Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఈసీ విశ్వసనీయతను కోల్పోతోంది…ఎస్ఐఆర్‌ను నిలిపివేయండి!

హైదరాబాద్: ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR) ప్రక్రియ మూడవ దశ నిర్వహించిన రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మంది పౌర సమాజ సభ్యులు, సమగ్ర సమీక్ష,సవరణలు జరిగే వరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు చెందిన కనీసం 11 మందితో సహా ఈ పౌర సమాజ సభ్యులు, ఎస్ఐఆర్ ను “వివక్షాపూరితమైన, అప్రజాస్వామికమైన, పారదర్శకత లేని, అశాస్త్రీయమైన ప్రక్రియ”గా అభివర్ణించారు. దీని ఫలితంగా 10 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత […]
Read more

మరణించిన గిగ్ కార్మికులకు ఆర్థిక సహాయం అందించిన తొలి రాష్ట్రం తెలంగాణ!

హైదరాబాద్: గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. విధి నిర్వహణలో మరణించిన ఐదుగురు గిగ్,ప్లాట్‌ఫామ్ కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. దీంతో, ఆయా ప్లాట్‌ఫామ్ కంపెనీల నుండి రూ. 10 లక్షలతో కలిపి, ప్రతి మృతుని కుటుంబానికి అందిన మొత్తం చెల్లింపు రూ. 15 లక్షలకు చేరింది. ఇలా చేయడం భారతదేశంలోనే తొలిసారి కావడం గమనార్హం. ఈమేరకు స్విగ్గీ డెలివరీ కార్మికుడు అహ్మద్ […]
Read more

వృత్తి విద్యా వ్యవస్థ బలోపేతానికి ఫిన్లాండ్ వైపు చూస్తున్న తెలంగాణ!

హైదరాబాద్‌: రాష్ట్రంలో వృత్తి విద్యా (Vocational Education) వ్యవస్థను బలోపేతం చేయడానికి… ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానం కలిగిన ఫిన్లాండ్ మోడల్‌ను అనుసరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు 28 మంది ఉపాధ్యాయులు, 12 మంది అధికారులతో కూడిన 40 మంది సభ్యుల తెలంగాణ విద్యా ప్రతినిధి బృందం, ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఐదు రోజుల పాటు జరిగిన ‘ఉపాధ్యాయుల అనుభవ, విద్యా మార్పిడి కార్యక్రమం’ అనంతరం ఫిన్లాండ్ నుంచి తిరిగి వచ్చింది. ప్రభుత్వ […]
Read more

రబీ సీజన్‌లో 10.2 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించిన తెలంగాణ!

హైదరాబాద్: ఈ రబీ సీజన్‌లో నిన్నటికి 10.2 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు, రాష్ట్ర ప్రభుత్వం 4.50 లక్షల టన్నుల సన్న రకం, 5.50 లక్షల టన్నుల దొడ్డు రకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. సేకరించిన వరి ధాన్యానికి సంబంధించి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్ష మందికి పైగా రైతులకు రూ. 500.20 కోట్ల చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నేరుగా విడుదల చేసిందని పౌర సరఫరాల […]
Read more

తుమ్మిడిహట్టి బ్యారేజీ సమస్యపై మహారాష్ట్రతో చర్చలు జరుపనున్న తెలంగాణ!

హైదరాబాద్: తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ సమస్య ఏమిటంటే, తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించి తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ప్రస్తుతం ఉన్న వివాదం ప్రధానంగా దాని పూర్తి జలాశయ మట్టం (FRL), దాని ఫలితంగా మహారాష్ట్రలోని భూమి మునిగిపోవడానికి సంబంధించినది. ఈమేరకు నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, తుమ్మిడిహెట్టి బ్యారేజీని 150 మీటర్ల FRL ఎత్తులో నిర్మించడం ద్వారా కనీసం 100 టీఎంసీల […]
Read more

గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు ‘అతిపెద్ద కుంభకోణం’…రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: గ్రేట్ నికోబార్ ద్వీపంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులు దేశంలో జరిగిన “అతిపెద్ద కుంభకోణాలలో” ఒకటని రాహుల్‌ గాంధీ అన్నారు. అభివృద్ది ముసుగులో వేల ఏళ్ల నాటి అడవులను నరికివేస్తూ.. పర్యావరణ విధ్వంసం చేస్తుందని లోక్ సభలో విపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గ్రేట్ నికోబార్ లో పర్యటించిన రాహుల్ గాంధీ అక్కడి పరిస్థితులపై ఎక్స్ వేదికగా ఈరోజు ట్వీట్ చేశారు బంగాళాఖాతంలోని అండమాన్,నికోబార్ ద్వీపసమూహంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను […]
Read more

హైదరాబాద్ విమానాశ్రయంలో ఆరు కిలోల గంజాయితో పట్టుబడ్డ ప్రయాణికుడు!

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది. పెద్ద మొత్తంలో హైడ్రోఫోనిక్ గంజాయిని గుట్టుగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ మార్కెట్లో రూ. 2.15 కోట్లు. కాగా, దీని మొత్తం బరువు 6.15 కిలోలు కావడం గమనార్హం. ఈ కేసులో ఒక ప్రయాణికుడిని అరెస్టు చేశామని కస్టమ్స్ అధికారులు తెలిపారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై చేపట్టిన భారీ దాడుల్లో భాగంగా, డీఆర్ఐ (DRI) అందించిన నిర్దిష్ట […]
Read more

హైదరాబాద్‌లో మే 9న పాస్‌పోర్ట్ మేళా!

హైదరాబాద్: తెలంగాణలోని పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లో రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం మే 9న పాస్‌పోర్ట్‌ మేళా నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, ఆర్‌పిఓ హైదరాబాద్ పరిధిలోని ఐదు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలన్నింటిలో 4,000 సాధారణ అపాయింట్‌మెంట్‌లు విడుదల చేయనున్నారు. దీనివల్ల ప్రస్తుతం సుదీర్ఘ కాలంపాటు వెయిటింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు కరీంనగర్‌లోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతున్నట్లు కూడా కార్యాలయం ప్రకటించింది. […]
Read more

క్రేన్ కూలి ఐదుగురు వలస కార్మికులు మృతి!

హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో నిన్న సాయంత్రం ఒక ప్రీఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్ తయారీ యూనిట్‌లో క్రేన్ కూలిపోవడంతో ఐదుగురు వలస కార్మికులు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మహాలింగాపురం గ్రామంలో సాయంత్రం పూట కార్మికులు మొత్తం విధుల్లో నిమగ్నమై ఉండగా.. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి.. భారీ ఈదురుగాలులు వీయడంతో ఆ కంపెనీలోని భారీ క్రేన్ కంట్రోల్ తప్పి కార్మికులపై పడిపోయింది. క్రేన్ కూలినప్పుడు 17 మంది కార్మికులు ఒక షెడ్డులో తలదాచుకున్నారు. […]
Read more

హైదరాబాద్‌ను మరో ఢిల్లీగా మార్చొద్దు…హెచ్-సిటీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన!

హైదరాబాద్: “హైదరాబాద్ మరో ఢిల్లీగా మారడం మాకు ఇష్టం లేదు,” అని కేబీఆర్ జాతీయ పార్క్ ప్రధాన ద్వారం వెలుపల కొనసాగుతున్న హెచ్-సిటీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. కాగా, భవిష్యత్తులో పెరగనున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో చేపట్టిన ‘హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ (హెచ్-సిటీ) ప్రాజెక్టు పనులు… పార్క్ చుట్టూ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణాలకుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ‘ స్థానికులు, పర్యావరణ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన […]
Read more
1 8 9 10 11 12 55

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.