Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

కడప అల్మాస్‌పేట ఘర్షణలపై ఏపీసీఆర్‌ నిజ నిర్ధారణ నివేదిక!

కడప…ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో ఓ ప్రముఖ నగరం. అత్యంత ప్రభావవంతమైన ముఖ్యమంత్రులలో ఒకరైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఈ ప్రాంతం నుంచే వచ్చారు. ఈ నగరం చాలా వైవిధ్యభరితమైనది కూడా. జనాభాలో 45-50% ముస్లింలు ఉన్నారు. ఇక్కడ ఉన్న ఓ వాణిజ్య కూడలి అల్మాస్‌పేట్ సర్కిల్. కాగా, ఈ జంక్షన్‌కు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో విరోచితంగా పోరాడి మరణించిన మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ పేరును పెట్టాలని స్థానిక ముస్లింలు, పౌర సంఘాలు కోరుకుంటున్నాయి. […]
Read more

ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి పెంచిన తెలంగాణ!

హైదరాబాద్: నిరుద్యోగ యువత నుండి పదే పదే వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లు పెంచింది. దీంతో వివిధ విభాగాల పోస్టుల భర్తీకి రాబోయే ప్రత్యక్ష నియామకాలలో, వయోపరిమితిని 34 ఏళ్ల నుండి 44 ఏళ్లకు పెరిగింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఈ ఏడాది జూన్‌లో ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర […]
Read more

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ… వడగాలుల హెచ్చరిక!

హైదరాబాద్‌: రేపటి నుండి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రం కానున్నాయి. ఈమేరకు మే 19 నుండి 24వ తేదీ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సగటు ఉష్ణోగ్రతలు 45°C మార్కును దాటే అవకాశం ఉందని, దీనివల్ల ఈ ప్రాంతమంతటా వడగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. వడదెబ్బ వంటి వేడి సంబంధిత అనారోగ్యాలను నివారించడానికి, ప్రజలు ఉదయం 10:30 నుండి సాయంత్రం 4:00 గంటల మధ్య బయటకు రాకూడదని నిపుణులు […]
Read more

జయశంకర్ భూపాలపల్లిలో మాదకద్రవ్యాలపై ఈగిల్ టీమ్ ఉక్కు పాదం!

జయశంకర్ భూపాలపల్లి: గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల సరఫరా, వినియోగాన్ని నిర్మూలించేందుకు, మాదకద్రవ్యాలను గుర్తించే శునకాల సహాయంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీ తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో గంజాయి చలామణి, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు ‘ఆపరేషన్ ఆర్ఐ’… కాశీరామ్ నేతృత్వంలోని ఈగిల్ టీమ్ జిల్లా వ్యాప్తంగా పాన్ షాపులు, కిరాణా దుకాణాలు, బస్ స్టాండ్ […]
Read more

టీజీ ఈఏపీసెట్‌లో గురుకుల విద్యార్థుల అద్భుత ప్రతిభ!

హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (TGSWREIS) ఆధ్వర్యంలో నడుస్తున్న ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ (Centers of Excellence) విద్యార్థులు, తెలంగాణ ఇంజనీరింగ్, వ్యవసాయ,ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TG EAPCET-2026)లో మంచి ర్యాంకులను సాధించారని ఒక ప్రకటనలో తెలిపింది. సరికొత్త రికార్డులను సృష్టిస్తూ రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి, గురుకులాలు అగ్రశ్రేణి విద్యాసంస్థలుగా నిరూపించుకున్నాయి. ఈ సందర్భంగా, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం […]
Read more

పీఏసీఎస్‌లను బలోపేతం చేయడంపై దృష్టి సారించిన తెలంగాణ!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకార శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై, సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశానికి హాజరైన వారిని ఉద్దేశించి చీఫ్‌ సెక్రటరీ మాట్లాడుతూ… సమ్మిళిత ఆర్థిక వృద్ధికి దోహదపడగల అపారమైన సామర్థ్యం ఉన్న బలమైన, చైతన్యవంతమైన సహకార ఉద్యమం తెలంగాణలో ఉందని అన్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను (పీఏసీఎస్) మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. […]
Read more

ఇంటర్ బోర్డులో కీలక సంస్కరణలు తీసుకొచ్చిన తెలంగాణ!

హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (టీజీబీఐఈ) పలు సంస్కరణలను ప్రకటించింది. ఈ సంస్కరణలు 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి. మే 11న జారీ చేసిన నోటిఫికేషన్‌ను అనుసరించి, మే 12 నుంచి జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభమయ్యాయని గురువారం ఒక ప్రకటనలో టీజీబీఐఈ తెలిపింది. కీలక సంస్కరణలలో భాగంగా, సైన్స్ సబ్జెక్టుల ప్రాక్టికల్ పరీక్షలను మొదటి, రెండవ సంవత్సరాలలో చెరో 15 మార్కులకు పునర్‌వ్యవస్థీకరించారు. అయితే, […]
Read more

పొదుపు చర్యలపై వారం రోజుల్లో నిర్ణయం…సీఎం రేవంత్‌రెడ్డి!

హైదరాబాద్: ఇరాన్-అమెరికా యుద్ధం, పశ్చిమ ఆసియా సంక్షోభాల ప్రభావం తగ్గించేందుకు పొదుపు చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని అనుసరించి, తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఆన్‌లైన్ విద్య, ‘వర్క్ ఫ్రమ్ హోమ్’విధానం, ఇంధన వినియోగాన్ని తగ్గించే చర్యలను ప్రవేశపెట్టడంపై నిర్ణయం తీసుకోనుంది. ఇంధన వినియోగాన్ని తగ్గించడం వల్ల వ్యాట్ (VAT) ద్వారా వచ్చే ఆదాయంపై పడే ప్రభావాన్ని రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య పన్నుల విభాగాలు అధ్యయనం చేస్తున్నాయి. “ఈ పొదుపు చర్యలు—ముఖ్యంగా అధికారిక వాహనాల […]
Read more

జూన్ 2న ఇందిరమ్మ ఇళ్లు రెండో దశ ప్రారంభం!

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఆదిలాబాద్‌లో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండో దశను ప్రారంభించనున్నట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మే 21న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో రెండో దశకు సంబంధించిన విధివిధానాలపై చర్చించి ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల రెవెన్యూ, గృహ నిర్మాణ సమస్యలపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గాల […]
Read more

వరి సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా విమర్శించిన హరీష్ రావు!

హైదరాబాద్: వరి ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ఎల్పీ ఉప నాయకుడు హరీష్ రావు ఆరోపించారు. పౌర సరఫరాల అధికారుల అవినీతి వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఈమేరకు మెదక్ జిల్లా, చేగుంట మండలం, కర్నల్పల్లిలోని ధాన్యం సేకరణ కేంద్రాన్ని హరీష్ రావు సందర్శించి, గత కొన్ని రోజులుగా అక్కడే వేచి ఉన్న రైతుల దుస్థితిని స్వయంగా చూశారు. ఇటీవల కురిసిన వర్షాలకు గణనీయమైన పరిమాణంలో వరి ధాన్యం తడిసిపోయిందని గమనించిన […]
Read more
1 6 7 8 9 10 55

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.