Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

పటాన్‌చెరువు ఎమ్మెల్యే సోదరుడి 80 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ!

హైదరాబాద్: అక్రమ మైనింగ్ కేసులో తెలంగాణ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు యాజమాన్యంలోని సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లైకి చెందిన రూ.80 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లై అక్రమ మైనింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తుకు సంబంధించి, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ), 2002 నిబంధనల ప్రకారం రూ.80.05 కోట్ల విలువైన అనేక స్థిర, చరాస్తులను ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ తాత్కాలికంగా అటాచ్ చేసింది. […]
Read more

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ఏర్పాట్లను సమీక్షించిన సీఎం రేవంత్!

హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ భూముల్లో డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కోసం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అన్ని విభాగాలు ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌’లో పాలుపంచుకోవాలని కోరారు. వేదిక వద్ద ఏర్పాట్లను సమీక్షించిన ముఖ్యమంత్రి, అనేక మంది విఐపిలు, ప్రముఖుల […]
Read more

‘ఫ్యూచర్ సిటీ’లో ఈశాన్య రాష్ట్రాలకు ఉచిత స్థలం…సీఎం రేవంత్‌రెడ్డి!

హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనున్న ‘ఫ్యూచర్ సిటీ’లో ఈశాన్య రాష్ట్రాలకు సొంత భవనాలు నిర్మించుకోవడానికి భూమి కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ భవనాలు భారతదేశంలోనే మొట్టమొదటి ‘నార్త్-ఈస్ట్ కనెక్ట్’ కేంద్రం అవుతాయని ఆయన అన్నారు. నిన్న రాత్రి ఇక్కడ జరిగిన ‘తెలంగాణ – నార్త్-ఈస్ట్ కనెక్ట్ టెక్నో – కల్చరల్ ఫెస్టివల్’లో ఆయన మాట్లాడుతూ… అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలకు ‘ఫ్యూచర్ […]
Read more

డ్వాక్రా గ్రూపు మహిళలకు సీఎం రేవంత్‌ కానుక!

హైదరాబాద్‌: డ్వాక్రా సంఘాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభవార్త వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళా సంఘాలు ఉత్ప‌త్తి చేస్తున్న వివిధ వ‌స్తువులను ఈ కామర్స్ ద్వారా మార్కెటింగ్‌ చేసేందుకు అమెజాన్‌తో సంప్ర‌దింపులు చేస్తున్నట్లు వెల్లడించారు. స్వయం సహాయక బృందాలు ఉత్పత్తి చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌ను అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం అన్నారు. ఈమేరకు నిన్న జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో, స్వయం సహాయక బృందాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఆన్‌లైన్ మార్కెట్‌ను సృష్టించాలని […]
Read more

చలి గుప్పిట్లో తెలంగాణ…హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు!

హైదరాబాద్: తెలంగాణలో చలితీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 6 దాటితే జనాలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఉదయంపూట భారీగా పొగమంచు కురుస్తున్నది. చలిగాలులు వీస్తున్నాయి. అనేక జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమరం భీమ్ ఆసిఫాబాద్‌లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు 7.9°C, తరువాత ఆదిలాబాద్‌లో 8.8°C, సిరిసిల్లలో 9.0°C నమోదయ్యాయి. కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, నిర్మల్, జగిత్యాల, మెదక్, రంగారెడ్డితో సహా ఇతర జిల్లాల్లో 9.3°C నుండి 10.6°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, ఇది రాష్ట్రవ్యాప్తంగా […]
Read more

హైదరాబాద్‌లో ఏడు కిలోల గంజాయి స్వాధీనం… ఇద్దరు అరెస్టు!

హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. ఈమేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఇద్దరు వ్యక్తులను పట్టుకుని, వారి నుండి 7 కిలోల గంజాయి, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిర్దిష్ట సమాచారం మేరకు, రాష్ట్ర టాస్క్ ఫోర్స్ బృందం బోలారం బజార్ రైల్వే స్టేషన్‌లో ఒక కారును ఆపి తనిఖీ చేయగా గంజాయి దొరికింది. ధూల్‌పేట నివాసితులు పూజా బాయి, సత్యరావు అనే ఇద్దరు వ్యక్తులు ఇటీవల 10 కిలోల గంజాయిని కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. […]
Read more

గిగ్ కార్మికుల సంక్షేమ బిల్లుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం!

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం బిల్లును తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఈమేరకు గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, సంక్షేమమే లక్ష్యం అని ప్రభుత్వం చెబుతోంది. రాబోయే అసెంబ్లీ సమావేశంలో బిల్లును ప్రవేశపెడతామని కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. గిగ్ వర్కర్స్ యూనియన్, అగ్రిగేటర్లు, ప్రభుత్వం ప్రతినిధులతో ఒక […]
Read more

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్‌లో జరిగే అవకాశం!

హైదరాబాద్: నిన్న కేబినెట్‌ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం… తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ డిసెంబర్‌లో ఉండే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో, ఇదే ఊపు మీద స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. డిసెంబర్ 1 నుండి 9 వరకు ప్రజా పాలన వారోత్సవాన్ని నిర్వహించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించిందని, ఆ తర్వాత స్థానిక సంస్థల […]
Read more

కేసీఆర్‌ క్రియాశీల రాజకీయాల్లో లేరు…సీఎం రేవంత్‌రెడ్డి విమర్శ!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలను తీవ్రతరం చేశారు, ఆ అనుభవజ్ఞుడైన నాయకుడు “రాజకీయాల్లో చురుగ్గా లేరు” అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అఖండ విజయం సాధించిన సందర్బంగా నవీన్ యాదవ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ… “కేసీఆర్ రాజకీయాల్లో చురుగ్గా లేరు. నేను అలాంటి వ్యక్తిని విమర్శించాలనుకోవడం లేదు. కేటీఆర్ తన అహంకారాన్ని అదుపులో ఉంచుకోవాలని, హరీష్ రావు తన అసూయను తగ్గించుకోవాలని కూడా సలహా […]
Read more

జేఎన్‌టీయూ, ఉస్మానియాలను మోడల్ వర్సిటీలుగా ప్రతిపాదించిన కోర్‌ గ్రూప్‌!

హైదరాబాద్: విద్యాసంస్థల్లో మౌలిక వసతులపై తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కోర్ గ్రూప్ పలు సిఫార్సులు చేసింది. మొదటి దశలో జెఎన్‌టియు హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీలను మోడల్ విశ్వవిద్యాలయాలుగా అభివృద్ధి చేయాలని పేర్కొంది. మౌలిక వసతుల కోసం మూడేళ్లలో ఈ రెండు వర్సిటీలకు ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించాలని ప్యానెల్ ప్రతిపాదించింది. కాగా, నూతన విద్యావిధానం తరహాలో “తెలంగాణ విద్యా విధానం” రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మౌలిక […]
Read more
1 7 8 9 10 11 38

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.