Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అంకిత కేసులో సీబీఐ విచారణపై మౌనం వహించిన సీఎం ధామి…నిరసనకారులే క్షమాపణ చెప్పాలని డిమాండ్!

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్ లో సంచలనం సృష్టించిన రిసెప్షనిస్ట్ అంకిత భండారీ హత్య కేసు తీవ్ర వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ హత్యకేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్లపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మౌనంగా ఉన్నారు. మరోవంక భారీ సంఖ్యలో ప్రజలు సీబీఐ విచారణ కోరుతూ వీధుల్లోకి వచ్చారు. దీనిపై నిరసనకారులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడానికి మాత్రం ఆయన గళం విప్పారు. అంకిత కుటుంబం డిమాండ్లపై చట్టపరమైన ఆధారాన్ని ఇంకా పరిశీలిస్తున్నామని […]
Read more

మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న గౌరీ లంకేష్ హత్య కేసు నిందితుడు!

జల్నా: కర్ణాటకలో సంచలనం సృష్టించిన మహిళా జర్నలిస్ట్ గౌరి లంకేష్ హత్య కేసులో నిందితుడైన శ్రీకాంత్ పాంగర్కర్ మహారాష్ట్రలోని జల్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఈ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. ఆయన 13వ వార్డు నుంచి బరిలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థులుగా బీజేపీ, ఇతర పార్టీల అభ్యర్థులు ఉన్నారు. అయితే ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మాత్రం తమ అభ్యర్థిని నిలబెట్టలేదు. యాదృచ్ఛికంగా, నవంబర్ 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, […]
Read more

మనూ భూ వివాదం…ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ దాడి!

హైదరాబాద్: నగరంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి కేటాయించిన 50 ఎకరాల భూమి నిరుపయోగంగా ఉండటంపై వివరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నోటీసు జారీ చేసింది. దీనిపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పాటు యూనివర్సిటీ విద్యార్థుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. నోటీసు జారీ చేసినంత మాత్రాన ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుంటుందని అర్థం కాదని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత నెలలో రంగారెడ్డి జిల్లా […]
Read more

ఎస్ఐఆర్ కోసం బీజేపీ యాప్ వాడుతున్న ఈసీ…ఆరోపించిన మమత!

కోలకత: ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం బీజేపీ ఐటీ విభాగం అభివృద్ధి చేసిన యాప్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) వినియోగిస్తోందని బెంగాల్‌ సీం మమతా బెనర్జీ ఆరోపించారు. ఇది చట్టవిరుద్ధమని… అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు. గంగాసాగర్ మేళా ఏర్పాట్లను సమీక్షించేందుకు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సాగర్ ఐలాండ్‌లో రెండు రోజుల పర్యటన ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం “అన్ని రకాల తప్పుడు చర్యలకు” పాల్పడుతోందని ఆరోపించారు. అర్హతగల ఓటర్లను […]
Read more

ఢిల్లీలో కూల్చివేత డ్రైవ్ సందర్భంగా పోలీసులపై రాళ్ల దాడి…ఐదుగురికి గాయాలు!

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ సమీపంలో ఒక మసీదు వద్ద ఈరోజు తెల్లవారుజామున ఆక్రమణల తొలగింపు డ్రైవ్ హింసాత్మకంగా మారడంతో కనీసం ఐదుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన సుమారు 300 మంది అధికారులు, కార్మికులు తుర్క్‌మన్ గేట్ వద్ద ఉన్న సయ్యద్ ఫైజ్ ఇలాహీ మసీదు,శ్మశానవాటికకు ఆనుకుని ఉన్న భూమిలో కూల్చివేత డ్రైవ్ నిర్వహిస్తున్నప్పుడు ఈ ఘర్షణలు చెలరేగాయి. అయితే, కూల్చివేత డ్రైవ్ సమయంలో, […]
Read more

