Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

త్వరలో కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనున్న తెలంగాణ!

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం త్వరలో కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామాల్లోని ప్రీ-ప్రైమరీ పాఠశాల పిల్లలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో (వైఐఐఆర్‌సి) ప్రవేశాల మొదటి దశలో బాలికా విద్యార్థులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు. ఒక సమీక్షా సమావేశంలో, పాఠశాల విద్యార్థుల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠ్యప్రణాళికను మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి అధికారులను […]
Read more

జాబ్‌ క్యాలెండర్‌ విడుల చేయాలంటూ హైదరాబాద్‌లో నిరసన చేపట్టిన యువత!

హైదరాబాద్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జాబ్‌ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సిటీలోని అశోక్ నగర్ లో మరోసారి భారీగా నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగింది. దీంతో నిరసనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత వారిలో చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా సుమారు 10 మందిని అరెస్టు చేసి ప్రస్తుతం కస్టడీలో ఉంచినట్లు చిక్కడపల్లి […]
Read more

మహిళా ఐఏఎస్ అధికారిని వేధిస్తున్న మంత్రి… బీఆర్ఎస్ ఆరోపణ!

హైదరాబాద్: తెలంగాణలో ఒక మంత్రి ప్రేమ పేరుతో ఒక మహిళా ఐఏఎస్ అధికారిణిని వేధిస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ ఘటన అత్యంత దారుణమని ఆయన అభివర్ణించారు. “పోలీస్ యంత్రాంగం ఎక్కడ ఉంది? పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తోంది? పలువురు క్యాబినెట్ మంత్రులు మహిళా అధికారులను వేధిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేయవద్దా? ఐఏఎస్ మహిళా అధికారులకే రక్షణ లేకపోతే, సాధారణ మహిళల పరిస్థితి ఏమిటి?” అని ప్రవీణ్ కుమార్ […]
Read more

సంక్రాంతికి ఆరువేలకు పైగా ప్రత్యేక బస్సులను నడపనున్న తెలంగాణ ఆర్టీసీ!

హైదరాబాద్: సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) జనవరి 9 నుండి 13 వరకు 6,431 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. పండుగ సమయంలో రద్దీని ఎదుర్కొనేందుక, ఆర్టీసీ ప్రత్యేక బస్సుల నడపడానికి ప్రణాళిక వేసింది. సాధారణంగా తిరుగు ప్రయాణ రద్దీ పెరిగే జనవరి 18,19 తేదీలలో కూడా ఈ సేవలను పొడిగించనున్నారు. ఈ బస్సులు హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టాప్ (ఎంజీబీఎస్), జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్), […]
Read more

జనవరి 19న దావోస్‌కు సీఎం…భారీ పెట్టుబడులపై ఆశలు పెట్టుకున్న తెలంగాణ!

హైదరాబాద్: తెలంగాణకు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 19న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సమావేశానికి హాజరయ్యేందుకు దావోస్‌లో పర్యటించనున్నారు. ఆరు రోజుల పర్యటనలో సీఎం…రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తెలంగాణ పెవిలియన్‌లో ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అలాగే ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ రైజింగ్ -2047’ విజన్ డాక్యుమెంట్‌ను ప్రపంచ ఆర్థిక వేదికలో ప్రదర్శించనున్నారు. ఈమేరకు “ఐటీ, పరిశ్రమల విభాగాలు దావోస్‌లో ఉండే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఈ […]
Read more

తెలంగాణలో జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ చేపడతాం…రెవెన్యూ మంత్రి పొంగులేటి!

హైదరాబాద్‌: రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణను సరిచేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ… ఒకే అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మండలాలు నాలుగు వేర్వేరు జిల్లాల్లో ఉన్నాయని, ఇది గందరగోళానికి, అసౌకర్యానికి కారణమవుతోందని ఆయన ఎత్తి చూపారు. అంతేకాదు మండలాలు, జిల్లాలను ఏకపక్షంగా విభజించారని, ఇది పరిపాలనాపరమైన అవకతవకలకు దారితీసిందని మంత్రి అన్నారు. కొన్ని సందర్భాల్లో, జిల్లాల […]
Read more

భారీ ఎత్తున నిధుల సమీకరణకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం!

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాబోయే మూడు సంవత్సరాలలో… పెండింగ్‌లో ఉన్న, కొత్త సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ. 50,000 కోట్లను సమీకరించేందుకు ముంబైకి చెందిన ఒక ప్రతిష్టాత్మక ఆర్థిక సంస్థతో చర్చలు జరుపుతోంది. మొన్నటి ముంబై పర్యటన సందర్భంగా… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ఆర్థిక సంస్థ ప్రతినిధులతో ఒక ‘రహస్య’ సమావేశం నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ఆ సంస్థ నుండి కనీసం రూ. […]
Read more

తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్…హరీష్ రావు విమర్శలు!

హైదరాబాద్: నదీ జలాల కేటాయింపులో కాంగ్రెస్ చేసిన ‘ద్రోహాలపై’ బీఆర్ఎస్ నాయకుడు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (పీఆర్ఎల్ఐఎస్), కాళేశ్వరం ప్రాజెక్టులను అధికార పార్టీ రాజకీయ కక్షతో నిర్లక్ష్యం చేస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో “నదీ జలాలు- కాంగ్రెస్ ద్రోహాలు” అనే అంశంపై ప్రజెంటేషన్ ఇస్తూ… ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 11వ […]
Read more

హైదరాబాద్‌లో పోలీస్‌ కమిషనరేట్‌ల పునర్వ్యవస్థీకరణ!

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న మూడు కమిషనరేట్లు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలను పునర్వ్యవస్థీకరించి… హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 27 మునిసిపల్ పట్టణ సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో విలీనం చేసిన తర్వాత ఈ కొత్త పరిణామం చోటుచేసుకుంది. దీని ప్రకారం… గ్రేటర్ హైదరాబాద్ పరిధి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ), చందానగర్, చార్మినార్ […]
Read more

హైదరాబాద్‌లో 50వేల మంది గిగ్ కార్మికుల సమ్మె!

హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా గిగ్ వర్కర్లు నిన్న సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో 50వేల మంది గిగ్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్ కార్డులకు చెందిన గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు. మెరుగైన వేతనాలు, పని పరిస్థితులు కల్పించాలని, ప్రమాదాలు, ఒత్తిడికి కారణమవుతున్న 10 నిమిషాల డెలివరీ రద్దు చేయాలని, పాత పే-అవుట్ సిస్టమ్ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేసారు. దీంతో కొత్త సంవత్సరం వేళ […]
Read more
1 2 3 4 5 6 38

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.