Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఫడ్నవీస్‌తో ఉద్ధవ్ భేటీ…మహారాష్ట్రలో ఏం జరుగుతోంది?

ముంబై: మహారాష్ట్రలో ప్రత్యర్థులు మిత్రులుగా మారనున్నారా? పరిణామాలు చూస్తుంటే అవునని అనక తప్పదు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శాసన మండలిలో “మాతో చేరండి” అని ఉద్ధవ్ ఠాక్రేతో చెప్పిన మరుసటి రోజే…గురువారం ఇద్దరూ నేతలు 20 నిమిషాలకు పైగా క్లోజ్డ్ డోర్ సమావేశం నిర్వహించారు. గత రెండు రోజుల్లో వారి మధ్య ఇది మూడవ సమావేశం కావడం గమనార్హం. విధాన భవన్‌లోని విధాన పరిషత్ చైర్మన్ రామ్ షిండే ఛాంబర్‌లో ఈ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రికి మరాఠీ […]
Read more

బీహార్‌ ఓటర్ల జాబితా వివాదం…దుష్ప్రచారాన్ని ఎదుర్కొంటోన్న ముస్లిం ఆధిపత్య సీమాంచల్!

పాట్నా: కిషన్‌గంజ్, అరారియా, పూర్నియా, కతిహార్ జిల్లాలతో కూడిన బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో గణనీయమైన ముస్లిం జనాభా ఉంది. అయితే జూన్ 24న భారత ఎన్నికల సంఘం బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR)ను ప్రకటించినప్పటి నుండి ఈ ప్రాంతం…రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థల దాడికి గురైంది. ఇంతకుముందు, ఎటువంటి ఆధారం లేకుండా ‘అక్రమ విదేశీ వలసదారులు’ ఉన్నట్లు ఆరోపిస్తూ ఈ ప్రాంతం పరువు తీశారు. ఈ జిల్లాల్లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులు […]
Read more

అస్సాం సీఎం జైలుకెళ్లడం ఖాయం…రాహుల్ గాంధీ!

గౌహతి: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు చేశారు. అంతేకాదు ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. గౌహతి నుండి 40 కి.మీ దూరంలో ఉన్న చాయ్‌గావ్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన రాహుల్ గాంధీ మాట్లాడుతూ…‘అస్సాం ముఖ్యమంత్రి తనను ‘రాజు’ అని అనుకుంటున్నారు. కానీ త్వరలోనే ఆయన జైలులో ఉంటారు’ అని అన్నారు. రాష్ట్రంలో అవినీతికి సీఎం, ఆయన […]
Read more

అస్సాంలో బుల్డోజర్‌ న్యాయం…నిరాశ్రయులైన వేలాది ముస్లింలు!

గోల్పారా/న్యూఢిల్లీ: అస్సాంలో చేపట్టిన ఇళ్ల కూల్చివేత కార్యక్రమం దాదాపు 4,000 ముస్లిం మైనారిటీ కుటుంబాలను నిరాశ్రయులను చేసింది. ఇంత పెద్ద ఎత్తున కూల్చివేతల తర్వాత జరిగిన పరిణామాలను అంచనా వేయడానికి జమియత్ ఉలామా-ఇ-హింద్ (JUH) ప్రధాన కార్యదర్శి మౌలానా హకీముద్దీన్ ఖాస్మి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మంగళవారం అస్సాంలోని గోల్పారా జిల్లాను సందర్శించింది. అస్సాం ప్రభుత్వం “వివక్షత, రాజ్యాంగ విరుద్ధమైన” చర్యగా JUH అభివర్ణించింది. JUH ప్రకారం, గోల్పారాలోని అషుదుబి, హసిలాబిల్ ప్రాంతాలలో మొత్తం […]
Read more

ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల అదుపులో బెంగాలీ ముస్లిం వలస కార్మికులు…విమర్శించిన ఎంపీ మహువా మొయిత్రా!

కోల్‌కత: తన కృష్ణ నగర్ నియోజకవర్గానికి చెందిన తొమ్మిది మంది బెంగాలీ ముస్లిం వలస కార్మికులను అదుపులోకి తీసుకున్న ఛత్తీస్‌గఢ్ పోలీసులను…టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా విమర్శించారు. దీనిని “రాష్ట్ర ప్రాయోజిత కిడ్నాప్” అని అభివర్ణించారు. స్థానిక అధికారులకు అవసరమైన పత్రాలను సమర్పించకుండా బస చేసినందుకు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోని… కొండగావ్ పోలీసులు జూలై 12న ఈ కార్మికులను అరెస్టు చేశారు. అనుమానిత వ్యక్తుల నుండి సత్ప్రవర్తనకు భద్రత కోరడానికి సంబంధించిన భారతీయ న్యాయ సంహిత […]
Read more

విశ్వంలో అరుదైన గెలాక్సీని కనుగొన్న భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు!

