Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది…రాహుల్ గాంధీ బహిష్కరణ డిమాండ్‌పై ప్రతాప్ సింగ్ బజ్వా!

న్యూఢిల్లీ: లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని బహిష్కరించాలన్న బీజేపీ నేతల డిమాండ్‌ను పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా ఖండించారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య పునాదులపై దాడిగా ఆయన అభివర్ణించార.ప్రజాస్వామ్యంలో పార్లమెంటు అత్యున్నత జవాబుదారీ వేదిక అని మరియు పౌరుల తరపున ప్రశ్నలు లేవనెత్తడం నేరంగా పరిగణించరని బజ్వా అన్నారు. “పార్లమెంటులో ప్రశ్నలు అడగడం నేరంగా మారితే, ప్రజాస్వామ్యం కూడా ప్రమాదం పడినట్టే. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీకి జాతీయ ప్రాముఖ్యత […]
Read more

యోగి ఆదిత్యనాథ్‌ ఓ అనాగరిక ముఖ్యమంత్రి… అఖిలేష్ యాదవ్!

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై విరుచుకు పడ్డారు. ఆయన మతతత్వవాది, అనాగరిక ముఖ్యమంత్రి”,”నకిలీ యోగి” అని అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ 2017 కి ముందు తన గుర్తింపును కోల్పోయి బిజెపి పాలనలో తిరిగి పొందిందని యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం పాలనా వైఫల్యాల నుండి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తోందని అఖిలేష్‌ యాదవ్ అన్నారు. సమాజ్‌వాదీపార్టీ నేతలు “మాఫియా లీడర్ల సమాధులను సందర్శిస్తారని యోగీ విమర్శిస్తుంటాడు. […]
Read more

తెలంగాణలో ‘ఫుడ్ జిహాద్’ పేరిట సాగుతున్న విద్వేష వంటకం!

హైదరాబాద్: తెలంగాణ పట్టణాల్లోని ఇరుకైన సందులలో, ఇరానీ చాయ్ సువాసనలు, వీధి వెంబడి వేయించే కబాబ్‌ల ఘుమఘుమలతో మిళితమై ఉండే వాతావరణంలో… ఇప్పుడు ఒక కొత్త, ప్రమాదకరమైన ‘విద్వేషపు ఇంధనం’ తోడవుతోంది. ‘వినియోగదారుల హక్కుల పోరాటం’ అనే ముసుగులో కొన్ని తెలుగు యూట్యూబ్ ఛానళ్లు ముస్లిం వీధి వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని, వారి వ్యాపారానికి ‘ఫుడ్ జిహాద్’ అనే మతపరమైన రంగును పులుముతున్నాయి.డిజిటల్ మూకదాడి: ఒక విశ్లేషణఈ ఛానళ్ల వ్యూహం అత్యంత అంచనా వేయదగినదిగా, అంతే ప్రమాదకరంగా […]
Read more

పురివిప్పిన మత విద్వేషం…ఒకే స్కూల్‌లో రెండు వార్షికోత్సవాలు!

సయ్యద్ షరీఖ్ ముంతాజ్ దేశంలో మతవిద్వేషం నానాటికి పెరుగుతోంది. దీంతో ఇండోర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో, రెండు వార్షిక దినోత్సవ వేడుకలు జరపాల్సి వచ్చింది…, ఒకటి హిందూ విద్యార్థులకు, మరొకటి ముస్లింలకు వేరు వేరుగా నిర్వహించాల్సి వచ్చింది. ఈ నిర్ణయం వివక్షత కాదని పాఠశాల చెబుతోంది, కానీ తల్లిదండ్రులు మరో విధంగా చెబుతున్నారు. మతపరమైన ద్వేషం ఇప్పుడు మన జీవితంలో రోజువారీ భాగంగా మారింది, అయితే పిల్లలను దీన్నుంచి తప్పించాలని తల్లిదండ్రులలో ఒకరైన సయ్యద్ ఖాసిం అలీ […]
Read more

వందేమాతరం తప్పనిసరి చేయడం రాజ్యాంగ విరుద్ధం…ముస్లిం పర్సనల్‌ లా బోర్డు!

న్యూఢిల్లీ: అధికారిక కార్యక్రమాల్లో, పాఠశాలల్లో జాతీయ గీతం జనగణమనకు ముందు వందేమాతరంలోని అన్ని శ్లోకాలను పఠించడం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నిర్ణయ రాజ్యాంగ విరుద్ధమని బోర్డు పేర్కొంది. ఈ మేరకు బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా మొహమ్మద్ ఫజ్లూర్ రహీం ప్రభుత్వ నిర్ణయాన్ని ఒక పత్రికా ప్రకటనలో తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, మత […]
Read more

మహమ్మద్ దీపక్‌ను చంపడానికి డబ్బు ఆఫర్ చేసిన వ్యక్తి అరెస్టు!

