి’ రాజ్యాంగాన్ని నాశనం చేస్తోంది…రాహుల్ గాంధీ!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ, దాని సైద్ధాంతిక మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ల “విద్వేషపూరిత ఆలోచనా ధోరణి” భారత రాజ్యాంగాన్ని పద్ధతి ప్రకారం నాశనం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని ఆయన ఆరోపించారు. సభను ఉద్దేశించి రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ… కాషాయ పార్టీ ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని, ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తోందని పేర్కొనారు. “బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు […]
Read more

ఓటరు జాబితా ప్రక్షాళనకు ఈసీ వాడుతున్న అల్గారిథంను రూపొందించింది ఎవరు?

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)పై ఆల్ట్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కోల్‌కతాలోని సబర్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు సాబిర్ అహ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిశీలనలోని ఫలితాలు రూపకల్పనలో పక్షపాతాన్ని, పెద్ద ఎత్తున ఓటర్లను మినహాయించడాన్ని సూచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆల్ట్ న్యూస్, సాబర్ ఇన్‌స్టిట్యూట్ రెండూ బెంగాల్ SIRకు సంబంధించిన భారత ఎన్నికల సంఘం (ECI) డేటాను విశ్లేషించి, ఆందోళనకరమైన ధోరణులను గుర్తించాయి. రాష్ట్రంలో SIR ప్రక్రియ […]
Read more

డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేద్కర్‌…భారత రాజ్యాంగ నిర్మాత!

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి నేడు. ప్రతి ఏటా ఏప్రిల్ 14న ఆ మహనీయుడి జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజును ‘సమానత్వ దినోత్సవం’గా కూడా పిలుస్తారు. ఆయన సంఘ సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన నాయకుడిగా, దళితుల హక్కుల కోసం కృషి చేసిన మహనీయుడిగా చిరస్మరణీయులు. మధ్యప్రదేశ్‌లోని మహౌ (MHow) ప్రాంతంలో 1891లో జన్మించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్… భారతదేశ చరిత్రలో గొప్ప నాయకుడిగా నిలిచారు. చిన్నప్పటి నుంచే […]
Read more

ఢిల్లీ హైకోర్టు జడ్జీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు హాజరయ్యారని ఆరోపించిన కేజ్రీవాల్‌!

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వరనా కాంత శర్మ, ఆర్ఎస్ఎస్‌కు అనుబంధంగా ఉన్న న్యాయవాదుల సంఘం ‘అధివక్త పరిషత్’ నిర్వహించిన ఒక కార్యక్రమానికి నాలుగు సార్లు హాజరయ్యారని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. దీంతో ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగదని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తిని కోరారు. ఢిల్లీ మద్యం విధానం కేసును ‘రాజకీయమైనది’ అని ఆయన అభివర్ణించారు. “అధివక్త […]
Read more

ఉజ్జయినీ విశ్వవిద్యాలయ పరీక్షలో మతపరమైన ప్రశ్నపై వివాదం!

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో ఉన్న సమ్రాట్ విక్రమాదిత్య విశ్వవిద్యాలయం, బి.కామ్, బిబిఏ, బిసిఏ ప్రోగ్రామ్‌ల మూడవ సంవత్సరం విద్యార్థుల ఫౌండేషన్ కోర్సు పరీక్ష పేపర్‌లో మతపరంగా సున్నితమైన ప్రశ్న రావడంతో ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన, విద్యా రంగంలో మతపరమైన పక్షపాతం ఉందంటూ, విస్తృతమైన ఆగ్రహానికి, నిరసనలకు దారితీసింది. హిందీలో ఉన్న వివాదాస్పద ప్రశ్న ఏమిటంటే… “అల్లాహ్ కే శివ దూస్రా కోయీ నహీ హై” (అల్లాహ్ తప్ప వేరే […]
Read more

ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం ‘ఎస్‌ఐఆర్‌’…సీఎం మమతా బెనర్జీ!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కీలకమైన రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు జరిగిన ఈ భారీ సభలో ఆమె మాట్లాడుతూ…బీజేపీ ఓటర్లకు లంచాలు ఇస్తోందని, ఎన్నికల ప్రక్రియను తారుమారు చేస్తోందని ఆమె ఆరోపించారు. ఎన్నికలకు ముందు బీజేపీ ఓటర్లకు నగదు, ప్రలోభాలతో లంచాలు ఇవ్వడం మామూలేనని, కానీ ఓటింగ్ ముగియగానే ఇచ్చిన హామీలన్నింటినీ సౌకర్యవంతంగా మరిచిపోతుందని బెనర్జీ ఆరోపించారు. ఇటీవలి బీహార్ ఎన్నికలను ఆమె దీనికి ప్రధాన […]
Read more

సైబర్‌ మోసాన్ని ఛేదించిన మల్కాజ్‌గిరి పోలీసులు…ఇద్దరి అరెస్ట్‌, 41 లక్షలు రికవరీ!

హైదరాబాద్: మల్కాజ్‌గిరి సైబర్‌క్రైమ్ పోలీసులు ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 10 మధ్య రెండు సైబర్‌క్రైమ్ కేసులను విజయవంతంగా ఛేదించారు. ఈమేరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు కోర్టు ద్వారా రీఫండ్‌లను కూడా ప్రాసెస్ చేసి, బాధితులకు రూ. 41,58,677 తిరిగి వచ్చేలా సహాయపడ్డారు. ఈ సైబర్‌క్రైమ్ నెట్‌వర్క్‌కు భారతదేశం అంతటా సంబంధాలు ఉన్నాయని దర్యాప్తులో తేలింది. ఒక కేసులో, కమీషన్ ప్రాతిపదికన సైబర్ మోసగాళ్లకు బ్యాంకు ఖాతాలను అందించినందుకు హైదరాబాద్‌కు చెందిన ఒక నిందితుడిని […]
Read more
1 3 4 5 6 7 78

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.