రియాద్: సౌదీ అరేబియాలో విషాదం చోటుచేసుకుంది. పవిత్ర మక్కా నగరానికి ఉమ్రా యాత్రికులను తీసుకువెళుతున్న బస్సు సోమవారం వంతెనను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో 20 మంది మరణించారు. మంటల్లో చిక్కుకుని 24 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సౌదీ ప్రభుత్వ మీడియా తెలిపింది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని వైద్యం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఎంతో పవిత్రమైన రంజాన్ నెల సందర్భంగా ఉమ్రా యాత్రకు ప్రపంచ నలుమూలల నుంచి ముస్లిం సోదరులు వెళ్తుంటారు. కుటుంబాలు, స్నేహితులతో కలిసి మక్కాను దర్శించుకుంటారు.
గతవారం రంజాన్ నెల ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి వారంలోనే ఈ ప్రమాదం జరగడం బాధాకరం. బాధితుల్లో చాలా మంది బంగ్లాదేశ్, పాకిస్థాన్కు చెందినవారుగా భావిస్తున్నారు. ఉమ్రా యాత్రను నిర్వహించే ఏజెన్సీ ద్వారా వీళ్లు మక్కాకు వెళ్లినట్టు తెలుస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం.. హజ్ యాత్రికుల బస్సు ఖమిస్ ముషైత్ నుంచి మక్కాకు వెళ్తుండగా.. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు మహెయిల్ కనుమ సమీపంలో బ్రేక్లు ఫెయిలై వంతెనను ఢీకొట్టింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సౌదీ అధికారులు ట్విట్టర్లో షేర్ చేశారు.
#عاجل | وفاة 20 شخصاً وإصابة 29 آخرين في حادث حافلة بعقبة شعار شمال #عسير pic.twitter.com/KjOdWkPcyB
— أخبار 24 (@Akhbaar24) March 27, 2023