డెహ్రాడూన్: కోట్ద్వార్‌లో జరిగిన ఒక దుకాణం పేరు వివాదంలో ‘మహమ్మద్ దీపక్’గా ప్రసిద్ధి చెందిన జిమ్ యజమాని దీపక్ కుమార్ హత్యకు రూ. 2 లక్షల రివార్డును ప్రకటించిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. బీహార్‌లోని మోతీహరి నివాసి అయిన నిందితుడు ఉత్కర్ష్ కుమార్ సింగ్ తన ఫాలోవర్స్‌ సంఖ్యను పెంచుకోవడానికి సోషల్ మీడియాలో ఈ సందేశాన్ని పోస్ట్ చేశానని పోలీసులకు చెప్పాడని తెలిపారు. దుకాణం పేరు మార్చమని దాని యజమానిపై ఒత్తిడి తెచ్చేందుకు ఒక బట్టల దుకాణం […]
Read more

అహ్మదాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్‌ మోసాన్ని ఛేదించిన ఈడీ!

హైదరాబాద్: అమెరికా పౌరులను మోసం చేస్తున్న అహ్మదాబాద్‌లోని నకిలీ కాల్ సెంటర్లపై హైదరాబాద్ ఈడీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుజరాత్‌లోని ఆరు ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. క్రిప్టోకరెన్సీ, నగదు స్వాధీనంఈ సోదాల్లో 12,000 విలువైన క్రిప్టోకరెన్సీని గుర్తించి, దానిని ED అధికారిక క్రిప్టో వాలెట్‌కు బదిలీ చేశారు. 31 బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. నిందితులు తమను తాము యూఎస్ అధికారులమని చెప్పుకుంటూ, గిఫ్ట్ కార్డ్‌ల ద్వారా డబ్బులు వసూలు […]
Read more

మైనారిటీలపై తుపాకీ గురిపెట్టిన అస్సాం సీఎం!

గువహటి: బీజేపీ అస్సాం యూనిట్‌ ‘X’ లో ఒక వీడియోను పోస్ట్ చేయడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆ వీడియోలో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తుపాకీతో గురిపెట్టి ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరుపుతున్నట్లు చూపించారు – ఆ ఇద్దరిలో ఒకరు తలకు టోపీ ధరించగా, మరొకరు గడ్డంతో ఉన్నారు. దీనికి- “పాయింట్-బ్లాంక్ షాట్” అనే శీర్షిక పెట్టారు. అయితే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో ఆ వీడియోను బీజేపీ తొలగించింది. కానీ ఈ వీడియో […]
Read more

ఏకాభిప్రాయం ద్వారా ఉమ్మడి పౌర స్మృతిని రూపొందించాలి…ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్!

ముంబయి: అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకొని ఉమ్మడి పౌర స్మృతిని (యూసీసీ) రూపొందించాలని, అది విభేదాలకు దారితీయకూడదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధిపతి మోహన్ భాగవత్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో జరిగిన సంభాషణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై భాగవత్ మాట్లాడుతూ… ఒప్పందాలలో ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుందని అన్నారు. “అది ఇరుపక్షాలకూ లాభదాయకంగా ఉండాలి… మనం నష్టపోకుండా చూసుకోవాలని అన్నారు.” హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ […]
Read more

బడ్జెట్ 2026లో మైనారిటీల పట్ల వివక్ష చూపిన కేంద్రం!

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కేవలం రూ.3,400 కోట్లు మాత్రమే కేటాయించడం, 20% జనాభా ఉన్న మైనారిటీలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. నిధుల కోత, స్కాలర్‌షిప్‌ల తగ్గింపు, విద్యా రుణాల సబ్సిడీల నిలిపివేత వంటి నిర్ణయాలు మైనారిటీల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని రూఢీ అవుతోంది. ఇది కేవలం సంప్రదాయ బడ్జెట్ లావాదేవీల (eyewash) వ్యవహారంగా మిగిలిపోయిందని విమర్శలు వస్తున్నాయి. కాగా, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2006లో ముస్లిం మైనారిటీ వర్గం సంక్షేమం కోసం […]
Read more
1 4 5 6 7 8 71

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.