Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

‘మీకు హోలీ ఇష్టం లేకపోతే ఇంట్లోనే ఉండండి’ యుపీ డీఎస్‌పీ అనుజ్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు!

ఉత్తరప్రదేశ్‌ : పవిత్ర రంజాన్ మాసంలో శుక్రవారం ప్రార్థనలతో పాటు వచ్చే హోలీ పండుగకు ముందు సంభాల్‌ పోలీస్‌ అధికా అనుజ్ చౌదరి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసాయి. సంభాల్ సర్కిల్ ఆఫీసర్ (సిఓ) అనుజ్ చౌదరి గురువారం జరిగిన శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడుతూ…హోలీ రంగులు మీకు అసౌకర్యంగా అనిపిస్తే ఆరోజు ఇంట్లోనే ఉండాలని సూచించారు, హోలీ పండుగ సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది, శుక్రవారం ప్రార్థనలు సంవత్సరానికి 52 సార్లు వస్తాయని వివాదాస్పద […]
Read more

ఏప్రిల్‌ 2 నుంచి భారత్‌పై అమెరికా ప్రతీకార సుంకం…ట్రంప్!

న్యూఢిల్లీ: తమ దేశ వస్తూత్పత్తులపై అధిక సుంకాలు వేస్తున్న  భారతదేశంపై ప్రతీకారం సుంకం ఏప్రిల్ 2 నుండి అమలులోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఆకస్మికంగా అమెరికాకు బయలుదేరారు. ఈ మేరకు అమెరికా అధికారులతో అత్యవసర వాణిజ్య చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, భారతదేశం, మెక్సికో, కెనడా సహా మిగతా దేశాలు మనం వసూలు చేసే దానికంటే […]
Read more

ఉత్తరాఖండ్‌లో ‘మదరసాలు’, మసీదులకు సీలు… రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసించిన ముస్లింలు!

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో ముస్లిం వ్యతిరేక ప్రచారం పవిత్ర రంజాన్ మాసంలోనూ కొనసాగుతోంది. ఇటీవల, డెహ్రాడూన్ జిల్లాలోని అనేక మదర్సాలు, ఒక మసీదుపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత కొన్ని రోజులుగా, అనేక మదర్సాలను సీలు చేశారు. ఇతర మదర్సాలకు నోటీసులు జారీ చేశారు, దీంతో స్థానిక ముస్లిం సమాజం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. . ప్రభుత్వం చేపట్టిన అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన” చర్యలను నిరసిస్తూ మార్చి 4న […]
Read more

రాజ్ భవన్‌లో భద్రతా సమావేశం నిర్వహించిన మణిపూర్ గవర్నర్…శాంతియుత ఉద్యమానికి పిలుపు!

గువహతి: జాతి హింసతో అల్లాడుతున్న మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా, శాంతిభద్రతల పరిస్థితిని అంచనా వేయడానికి మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా రాజ్ భవన్‌లో కీలకమైన భద్రతా సమావేశానికి అధ్యక్షత వహించారు. మార్చి 1న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత, ప్రధాన కార్యదర్శి పికె సింగ్, భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్, డిజిపి రాజీవ్ సింగ్, ఉన్నత సైనిక, పారామిలిటరీ అధికారులు హాజరైన ఈ సమావేశంలో […]
Read more

రంజాన్ సందర్భంగా యూపీలో లౌడ్ స్పీకర్ల తొలగింపు… యోగీ ప్రభుత్వాన్ని తప్పుబట్టిన బీఎస్‌పీ అధినేత్రి మాయావతి!

లక్నో: రంజాన్ సందర్భంగా మసీదుల వద్ద ఏర్పాటు చేసిన అనధికార లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి విమర్శించారు, అన్ని మతాలను సమానంగా, పక్షపాతం లేకుండా చూడాలని అధికారులను కోరారు. “భారతదేశం అన్ని మతాలను గౌరవించే లౌకిక దేశం. అటువంటి పరిస్థితిలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని మతాల అనుచరులను ఎటువంటి పక్షపాతం లేకుండా సమానంగా చూడాలి, కానీ మతపరమైన విషయాలలో కూడా ముస్లింల పట్ల అవలంబిస్తున్న […]
Read more

మతపరమైన గుర్తింపుతో బీజేపీకి లక్ష్యంగా మారానని ఆరోపించిన గుజరాత్‌ ఏకైక ముస్లిం ఎమ్మెల్యే!

