Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

‘అమ్మకు అక్షరమాల’తో తెలంగాణలో మహిళా సాధికారత!

హైదరాబాద్: సమ్మిళిత అభివృద్ధి దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది. ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం ద్వారా ఒకప్పుడు ప్రాథమిక విద్యకు దూరమైన వేలాది మంది జీవితాల్లో అక్షరాస్యతను పెంపొందిస్తూ… మహిళా సాధికారతకు కొత్త నిర్వచనం ఇస్తోంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (Society for Elimination of Rural Poverty) ఆధ్వర్యంలో సాగుతున్న ఈ కార్యక్రమం, రాష్ట్రవ్యాప్తంగా సామాజిక ఆధారిత అభ్యసనానికి ఒక శక్తివంతమైన నమూనాగా ఆవిర్భవిస్తోంది. ప్రధానంగా స్వయం సహాయక బృందాల (SHG) సభ్యులపై దృష్టి సారించిన […]
Read more

విలువ ఆధారిత పాఠశాలల వైపు మళ్లుతున్న హైదరాబాద్ తల్లిదండ్రులు!

హైదరాబాద్: సమాజంలో క్రమంగా విలువ ఆధారిత పాఠశాలల (Values-based Education – VbE) సంఖ్య పెరుగుతోంది. ఈ స్కూళ్లు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, విద్యార్థులలో గౌరవం, నిజాయితీ, కరుణ, బాధ్యత వంటి నైతిక విలువలను పెంపొందించడంపై దృష్టి పెడతాయి. ఇవి ఉపాధ్యాయుల ప్రవర్తన, బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది, వారిని ఉత్తమ పౌరులుగా మారుస్తాయి. మరోవంక విశ్వ నగరం హైదరాబాద్‌లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించే పాఠశాలలు నిజంగా […]
Read more

తెలంగాణ అసెంబ్లీలో విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లు!

హైదరాబాద్: రాష్ట్రంలో విద్వేషపూరిత ప్రసంగాలు (Hate Speech), నేరాలను కట్టడి చేసేందుకు “తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లు, 2026″ను కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాగా, సంబంధిత నేరాలకు గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షను ప్రతిపాదించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే, కర్ణాటక తర్వాత తెలంగాణ రెండవ రాష్ట్రంగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున శాసన వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు తీర్మానాన్ని […]
Read more

తెలంగాణలో ఎత్తిపోతల పథకాలకు పవర్‌ కట్‌!

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎండలు బాగా పెరిగాయి. ఫలితంగా విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన అన్ని పంపులను పగటిపూట, ప్రత్యేకంగా సౌర విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే నడపాలని ట్రాన్స్‌కో నీటిపారుదల శాఖను కోరింది. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టుకు 24 గంటలూ నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేయబోమని ఆ విద్యుత్ సంస్థ స్పష్టంగా పేర్కొంది. ఈ నిర్ణయం నీటిపారుదల రంగానికి ఇది ఒక పెద్ద దెబ్బ అని రైతు నేతలు అభిప్రాయపడ్డారు. . […]
Read more

‘రామనవమి యాత్ర’లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్!

హైదరాబాద్: వివాదాస్పద నేత రాజా సింగ్ నేతృత్వంలో సాగిన రామనవమి ఊరేగింపు ఒక శక్తి ప్రదర్శనగా మారింది. ఈ యాత్రలో రెచ్చగొట్టే పాటలు, కత్తుల బహిరంగ ప్రదర్శన, వరుస రెచ్చగొట్టే ప్రసంగాలు చోటుచేసుకున్నాయి. డీజే అమర్చిన వాహనాలు భారీ శబ్దంతో సంగీతాన్ని వినిపించగా, “జై శ్రీరామ్” నినాదాలు పదే పదే మిన్నంటాయి. పదే పదే వినిపించిన పాటల్లో, “హిందుస్తాన్ హిందూ రాష్ట్రంగా మారుతుంది. మనం బతికి ఉండగానే ఈ పనిని పూర్తి చేయాలి. ఈ ప్రదేశమంతా కాషాయ […]
Read more

పిల్లల్లో పోషకాహార లోపాలను పరిష్కరించేందుకు పైలట్ ప్రాజెక్టు!

హైదరాబాద్: ప్రీ-ప్రైమరీ, ప్రాథమిక స్థాయి పిల్లల్లో ఉన్న పోషకాహార లోపాలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఈమేరకు’కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ’ (CURE) పరిధిలోని 29 ప్రభుత్వ పాఠశాల సముదాయాల్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు గాను ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ సూచించిన సిఫార్సులను పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలి ప్రాంగణంలో మురళీధరన్ ముఖ్యమంత్రిని కలిశారు. ఈ భేటీలో […]
Read more

హైదరాబాద్, వరంగల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా 10 వేల పడకలు!

హైదరాబాద్: వరంగల్, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం పూర్తయితే, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థకు అదనంగా 10వేల పడకలు అందుబాటులోకి వస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఆసుపత్రులను నిమ్స్‌, సనత్‌నగర్, అల్వాల్, ఎల్.బి. నగర్, వరంగల్ టిమ్స్‌ ప్రాంగణాల్లో నిర్మించనున్నారు. ఈమేరకు సీఎం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ… రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడి ఆసుపత్రుల్లో స్వచ్ఛంద సేవలు అందించడానికి, విదేశాల్లో నివసించే తెలంగాణ వైద్యులు నమోదు చేసుకునేలా ఆరోగ్య […]
Read more

ఇస్రోను సందర్శించనున్న తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు!

హైదరాబాద్: రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (SCERT) చేపట్టిన “హర్ ఇండియన్ కా మూన్‌షాట్” కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల నుండి 59 మంది విద్యార్థులు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించడానికి ఎంపికయ్యారు. అగస్త్య ఫౌండేషన్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో SCERT నిర్వహించిన రాష్ట్ర స్థాయి చిత్రకళ, వ్యాస పోటీల ద్వారా ఈ విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ విద్యార్థులతో పాటు ఆరుగురు ఉపాధ్యాయులు కూడా […]
Read more

గిరిజనుల పునరావాసం కోసం రూ. 62.55 కోట్లు కేటాయింపు!

హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన సంక్షేమానికి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది. గిరిజన పునరావాస కార్యక్రమాలలో భాగంగా తెలంగాణలోని గిరిజన కుటుంబాల అభివృద్ధికి రూ. 62.55 కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 14 గిరిజన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 15 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. భారతదేశంలో గిరిజనులకు ఒక రాష్ట్ర ప్రభుత్వం అందించిన అత్యధిక పరిహారం ఇదే కావడం విశేషం. అమ్రాబాద్ […]
Read more

వదంతులతో హైదరాబాద్ పెట్రోల్ పంపుల వద్ద భారీ రద్దీ!

హైదరాబాద్: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ దొరకట్లేదనే పుకార్లతో హైదరాబాద్‌లోని పలు పెట్రోల్ పంపుల వద్ద భారీ రద్దీ నెలకొంది. పొడవైన క్యూలలో వాహనదారులు పెట్రోల్‌ కోసం వేచి చూస్తున్నారు. తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్, కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ కొనుగోళ్లు ఎక్కువగా జరగడంతో పలు బంకుల వద్ద ‘స్టాక్ లేదు’ అనే బోర్డులు ప్రదర్శించారు. మరోంక సిఎన్‌జి అవుట్‌లెట్ల వద్ద, ఇంధనం నింపుకోవడానికి ఆటోరిక్షాలు పొడవైన క్యూలలో వేచి ఉండటం కనిపించింది. ఇది […]
Read more
1 3 4 5 6 7 46

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.