Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

పురానాపుల్ హింసపై ఆందోళన వ్యక్తం చేసిన జమాతే-ఇ-ఇస్లామి!

హైదరాబాద్: పాతబస్తీ పురానాపుల్ ప్రాంతంలో ఇటీవల జరిగిన హింసాకాండపై జమాతే-ఇ-ఇస్లామి హింద్, గ్రేటర్ హైదరాబాద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ ఆలయ విధ్వంసం జరిగినట్టు వచ్చిన వదంతులు మత ఘర్షణలకు దారితీసాయి. ఇటువంటి సంఘటనలు నగరంలో సామాజిక సామరస్యాన్ని “తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి”, వాటిని తీవ్రంగా ఖండించాలి అని ఆ సంస్థ నొక్కి చెప్పింది. ప్రార్థనా స్థలంపై దాడి జరిగిందనే తప్పుడు పుకార్ల వల్ల అశాంతి చెలరేగిందని జమాతే-ఇ-ఇస్లామి హింద్ హైదరాబాద్‌ నగర అధ్యక్షులు ముబాషిర్ అహ్మద్ […]
Read more

సదరన్ కమాండ్ హెడ్‌ఆఫీస్‌ను హైదరాబాద్‌కు తరలించండి… ఆర్మీని కోరిన సీఎం రేవంత్‌రెడ్డి!

హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో పౌర-సైనిక సమన్వయ సమావేశం సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగింది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున పలు విజ్ఞప్తులను ముఖ్యమంత్రి ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. భారత సైన్యానికి చెందిన సదరన్ కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని పుణే నుండి హైదరాబాద్‌కు తరలించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా సీఎం అభ్యర్థించారు. అంతేకాదు సైన్యం, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఉన్న భూ సమస్యలు, ఇతర పరిపాలనా సమస్యలను వేగంగా పరిష్కరించడంపై చర్చలు జరిగాయి. […]
Read more

మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్‌ ఇచ్చిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ !

హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపుల కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈమేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఊరట కల్పించారు. కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి స్పీకర్ ఒక నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారు. వారు పార్టీ మారారని చెప్పడానికి ఎటువంటి బలమైన ఆధారాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను అధికారికంగా బీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తున్నారు, దీంతో వారిపై దాఖలైన పిటిషన్లు కొట్టివేశారు. ఇటీవలే ఐదుగురు […]
Read more

మేడారం జాతరకు 3 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా…మంత్రి సీతక్క!

హైదరాబాద్: ఈ ఏడాది ‘మేడారం జాతర’కు దాదాపు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ గిరిజన పండుగ జనవరి 28 నుండి 31 వరకు ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారం అటవీ ప్రాంతంలో జరుగుతుందని ఆమె చెప్పారు. పండుగ ఏర్పాట్లను సమీక్షించడానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, వివిధ శాఖల సీనియర్ అధికారులు, ములుగు […]
Read more

తెలంగాణ మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లను ఖరారు!

హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కీలక అడుగు పడింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం 121 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో వార్డులు, చైర్‌పర్సన్లు/మేయర్ల పదవులకు రిజర్వేషన్లను ఖరారు చేసింది. షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), వెనుకబడిన తరగతులు (బీసీలు), మహిళలకు రిజర్వేషన్లకు సంబంధించి మున్సిపల్ పరిపాలన శాఖ నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు మించకుండా మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు […]
Read more

చార్మినార్‌ జోన్‌లో ‘ఆపరేషన్ కవచ్’ నిర్వహించిన పోలీసులు!

హైదరాబాద్: నగరంలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ నగర పోలీసులు చార్మినార్ జోన్‌లో ‘ఆపరేషన్ కవచ్’ కింద భద్రతా చర్యలు చేపట్టారు. నగరంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడానికి ప్రజా భద్రత, నేరాల నివారణ , విజిబుల్ పోలీసింగ్‌పై ఈ ప్రత్యేక డ్రైవ్ దృష్టి సారించింది. చార్మినార్ డీసీపీ కిరణ్ ఖరే పర్యవేక్షణలో, దాదాపు 200 మంది పోలీసు సిబ్బందితో ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్ల నుండి సైదాబాద్ ఎక్స్ రోడ్ల వరకు పెద్ద […]
Read more

వార్తా ఛానెళ్లపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన తెలంగాణ ఐఏఎస్‌ల సంఘం!

హైదరాబాద్: మహిళా ఐఏఎస్ అధికారులు, ఒక రాష్ట్ర మంత్రిని లక్ష్యంగా చేసుకుని “అపమానకరమైన, నిరాధారమైన కంటెంట్”ను ప్రసారం చేసిన అనేక ప్రైవేట్ న్యూస్ ఛానెళ్లపై తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారులు NTV, తెలుగు స్క్రైబ్, MR మీడియా తెలంగాణ, ప్రైమ్9 తెలంగాణ, PVNews, సిగ్నల్ టీవీ, వోల్గా టైమ్స్, మిర్రర్ టైఆఫీషియల్, Tnews తెలుగు ఛానల్‌లపై కేసులు నమోదు […]
Read more

జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సమీక్షకు కమిటీ ఏర్పాటు…సీఎం రేవంత్‌ రెడ్డి!

హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం త్వరలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్‌ను నియమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక్కడ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణను అహేతుకంగా చేపట్టారని అన్నారు. “జిల్లాల, మండలాల పునర్వ్యవస్థీకరణపై మాకు వినతులు వస్తున్నాయి. రాజకీయ కారణాల ఆధారంగా (జిల్లాలపై) నిర్ణయాలు తీసుకుంటే న్యాయం […]
Read more

అధిక జనాభా ఉన్న పట్టణాల్లో అదనపు తహసీల్దార్ల నియమిస్తామన్న మంత్రి పొంగులేటి!

హైదరాబాద్‌: జనాభా అధికంగా ఉన్న పట్టణాల్లో ప్రభుత్వం అదనపు తహసీల్దార్లను నియమిస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం 1.5 లక్షల నుంచి 2 లక్షల జనాభా ఉన్న అనేక పట్టణాల్లో కేవలం ఒకే తహసీల్దార్ ఉన్నారని, దీనివల్ల పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. ఒకే తహసీల్దార్ ఇంత పెద్ద జనాభాను సమర్థవంతంగా నిర్వహించలేరని అంగీకరించిన మంత్రి, ఈ విషయాన్ని తదుపరి క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. క్యాబినెట్ ఆమోదం తర్వాత, […]
Read more

తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు లేఖలు రాసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క!

హైదరాబాద్‌: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు, తెలంగాణ విద్యుత్ డిస్కామ్‌లు… విద్యుత్ వినియోగదారులతో సంబంధాలు బలోపేతం చేయడానికి ఓ వినూత్నయత్నానికి నడుం బిగించాయి. ఇందులో భాగంగా… నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపే లేఖలు, ఉప ముఖ్యమంత్రి సందేశాన్ని 83 లక్షల మంది గృహ జ్యోతి పథకం లబ్ధిదారులు, వ్యవసాయ వినియోగదారులకు అందజేస్తున్నారు. వినియోగదారుల పేరు,సేవా కనెక్షన్ నంబర్‌ను కలిగి ఉన్న ఈ వ్యక్తిగత చిరునామా లేఖలను సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ […]
Read more
1 2 3 4 5 38

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.