Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

‘X’లో హలీం బహిష్కరణ పిలుపు…తిప్పికొట్టిన నెటిజన్లు!

హైదరాబాద్: ప్రస్తుతం రంజాన్ సీజన్ కావడంతో ప్రజలు తమ సమీప హలీమ్ అవుట్‌లెట్‌లకు భారీగా క్యూ కడుతున్నారు. దీంతో కొంతమంది ఈ వంటకం ప్రజాదరణను భరించలేక, దానిని పూర్తిగా బహిష్కరించాలని సోషల్‌మీడియాలో పిలుపునిచ్చారు. ఈమేరకు Tathvam-asi ఖాతా నుండి X లో పోస్ట్ చేసారు. ఈ సీజన్‌లో హలీమ్ తినబోమని ప్రమాణం చేయాలని హిందువులకు పిలుపునిచ్చింది. కాగా, హిందువులు హలీమ్‌ను బహిష్కరించాలన్న పిలుపు (#SayNoToHaleem) తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ వర్గం చేసిన ఈ ప్రయత్నాన్ని నెటిజన్లు తిప్పికొట్టారు. […]
Read more

‘మెట్రో’ టేకోవర్‌కు తెలంగాణ క్యాబినెట్‌ ఓకే!

హైదరాబాద్‌: హైదరాబాద్ మెట్రో టేక్‌ఓవర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంది. 2026 మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని, ఎల్‌అండ్‌టీ అప్పులను (సుమారు ₹13,000 కోట్లు) ప్రభుత్వం భరించి, 90% ఈక్విటీని తీసుకునేలా, మెట్రోను పూర్తిగా ప్రభుత్వపరం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం తన ఈక్విటీ పెట్టుబడి కోసం ఎల్ అండ్ టీకి రూ.2,000 కోట్లు కూడా చెల్లిస్తుంది. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు అనుమతి కావాలంటే […]
Read more

తెలంగాణ గ్రామపంచాయతీలకు రూ.387.53 కోట్లు విడుదల చేసిన కేంద్రం!

హైదరాబాద్: తెలంగాణలోని పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. ఈమేరకు కేంద్రం రూ.387.53 కోట్లు ఇచ్చింది. తెలంగాణలోని పంచాయతీలకు కొత్త సర్పంచ్‌లు రావడంతో కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క కేంద్రాన్ని కోరారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక శాఖ… దశలవారీగా నిధులను విడుదల చేయడం ప్రారంభించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లలో మొదటి విడతగా కేంద్రం ఫిబ్రవరి 5న […]
Read more

తెలంగాణలో ‘ఎస్‌ఐఆర్‌’ కోసం ఈఆర్‌ఓలకు శిక్షణ ఇచ్చిన సీఈఓ!

హైదరాబాద్‌: తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) సర్వేకు కావాల్సిన ముందస్తు ఏర్పాట్ల ప్రక్రియ రాష్ట్రంలో వేగంగా కొనసాగుతోంది. ఈమేరకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి నాలుగు కీలక జిల్లాలైన – మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి,హైదరాబాద్ నుండి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ (ERO) కోసం సమగ్ర శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 50 మంది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు, ఇది రాబోయే స్పెషల్ ఇంటెన్సివ్ […]
Read more

తరావీహ్ సందర్భంగా మసీదు దగ్గర నినాదాలు…హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఉద్రిక్తత!

హైదరాబాద్: నిన్న రాత్రి స్థానిక జామియా మసీదులో తరావీహ్ నమాజ్ జరుగుతుండగా… శివాజీ మహారాజ్ జయంతి ఊరేగింపులో పాల్గొన్న కొంతమంది నినాదాలు చేయడంతో అంబర్‌పేటలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక నివేదికల ప్రకారం…రాత్రి 10 గంటల ప్రాంతంలో మసీదులో నమాజ్ చేస్తున్న సమయంలో ఊరేగింపులో పాల్గొన్న కొందరు నినాదాలు చేయడంతో సమస్య చెలరేగింది. దీనికి నమాజ్‌ చేసుకుంటున్న వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వెంటనే అదనపు పోలీసులను సంఘటనా […]
Read more

వచ్చే ఐదేళ్లలో పట్టణ ప్రాంతాల నుండి పరిశ్రమలను తరలిస్తాం…సీఎం రేవంత్‌ రెడ్డి!

