Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

భారతదేశ ‘బాహుబలి’ రాకెట్ ప్రయోగం విజయవంతం!

న్యూఢిల్లీ: భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ‘బాహుబలి’ రాకెట్‌గా పేరొందిన అమెరికాకు చెందిన ‘బ్లూ బర్డ్‌ 2’ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. భారత్‌- అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రయోగం ఈరోజు ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించారు. 24 గంటల కౌంట్‌డౌన్ ముగిసిన తర్వాత, రెండు S200 సాలిడ్ బూస్టర్‌ల మద్దతుతో 43.5 మీటర్ల పొడవైన రాకెట్ ఉదయం 8గంటల 55 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ […]
Read more

లౌకికవాదం కారణంగా దేశం ఇప్పటికీ ‘సమస్యలను’ ఎదుర్కొంటోంది…కేంద్ర మంత్రి గడ్కరీ!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లౌకికవాదంపై ఉన్న ఆలోచనలు, దాని ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా దేశం… ఇప్పటికీ “హిందూ-ముస్లిం సమస్యలను” ఎదుర్కొంటోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ…ఆంగ్ల పదం “సెక్యులర్”కు హిందీలో “సర్వ ధర్మ భావ” అని, ఆంగ్లంలో “అందరికీ న్యాయం, ఎవరినీ బుజ్జగించకపోవడం” అని అర్థం. అయితే కాంగ్రెస్ తన ఆలోచనల ఆధారంగా వర్ణించినట్లుగా “ధర్మనిరపేక్ష” అని కాదని గడ్కరీ అన్నారు. “1947 తర్వాత, దేశాన్ని పాలించే […]
Read more

మూక ఉన్మాదానికి బలిపీఠం కావాలా? బంగ్లాదేశ్ ఆత్మశోధన చేసుకోవాల్సిన సమయమిది!

ముహమ్మద్ ముజాహిద్, 9640622076 బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ జిల్లాలో 25 ఏళ్ల యువకుడు దీపు చంద్ర దాస్‌పై జరిగిన అమానుష హత్య, కేవలం ఒక మైనారిటీ పౌరుడి ప్రాణహరణ మాత్రమే కాదు; అది ఆ దేశ ప్రజాస్వామ్య విలువలకు, చట్టబద్ధ పాలనకు తగిలిన పరాభవం. కేవలం వదంతుల ఆధారంగా, ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా ఒక మనిషిని కట్టేసి, చిత్రహింసలు పెట్టి, సజీవ దహనం చేయడం అనేది ఆధునిక నాగరిక సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. వేలమంది ప్రేక్షకులు […]
Read more

మహారాష్ట్ర స్థానిక ఫలితాల తర్వాత ఐక్యతా రాగం…రాహుల్ గాంధీకి పిలుపు!

ముంబై: మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం కేవలం 24 గంటల్లోనే గణనీయంగా మారిపోయింది. ఆదివారం వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని అధికార కూటమిలో ఉత్సాహాన్ని నింపగా, ప్రతిపక్ష శిబిరంలో ఆందోళన గంటలు మోగించాయి. తాజా పరిణామాలు బీజేపీ బలమైన ప్రదర్శన కారణంగా ప్రతిపక్షాలు తమ కూటమిలోని అంతర్గత విభేదాలను పునఃపరిశీలించుకోవలసి వచ్చిందని సూచిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో తొమ్మిది స్థానాలు గెలుచుకున్న ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన సీనియర్ […]
Read more

ఎన్‌ఐఏ చరిత్రలో తొలిసారిగా ‘నేరాంగీకారం’ అనే పదం పాపులర్ అయింది!

ఎన్‌ఐఏ దర్యాప్తు తీరుపై ‘ద వైర్‌’ సమగ్ర కథనం బెంగళూరు/హైదరాబాద్: ఒబైద్-ఉర్-రెహమాన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఆరు నెలలకు పైగా గడిపిన తర్వాత, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)తో సహా పలు ఏజెన్సీలు జైలులో ఉన్న అతడిని ఆకస్మికంగా సందర్శించడం ప్రారంభించాయి. 2012 ఆగస్టులో అరెస్ట్ అయినప్పుడు కేవలం 21 ఏళ్ల వయస్సున్న, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి అయిన రెహమాన్, లష్కర్-ఎ-తయ్యబా (ఎల్‌ఈటీ) అనే ఉగ్రవాద సంస్థలో భాగస్వామ్యం ఉన్నాడనే ఆరోపణలపై, బెంగళూరులో మితవాద […]
Read more

భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ ప్రతిపాదిస్తోంది…రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: అందరికీ సమాన హక్కులు కల్పించే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ ప్రతిపాదిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ పార్టీని అధికారం నుంచి తొలగించడంలో విజయం సాధించే ప్రతిపక్ష వ్యవస్థను సృష్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత వారం బెర్లిన్‌లోని హెర్టీ స్కూల్‌లో రాహుల్‌ మాట్లాడుతూ… బీజేపీ దేశంలోని సంస్థాగత వ్యవస్థపై దాడి చేసి, దానిని తన రాజకీయ అధికారాన్ని పెంచుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. దీనిపైనే ప్రతిపక్షం పోరాడుతోందని అన్నారు. […]
Read more

తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ…హైదరాబాద్ ఎన్ఆర్ఐలలో గందరగోళం!

హైదరాబాద్: తెలంగాణలో మూడవ దశలో జరగనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు ముందు, ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉంటాయో లేదోనని ప్రవాస భారతీయులు (NRI’s) గందరగోళానికి గురవుతున్నారు. దేశంలోని తమ బంధువులు ఓటరు నమోదు ఫారమ్‌ను పూరించవచ్చా లేదా అనే దానిపై వారు అయోమయంలో ఉన్నారు. హైదరాబాద్ ఎన్ఆర్ఐల ఆగమాగంఈమేరకు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఎన్ఆర్ఐ మాట్లాడుతూ…హైదరాబాద్‌లో ఓటర్లుగా నమోదు చేసుకుని, ఆ తర్వాత మెరుగైన అవకాశాల కోసం లేదా […]
Read more

“హిందూ మతమే సుప్రీం”, ముస్లింలు సూర్య నమస్కారం చేయాలి…ఆర్‌ఎస్‌ఎస్‌ నేత!

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సీనియర్ నాయకుడు దత్తాత్రేయ హోసబాలే ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడుతూ… హిందూమతం “సర్వోన్నతమైనది” అని అన్నారు. భారతదేశంలోని ముస్లింలు… నదులు, చెట్లు, సూర్యుడిని పూజించడం వంటి ఆచారాలను పాటించాలని సూచించారు. వీటిని పర్యావరణ పరిరక్షణ, శారీరక శ్రేయస్సు కోసం తీసుకునే చర్యలుగా ఆయన అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు హాజరైన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. […]
Read more

అమెరికా సుంకాలతో తిరుపూర్ వస్త్ర పరిశ్రమకు భారీ నష్టాలు!

తిరుపూర్: భారతీయ దిగుమతులపై అమెరికా 50% సుంకాల కారణంగా తిరుపూర్ వస్త్ర పరిశ్రమ కుదేలవుతోంది. అదేసమయంలో అమెరికాలోని కొనుగోలుదారుల నుండి కొత్త ఆర్డర్లు నిలిచిపోవడంతో అక్టోబర్ నుండి ఇప్పటిదాకా రూ. 3,600 కోట్లు నష్టపోయింది. ఈ ఏడాది ఆగస్టులో సుంకాలు అమల్లోకి వచ్చిన తర్వాత, ఎగుమతిదారులు కొనుగోలుదారులకు 20-25% భారీ తగ్గింపులు ఇచ్చి, పూర్తి చేసిన వస్తువులను అమెరికాకు రవాణా చేయడం వల్ల జరిగిన నష్టాలకు ఇది అదనం. అమెరికా నుండి వ్యాపారం కోల్పోవడంతో పాటు, ఎగుమతిదారులు […]
Read more

తమిళనాడులో ఎస్ఐఆర్…97.4 లక్షల ఓటర్లను తొలగింపు!

చెన్నై: తమిళనాడులో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుండి మొత్తం 97.4 లక్షల మంది ఓటర్లను తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర ఓటర్ల జాబితాలో 5.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 27 నాటికి ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు ఓటర్ల జాబితాలో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఆమె చెప్పారు.కొత్త ముసాయిదా ప్రకారం మొత్తం ఓటర్ల జాబితాలో […]
Read more
1 7 8 9 10 11 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.