Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

పదేళ్లలో తెలంగాణను నంబర్ 1 రాష్ట్రంగా మారుస్తాం: సీఎం రేవంత్‌ రెడ్డి!

కొత్తగూడెం/హైదరాబాద్: పంచాయతీ రాజ్ ఎన్నికల్లో అభివృద్ధికి ఓటు వేసి మంచి సర్పంచ్‌లను ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో రాజకీయ వర్గీకరణ ఆపాలని, తెలంగాణను దేశంలో నంబర్ ఒన్‌ రాష్ట్రంగా మార్చడానికి 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి… సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు […]
Read more

మహిళా సాధికారతే తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌కు మూలస్తంభం…మంత్రి సీతక్క!

హైదరాబాద్‌: తెలంగాణ మహిళల సాతాధికారతే విజన్‌ డాక్యుమెంట్‌కు కీలకమని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్–2047రూపకల్పనలో భాగంగా ఆమె మాట్లాడుతూ…తెలంగాణ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 52.7 శాతంగా ఉందని, దానిని 2047 నాటికి 95 శాతానికి చేరేలా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేయాలని సూచించారు. ఇందులో భాగంగా మహిళల సాధికారత, ఆర్థిక అభివృద్ధి, సంరక్షణ పోషకాహారం అంశాలపై చేపట్టాల్సిన కీలక చర్యలపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. […]
Read more

‘తాగుబోతులకు ఓ దేవుడు’ అన్న సీఎం వ్యాఖ్యలపై రగడ!

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు హిందూ దేవతల ఉనికిని అపహాస్యం చేసిన తర్వాత ఆయనపై రాజకీయ విమర్శలు వచ్చాయి, ప్రతిపక్ష బిజెపి, బిఆర్ఎస్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. గాంధీ భవన్‌లో జరిగిన పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. “హిందువులకు ఎంత మంది దేవతలు, దేవుళ్ళు ఉన్నారు?, మూడు కోట్ల మంది ఉన్నారా?” అని ఆయన అంటూ ‘పెళ్ళికాని వారికి హనుమంతుడు, రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వారికో […]
Read more

వరంగల్‌లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడంపై ఎంపీ కావ్య ఆందోళన!

న్యూఢిల్లీ: నిన్నటినుండి ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య తన నియోజకవర్గంలో సమస్యలపై గళమెత్తారు. ముఖ్యంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY)పై నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. వరంగల్ జిల్లాలో కార్యాచరణ కేంద్రాలు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు, పరిశ్రమ సంబంధాలు, ఉపాధి ఫలితాలపై వివరాలు కావాలని ఆమె డిమాండ్ చేశారు. మొదట్లో PMKVY ప్రారంభించినప్పటి నుండి ఎనిమిది శిక్షణా […]
Read more

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత….దేవరకద్ర ఎమ్మెల్యే!

మహబూబ్ నగర్: మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే ఒక్కొక్కటి నెరవేరుస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈమేరకు భూత్పూర్ మునిసిపాలిటీ కేంద్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం మహిళా అభివృద్ధి ఇతోధికంగా దోహదపడుతుందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, అమ్మ ఆదర్శ పాఠశాలలు, మహిళలు నిర్వహించే పెట్రోల్ బంక్‌లు, ₹500 గ్యాస్ […]
Read more

పటాన్‌చెరువు ఎమ్మెల్యే సోదరుడి 80 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ!

హైదరాబాద్: అక్రమ మైనింగ్ కేసులో తెలంగాణ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు యాజమాన్యంలోని సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లైకి చెందిన రూ.80 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లై అక్రమ మైనింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తుకు సంబంధించి, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ), 2002 నిబంధనల ప్రకారం రూ.80.05 కోట్ల విలువైన అనేక స్థిర, చరాస్తులను ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ తాత్కాలికంగా అటాచ్ చేసింది. […]
Read more

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ఏర్పాట్లను సమీక్షించిన సీఎం రేవంత్!

హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ భూముల్లో డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కోసం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అన్ని విభాగాలు ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌’లో పాలుపంచుకోవాలని కోరారు. వేదిక వద్ద ఏర్పాట్లను సమీక్షించిన ముఖ్యమంత్రి, అనేక మంది విఐపిలు, ప్రముఖుల […]
Read more

‘ఫ్యూచర్ సిటీ’లో ఈశాన్య రాష్ట్రాలకు ఉచిత స్థలం…సీఎం రేవంత్‌రెడ్డి!

హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనున్న ‘ఫ్యూచర్ సిటీ’లో ఈశాన్య రాష్ట్రాలకు సొంత భవనాలు నిర్మించుకోవడానికి భూమి కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ భవనాలు భారతదేశంలోనే మొట్టమొదటి ‘నార్త్-ఈస్ట్ కనెక్ట్’ కేంద్రం అవుతాయని ఆయన అన్నారు. నిన్న రాత్రి ఇక్కడ జరిగిన ‘తెలంగాణ – నార్త్-ఈస్ట్ కనెక్ట్ టెక్నో – కల్చరల్ ఫెస్టివల్’లో ఆయన మాట్లాడుతూ… అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలకు ‘ఫ్యూచర్ […]
Read more

డ్వాక్రా గ్రూపు మహిళలకు సీఎం రేవంత్‌ కానుక!

హైదరాబాద్‌: డ్వాక్రా సంఘాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభవార్త వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళా సంఘాలు ఉత్ప‌త్తి చేస్తున్న వివిధ వ‌స్తువులను ఈ కామర్స్ ద్వారా మార్కెటింగ్‌ చేసేందుకు అమెజాన్‌తో సంప్ర‌దింపులు చేస్తున్నట్లు వెల్లడించారు. స్వయం సహాయక బృందాలు ఉత్పత్తి చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌ను అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం అన్నారు. ఈమేరకు నిన్న జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో, స్వయం సహాయక బృందాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఆన్‌లైన్ మార్కెట్‌ను సృష్టించాలని […]
Read more
1 20 21 22 23 24 52

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.