Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

జనగణన…డిజిటలీకరణ!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనకు మొట్టమొదటిసారిగా డిజటల్‌ విధానాన్ని కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. ఈమేరకు కేంద్రం… సెన్సస్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ CMMS రూపొందించింది. ఈ ప్రత్యేక డిజిటల్‌ పోర్టల్‌ ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద జనాభా లెక్కల సేకరణకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్‌ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపం లోనే సాగుతుంది. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్‌ల్లో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసే వెసులుబాటునూ […]
Read more

మోడీ ఇజ్రాయెల్ పర్యటనను తప్పుబట్టిన కాంగ్రెస్…’యుద్ధ నేరస్థుడితో స్నేహం’ చేస్తున్నారని విమర్శ!

న్యూఢిల్లీ: భారత ప్రతిపక్ష పార్టీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ పర్యటన భారతదేశ చారిత్రాత్మక విదేశాంగ విధాన సూత్రాలకు విరుద్ధమన్నాయి. ఇజ్రాయెల్ విధానాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో మోడీ “నైతిక పిరికితనం” ప్రదర్శిస్తున్నట్టే అని అభివర్ణించాయి. రక్షణ, సాంకేతికత, ద్వైపాక్షిక సంబంధాలతో సహా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడానికి మోడీ ప్రయత్నిస్తున్నప్పటికీ, ఈ పర్యటన స్వదేశంలో విమర్శలను ఎదుర్కొంది. మోడీ […]
Read more

నివాసాల మధ్య వివక్ష రేఖలు!

భారతదేశం ఆధునికత వైపు అడుగులు వేస్తున్నా, సామాజిక అంతరాలు మాత్రం ఇంకా అట్టడుగు స్థాయిలోనే వేళ్లూనుకుపోయి ఉన్నాయని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. అమెరికాలోని ‘నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్’ (NBER) వెల్లడించిన గణాంకాలు విస్తుగొలిపే వాస్తవాలను మన ముందుంచాయి. దేశంలోని సుమారు 15 లక్షల నివాస ప్రాంతాలను విశ్లేషించి రూపొందించిన ఈ నివేదిక, ‘నివాస వేరుచేయడం’ (Residential Segregation) వల్ల ప్రాథమిక ప్రజా సేవలు ఎలా అణగారిన వర్గాలకు దూరమవుతున్నాయో కళ్లకు కట్టింది. అదృశ్య విభజన […]
Read more

అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని ధ్వంసం చేసిన ఏబీవీపీ కార్యకర్తలు!

బెంగళూరు: మూడు దశాబ్దాల క్రితం జరిగిన కునాన్ పోష్‌పురా సామూహిక అత్యాచారంపై అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో ఓ సెమినార్‌ను నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ… అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) సభ్యులు నిన్న ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి చొరబడి, ఆస్తులను ధ్వంసం చేసారు. విద్యార్థులు, భద్రతా సిబ్బందిపై దాడి చేశారని ఆరోపణలు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చేలోపు 20 మంది ABVP కార్యకర్తలు ప్రధాన గేటు వెలుపల ఉన్న విశ్వవిద్యాలయ లోగోను ఇనుప రాడ్లతో ధ్వంసం చేసి, […]
Read more

రాహుల్ గాంధీని ప్రశంసించిన ఒమర్ అబ్దుల్లా!

శ్రీనగర్‌: ప్రతిపక్షనేతగా రాహుల్‌గాంధీ పనితీరును జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ప్రశంసించారు. అదేసమయంలో ఇండియా కూటమిలో నాయకత్వ మార్పు సూచనలను తిప్పికొట్టారు. రాహుల్ గాంధీకి బదులుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారత కూటమికి నాయకత్వం వహించాలని సూచించిన మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. ఇండియా కూటమిలో నాయకత్వ మార్పుపై అలాంటి చర్చ జరగలేదని అబ్దుల్లా అన్నారు. గతంలో కూటమి పనితీరు, కాంగ్రెస్ లేవనెత్తిన “ఓటు చోరి”, ఈవీఎంల రిగ్గింగ్ […]
Read more