నోబెల్ గ్రహీత అమర్త్య సేన్‌కు SIR నోటీసు…వివరణ ఇచ్చిన ఎన్నికల కమిషన్‌!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలపై విచారణ కోసం ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌కు భారత ఎన్నికల సంఘం నోటీసు జారీచేసింది. ఈ విషయమై తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ విమర్శలు గుప్పించారు. ఇప్పటికే టీమిండియా పేసర్ మహమ్మద్‌ షమి, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, నటుడు దేవ్‌కు కూడా ఈసీ నోటీసులు ఇవ్వడాన్ని ఆయన ప్రస్తావించారు. ఇదంతా బెంగాల్‌ ప్రజలను లక్ష్యంగా చేసుకోవడమేనని ఈసీపై మండిపడ్డారు. దీనిపై […]
Read more

ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తామన్న మమతా బెనర్జీ!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) ప్రక్రియను “అమానవీయం”గా అభివర్ణించారు. దీనిపై న్యాయపోరాటానికి దిగుతానని ఆమె ప్రకటించారు. ఈ ప్రక్రియ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నేడు కోర్టును ఆశ్రయిస్తానని, అవసరమైతే సుప్రీంకోర్టులోనూ పోరాడతానని దీదీ ఘాటుగా హెచ్చరించారు. ఈమేరకు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సాగర్ ద్వీపంలో జరిగిన ఓ బహిరంగ సభలో […]
Read more

వెనిజులాపై అమెరికా చర్యకు వ్యతిరేకంగా ఢిల్లీలో వామపక్ష పార్టీల నిరసన!

న్యూఢిల్లీ: వెనిజులాపై అమెరికా దాడిని, అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్యను నిర్బంధించడాన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీనికి నిరసనగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వామపక్ష పార్టీలు ధర్నా నిర్వహించాయి. వెనిజులాపై “సామ్రాజ్యవాద సైనిక దురాక్రమణ”ను సిపిఐ(ఎం) నాయకత్వం అమెరికాను ఖండించింది. ప్రపంచవ్యాప్తంగా ఖండించాలని పిలుపునిచ్చింది. ఈ చర్యకు వ్యతిరేకంగా కేంద్రం స్పష్టమైన వైఖరిని తీసుకోవాలని కోరింది. దక్షిణ అమెరికా దేశంలోని చమురు వనరులను “స్వాధీనం” చేసుకోవడానికి అమెరికా వెనిజులాపై దాడి చేసిందని నిరసనకారులు ఆరోపించారు. […]
Read more

ఉమర్‌ ఖాలిద్‌, షర్జీల్‌ ఇమామ్‌కు బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: ఐదేళ్లనాటి ఢిల్లీ అల్లర కేసులో అరెస్టయిన ఉమర్‌ ఖాలిద్‌, షర్జీల్‌ ఇమామ్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద వారిపై ప్రాథమికంగా కేసు ఉందని పేర్కొంది. అయితే ఇదే కేసులో నిందితులైన మరో ఐదుగురికి మాత్రం బెయిలిచ్చింది. ఈ మేరకు జస్టిస్​ అరవింద్​ కుమార్​, జస్టిస్​ ఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం నేడు కీలక తీర్పును వెలువరించింది. కాగా, డిసెంబర్ 10న ఢిల్లీ పోలీసుల తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ […]
Read more

ఇండోర్ నీటి కాలుష్యం…‘ఘంటా’ పదాన్ని ప్రస్తావించినందుకు అధికారి సస్పెండ్!

ఇండోర్/దేవాస్: ఇండోర్ నీటి కాలుష్య సంక్షోభం మధ్య, మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాకు చెందిన ఒక సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్‌ను సస్పెండ్ చేశారు. మంత్రి కైలాష్ విజయవర్గీయ చేసిన వివాదాస్పద వ్యాఖ్యను, కాంగ్రెస్ ఆరోపణలను తన అధికారిక ఉత్తర్వులో ఉటంకించినందుకు ఆయనపై ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక విధులను నిర్వర్తించడంలో తీవ్ర నిర్లక్ష్యం, ఉదాసీనత, అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై ఉజ్జయిని డివిజన్ రెవెన్యూ కమిషనర్ ఆశిష్ సింగ్‌ను సస్పెండ్ చేసినట్లు వారు చెప్పారు. ఆదివారం దేవాస్‌లో కాంగ్రెస్ […]
Read more
1 4 5 6 7 8 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.