గాంధీనగర్: గుజరాత్‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలా మంత్రి జగదీష్ విక్రమ చేసిన ప్రకటనను గట్టిగా వ్యతిరేకించడంతో తీవ్ర వాగ్యుద్ధానికి దారితీసింది. “మత స్థలాల చుట్టూ ఉన్న ఆక్రమణలలో ఎక్కువ భాగం ఒక నిర్దిష్ట సమాజం ద్వారానే జరిగింది” అని విక్రమా పేర్కొనడంతో వివాదం ప్రారంభమైంది. దీనిపై గుజరాత్‌లోని ఏకైక ముస్లిం ఎమ్మెల్యే ఖేడావాలా తీవ్రంగా స్పందించారు. బిజెపి నాయకులు మతపరమైన గుర్తింపు కారణంగా తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. “నేను గుజరాత్‌లో […]
Read more

మణిపూర్, కాశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ వ్యాఖ్యలను ఖండించిన భారత్!

జెనీవా: కశ్మీర్, మణిపూర్‌పై తన గ్లోబల్ అప్‌డేట్‌లో UN మానవ హక్కుల చీఫ్ చేసిన “నిరాధారమైన ” వ్యాఖ్యలను భారతదేశం ఖండించింది, దీనిపై ఢిల్లీ ఆందోళన వ్యక్తం చేసింది. యూఎన్‌ వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని జెనీవాలోని ఐక్యరాజ్యసమితి భారత శాశ్వత ప్రతినిధి రాయబారి అరిందం బాగ్చి అన్నారు. జెనీవాలో జరిగిన మానవ హక్కుల మండలి 50వ సమావేశాల్లో ఐక్యరాజ్యసమితి హైకమిషనర్ వోల్కర్ టర్క్ తన గ్లోబల్ అప్‌డేట్‌లో మణిపూర్, కాశ్మీర్‌ పరిస్థితిని ప్రస్తావించిన తర్వాత భారతదేశం […]
Read more

మార్చి 10న జంతర్ మంతర్ వద్ద వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టనున్న ముస్లిం పర్సనల్ లా బోర్డు!

న్యూఢిల్లీ: వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లును నిరసిస్తూ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB), దళిత, సిక్కు, క్రైస్తవ, ఆదివాసీ, ఓబీసీ సంస్థలతో కలిసి మార్చి 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించనుంది. వక్ఫ్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, ప్రభుత్వం, రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేయడానికి బిల్లుకు వ్యతిరేకంగా వారి గళాన్ని వినిపించడానికి పార్లమెంటు ఎదురుగా ఉన్న జంతర్ మంతర్ వద్ద AIMPLB కార్యనిర్వాహక కమిటీ ధర్నా నిర్వహించాలని […]
Read more

ఉర్దూపై మతతత్వపు మచ్చలు…బీజేపీ పాలనలో ముస్లింల భాష, గుర్తింపుపై దాడి!

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నీడన, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హిందూ జాతీయవాద భావజాలానికి కేంద్రబిందువులలో ఒకటిగా మారింది, ఇది భారతీయ ముస్లింల సాంస్కృతిక, రాజకీయ అస్తిత్వాలను తుడిచిపెట్టడానికి కుట్ర పన్నుతోంది. ముఖ్యమంత్రి యోగి ఆతిధ్యనాథ్ పాలనలో, ఉర్దూ భాషకు వ్యతిరేకంగా తరచుగా ద్వేషపూరిత ప్రసంగాలు వ్యవస్థాగత మతతత్వంలో స్పష్టమైన భాగంగా ఉన్నాయి. ఫిబ్రవరి 18న, ఎస్పీ నేత మాతా ప్రసాద్ బడ్జెట్‌ను ఉర్దూలోకి అనువదించాలని డిమాండ్ చేసినప్పుడు, యోగి స్పందన స్పష్టమైన ఇస్లామోఫోబియా. […]
Read more

ఆయుధాల అప్పగింత గడువును పొడిగించిన మణిపూర్ గవర్నర్!

ఇంఫాల్: మణిపూర్‌లో రెండేళ్లక్రితం ఆయుధశాల నుండి దోచుకున్న 4,000 ఆయుధాలు ఇప్పటికీ డిపాజిట్ చేయకపోవడంతో, మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా గడువును మరో వారం అంటే మార్చి 6వరకు పొడిగించారు. అంతేకాదు కొండ, లోయ ప్రాంతాల ప్రజలు అదనపు సమయం కావాలని డిమాండ్ చేయడంతో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా శుక్రవారం దోచుకున్న మరియు అక్రమ ఆయుధాలను అప్పగించడానికి మార్చి 6 సాయంత్రం 4 గంటల వరకు గడువును పొడిగించారని అధికారిక ప్రకటన తెలిపింది. […]
Read more
1 39 40 41 42 43 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.