‘జిమ్ సభ్యత్వం తీసుకుంటా’…’మహమ్మద్’ దీపక్‌తో భేటీ అయిన రాహుల్!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరాఖండ్‌కు చెందిన జిమ్ యజమాని ముహమ్మద్‌ దీపక్‌తో భేటీ అయ్యారు. అతను ఇటీవల ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో ముస్లిం దుకాణదారుడికి మద్దతుగా నిలిచి, భజరంగ్‌దళ్ కార్యకర్తలను ఎదిరించి “మహమ్మద్ దీపక్”గా వెలుగులోకి వచ్చాడు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ నివాసం 10, జనపథ్‌‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు వైభవ్ వాలియా, జిమ్ యజమాని దీపక్ కుమార్, అతని స్నేహితుడు విజయ్ రావత్ సహా ఇంకా అనేక మంది […]
Read more

మూకదాడిలో గాయపడ్డ మణిపూర్ బిజెపి ఎమ్మెల్యే ప్రధాని మోడీకి లేఖ రాసారని తెలిపిన హిందూ పత్రిక!

న్యూఢిల్లీ: మణిపూర్‌ జాతి అల్లర్ల సమయంలో జరిగిన దారుణమైన మూక దాడిలో గాయాలతో ఫిబ్రవరి 20న మరణించిన బీజేపీ ఎమ్మెల్యే ఐదు నెలల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసారు. ఈ దాడిపై దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేయలేదని సదరు శాసనసభ్యుడి తెలిపారని ది హిందూ పేర్కొంది. 2023 మే ప్రారంభంలో రాష్ట్రంలో మొదటిసారి హింస చెలరేగిన రెండు సంవత్సరాల తర్వాత – మణిపూర్‌లో ప్రధానమంత్రి తొలిసారిగా పర్యటించిన సందర్భంగా – 2025 సెప్టెంబర్ […]
Read more

బెంగాలీ మాట్లాడేవారిని ‘చొరబాటుదారులు’గా ముద్రవేయడం సరికాదన్న మమతా బెనర్జీ!

కోల్‌కత: బెంగాలీ మాట్లాడే ప్రజలను అవమానించడానికి విభజన శక్తులు ప్రయత్నించడం, వారిని “చొరబాటుదారులు (అక్రమ వలసదారులు)”గా ముద్రవేసి వేధించడం పట్ల తాను తీవ్రంగా బాధపడ్డానని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అదే సమయంలో, సంకుచిత రాజకీయాల ద్వారా “బెంగాల్ సంస్కృతిని అణగదొక్కే ప్రయత్నానికి వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎవరినీ నేరుగా లక్ష్యంగా చేసుకోనప్పటికీ, పరోక్షంగా బీజేపీపైనే విమర్శలు ఎక్కుపెట్టినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే దేశంలోని పాలక పార్టీ గత కొన్నేళ్లుగా […]
Read more

తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్ట్‌ అగ్రనేతలు!

హైదరాబాద్‌: మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, రాజిరెడ్డి అలియాస్ గంగన్న తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారితో పాటు మరో 16 మంది సభ్యులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు మొగ్గు చూపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ పట్టుదలకు ఈ లొంగుబాటు ఒక పెద్ద విజయంగా కనిపిస్తోంది. కాగా, దేవ్‌జీ దేవ్జీ కేంద్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మల్లా రాజిరెడ్డి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు […]
Read more

స్క్రాప్ డీలర్ నిజాయితీ: ₹15 లక్షల విలువైన బంగారాన్ని యజమానులకు అప్పగించిన హాజీ అక్తర్ ఖాన్!

-ముజాహిద్ నేటి సమాజంలో నైతిక విలువల కంటే ధనానికే ప్రాముఖ్యత ఇస్తున్న తరుణంలో, హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన ఒక పాత సామాన్ల వ్యాపారి (Scrap Dealer) మానవత్వానికి కొత్త అర్థాన్ని ఇచ్చారు. పొరపాటున పాత సామాన్లతో పాటు అమ్మేసిన సుమారు ₹15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆయన తిరిగి యజమానికి అప్పగించి, తన నిజాయితీని చాటుకున్నారు. అసలేం జరిగింది?స్థానిక నివాసి అయిన అశోక్ శర్మ తన ఇంట్లోని సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగల […]
Read more
1 2 3 4 5 6 71

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.