న్యూఢిల్లీ: భారతదేశం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, గగన్ యాత్రపైదృష్టి సారిస్తుండగా, బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) ఖగోళ శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. సుమారు 25,800 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సుదూర ఓఫియుచస్ నక్షత్రరాశిలో, A980 అనే వింత నక్షత్రాన్ని గుర్తించారు. ఈమేరకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (DST) స్వయంప్రతిపత్తి సంస్థ అయిన IIAలో సీనియర్ ప్రొఫెసర్ గజేంద్ర పాండే మాట్లాడుతూ… తన పిహెచ్‌డి విద్యార్థి అజయ్ సైని తన థీసిస్ […]
Read more

ఒడిశా వేధింపుల బాధితురాలిని ఎయిమ్స్‌లో పరామర్శించిన రాష్ట్రపతి ముర్ము…ప్రిన్సిపాల్ అరెస్టు!

భవనేశ్వర్‌: విద్యాసంస్థల్లో నైతికవిలువలు దిగజారాయి. పవిత్రమైన గురు-శిష్య సంబంధాలు ఘోరంగా పతనమయ్యాయి. తాజాగా ప్రొఫెసర్ లైంగిక వేధింపుల ఆరోపణలతో విద్యార్థిని ఆత్మహత్యా ఘటనే దీనికి నిదర్శనం. తనను తాను నిప్పంటించుకున్న 20 ఏళ్ల కళాశాల విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో, ఒడిశా పోలీసులు ఆ విద్యా సంస్థ ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ 5వ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… ఆ విద్యార్థిని పరామర్శించారు. ప్లాస్టిక్ […]
Read more

బీహార్ ఓటర్ల జాబితా నుండి 35 లక్షలకు పైగా పేర్లను తొలగించాం…ఎన్నికల సంఘం!

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ నిన్న సవరించిన ఓటర్ల జాబితాను విడుదల చేసింది. కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా 35 లక్షలకు పైగా పేర్లు ఓటర్ల జాబితా నుండి తొలగించామని వెల్లడించింది. బీహార్‌లోని మొత్తం 7.89 కోట్ల మంది ఓటర్లలో (88.18 శాతం) 6.60 కోట్లకు పైగా ఓటర్ల జాబితాలో ఉంటారని తెలియజేసింది. నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు చెందిన […]
Read more

కేంద్రం చేతిలో ఎన్నికల కమిషన్ ‘కీలుబొమ్మ’…ఎంపీ కపిల్ సిబల్!

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ ఎప్పుడూ మోడీ ప్రభుత్వం చేతిలో ‘కీలుబొమ్మ’గానే ఉందని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆరోపించారు. బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ మెజారిటీ ప్రభుత్వాలు అధికారంలో ఉండేలా చూసుకోవడం లక్ష్యంగా “రాజ్యాంగ విరుద్ధమైన” చర్య అని పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో, ప్రతి ఎన్నికల కమిషనర్ “ఈ ప్రభుత్వానికి అనుగుణంగా” మునుపటి ఎన్నికల కమిషనర్‌ను అధిగమించారని కూడా సిబల్ ఆరోపించారు. బీహార్‌లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ […]
Read more

బీహార్‌లో ఓటరు జాబితా సవరణపై సుప్రీంకోర్టు ఈసీకి ఏం చెప్పింది?

న్యూఢిల్లీ: బీహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణను నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ చర్యకు వ్యతిరేకంగా అనేక సవాళ్లను విన్న సుప్రీంకోర్టు జూలై 10న ఎన్నికల సంఘాన్ని ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డులను అంగీకరించడాన్ని పరిగణించమని కోరింది. కాగా, ఈ కోర్టు ముందు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో సహా ఈ పిటిషన్ల సమూహంలో ఒక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తారు. పిటిషనర్లు వాదించే ప్రశ్న ప్రజాస్వామ్యం పనితీరు మూలానికి వెళుతుంది. పిటిషనర్ల కేసు ఏమిటంటే, […]
Read more
1 37 38 39 40 41 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.