ముంబయి: రానున్న ఐదేళ్లలో తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమలు, ఫ్యాక్టరీలు ఉండవని, గ్రామీణ ప్రాంతాలకు లేదా హైదరాబాద్ శివార్లలోకి మారే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ముంబైలో జరిగిన క్లైమేట్ వీక్ (2026) సదస్సులో సీఎం కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ దీర్ఘకాలిక అభివృద్ధి దృక్పథాన్ని వివరించారు, ఆర్థిక వృద్ధిని పర్యావరణ స్థిరత్వంతో అనుసంధానించారు. ఆర్థిక వ్యవస్థ లేదా కరెన్సీ విలువ విద్యుత్, ఇంధన వినియోగానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుందని నొక్కి చెప్పారు. 2030 నాటికి […]
Read more

రంజాన్ మత సామరస్యానికి ప్రతీక…సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్‌: రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో సెక్యులరిజం, మత సామరస్యానికి తెలంగాణ ఒక సజీవ ఉదాహరణగా నిలుస్తుందని సీఎం చెప్పారు. రంజాన్ పవిత్ర నెల దానికి ఒక చిహ్నమని ఆయన చెప్పారు. ముస్లింలు పవిత్ర మాసం అంతా పాటించే ఉపవాసాలు, ప్రార్థనలు ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, భక్తిని పెంపొందిస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో లౌకికవాదం, మత సామరస్యానికి తెలంగాణ ప్రతిరూపంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ముస్లింలు […]
Read more

‘కోవా బన్ వ్యాపారి’కి మద్దతుగా నిలిచిన మంత్రి నారాలోకేష్‌!

అమరావతి: మేడారం జాతరలో కోవా బన్ విక్రయించే చిరు వ్యాపారి షేక్ వలీని యూట్యూబర్లు వేధించిన ఘటనపై ఏపీ సీఎం తనయుడు, మంత్రి నారా లోకేష్ మద్దతు ప్రకటించారు. బాధితుడికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలుగు సమాజంలో విద్వేషాలకు చోటు లేదని స్పష్టం చేశారు. త్వరలోనే వలీని కలిసి ఆయన కోవా బన్‌ను రుచి చూస్తానని లోకేష్ X ద్వారా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన షేక్ షేక్షా వలి అనే విక్రేతకు ఎదురైన వేధింపుల […]
Read more

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం, పట్టు కోల్పోయిన బీఆర్ఎస్!

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది. మొత్తం ఏడు కార్పోరేషన్లకు గాను ఐదింటిని కైవసం చేసుకుంది. ఎంఐఎంతో మిత్రత్వం కారణంగా నిజామాబాద్‌ కార్పొరేషన్‌ కూడా కాంగ్రస్‌ ఖాతాలోకి చేరే అవకాశముంది. ఇక 116 మున్సిపాలిటీల్లో 78 స్థానాలను అధికార పార్టీ గెలుచుకుంది. మొత్తం 5,992 వార్డులకు గాను 3,074 స్థానాలను గెలుచుకుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఫలితాల ప్రకారం తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సాధించిన […]
Read more

మున్సిపోల్స్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభం!

హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపోల్స్‌ ఓట్ల లెక్కింపు కొద్దిసేపు క్రితమే ప్రారంభమైంది. మొత్తం 116 మునిసిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు సహా 123 పట్టణ స్థానిక సంస్థల (ULB) ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆపై సాధారణ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఇందుకోసం అవసరమైన కౌంటింగ్ సూపర్‌వైజర్లు, సహాయకులను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నియమించింది. భారత న్యాయసంహిత సెక్షన్ 163 లెక్కింపు కేంద్రాలలో, చుట్టుపక్కల అమలులో […]
Read more
1 2 3 4 5 41

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.