జెరుసలెం: గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు నాల్గవ రోజుకు చేరాయి. ఈ దాడుల్లో కనీసం 30 మంది పాలస్తీనియన్లు మరణించారు. 64 మంది గాయాలపాలైనట్లు పాలస్తీనా ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. మరణించిన వారిలో అనేక మంది ఇస్లామిక్ నాయకులు అలాగే మహిళలు, పిల్లలు వృద్ధులతో సహా పౌరులు ఉన్నారు.
మంగళవారం నుంచి ఇజ్రాయెల్ సైన్యం… రద్దీగా ఉండే తీర ప్రాంతంలో జరిపిన వైమానిక దాడుల్లో అనేక మంది చిన్నారులు సహా పౌరులు మరణించారని అధికారులు తెలిపారు.
గాజా స్ట్రిప్ నుండి రాకెట్ కాల్పుల్లో సెంట్రల్ ఇజ్రాయెల్ నగరమైన రెహోవోట్లో ఒకరు మరణించారు, కనీసం ఇద్దరు గాయపడ్డారని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు.
ఇటీవలి రోజుల్లో జరిగిన దాడుల్లో ఇస్లామిక్ జిహాద్ ఐదుగురు సైనిక నేతలను కోల్పోయిందని ధృవీకరించింది. వీరిలో అహ్మద్ అబు దేకా ఉన్నారు -అంతేకాదు రాకెట్ ప్రయోగ యూనిట్ కమాండర్ అలీ ఘాలి డిప్యూటీ కూడా చనిపోయారు.
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి Yoav Gallant భద్రతా స్థాపన “అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఆదేశించారు.
‘వేవ్ ఆఫ్ ఎకలేషన్’
గాజా సిటీలోని అల్ రిమల్ జిల్లా వాసి మామూన్ రాడి (48) మాట్లాడుతూ… “పెరుగుతున్న ఉద్రిక్తతలు త్వరలో ముగుస్తుందని మేము ఆశిస్తున్నాము. అయితే మేము అమరవీరుల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని అన్నాడు.
“ఇజ్రాయెల్ ఈ రోజు తెల్లవారుజామున [ఇస్లామిక్] జిహాద్ నాయకుడిని హత్య చేసింది
ఈజిప్టు ఇంటెలిజెన్స్ అధికారులతో చర్చల కోసం గ్రూప్ పొలిటికల్ బ్యూరోకు నేతృత్వం వహిస్తున్న మహ్మద్ అల్ హిందీ గురువారం కైరో చేరుకున్నట్లు ఇస్లామిక్ జిహాద్ వర్గాలు తెలిపాయి.
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ అధికారులతో చర్చల కోసం కైరో నుండి భద్రతా ప్రతినిధి బృందం గురువారం తరువాత టెల్ అవీవ్కు చేరుకుంటుందని ఈజిప్టు వర్గాలు AFP వార్తా సంస్థకు తెలిపాయి.
ఇజ్రాయెల్ అధికారులు ఈజిప్టు ప్రమేయంతో శత్రుత్వాన్ని నిలిపివేసేందుకు ఇరు పక్షాల మధ్య అవగాహన కల్పించే ప్రయత్నాలను ధృవీకరించారు.
“గాజాలో ఇజ్రాయెల్ వైమానికి దాడులను ఆపాలని, తక్షణ కాల్పుల విరమణను చేపట్టాలని” EU విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ ఒక ప్రకటనలో తెలిపారు.
‘విషాదం, హృదయ విదారకం’
యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ మాట్లాడుతూ… వైమానికి దాడుల్లో మరణాలు “విషాదకరమైనవి, హృదయ విదారకమైనవి” అని అన్నారు.
“పౌర ప్రాణనష్టాన్ని నివారించేందుకు వివేకవంతమైన చర్యలు తీసుకోవాలని, హింసను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని” వాషింగ్టన్ అన్ని ఇరువర్గాలకు పిలుపునిస్తోంది.
జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్బాక్ “రక్తపాతం ఇప్పుడే అంతం కావాలి” అని అన్నారు, అయితే UN “గాజాలో ఇప్పటికే కష్టతరమైన మానవతా పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని” హెచ్చరించింది.
ఇజ్రాయెల్ సైన్యం చేసిన వైమానిక దాడులను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ బుధవారం తీవ్రంగా ఖండించారు. ‘పిల్లలు, మహిళలతో సహా పౌరుల ప్రాణాలను కోల్పోవడాన్ని గుటెరస్ ఖండించారని, ఇది ఆమోదయోగ్యం కాదని, ఈ చర్యలను వెంటనే నిలిపివేయాలి’ అని ఐక్యరాజ్యసమితి డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ ఓ ప్రకటనలో తెలిపారు.
Fresh Israeli air strikes on blockaded Gaza kill more Palestinians despite Egyptian efforts to broker ceasefire. TRT World's Nizar Sadawi has more pic.twitter.com/WV0EYnh3vC
— TRT World Now (@TRTWorldNow) May 12, 2023