వాషింగ్టన్: యునైటెడ్ స్టేట్స్లోని న్యూయార్క్ యూనివర్శిటీ లాంగోన్ మెడికల్ సెంటర్ (యుఎస్) ఇటీవల ఒక అవార్డు వేడుక ప్రసంగం సందర్భంగా గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ‘జినోసైడ్’గా అభివర్ణించినందుకు పాలస్తీనా-అమెరికన్ ముస్లిం నర్సును ఉద్యోగంనుంచి తొలగించారు.
“గాజాలో ప్రస్తుతం జరుగుతున్న మారణహోమం సమయంలో నా దేశానికి చెందిన మహిళలు ఊహించలేని నష్టాలను చవిచూడటం నాకు చాలా బాధ కలిగించింది” అని జబర్ అన్నారు.
“ఈ మారణహోమం సమయంలో వారి పుట్టబోయే పిల్లలు, చిన్నారులను కోల్పోయి బాధపడుతున్నందున నేను వారి చేతులు పట్టుకుని వారిని ఓదార్చలేనప్పటికీ, నేను ఇక్కడ NYUలో వారి తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉందని” ఆమె జోడించింది.
“మే 22న, నేను అవార్డు అందుకున్న తర్వాత నా మొదటి షిఫ్ట్కి తిరిగి వచ్చాను. నేను యూనిట్లోకి వెళ్లిన వెంటనే, నేను ‘ఇతరులను ప్రమాదంలో పడేశాను’ మరియు ‘వేడుకను ఎలా నాశనం చేశాను’ మరియు ‘ప్రజలను బాధపెట్టాను’ అని చర్చించడానికి NYU లాంగోన్లో ప్రెసిడెంట్ మరియు నర్సింగ్ వైస్ ప్రెసిడెంట్తో ఒక ఆకస్మిక సమావేశానికి నన్ను తీసుకెళ్లారు. నా ప్రసంగంలోని చిన్న భాగం నా దేశంలో దుఃఖిస్తున్న తల్లులకు నివాళి.”
ఆసుపత్రి తనతో ఏమి చేయాలో “కనిపెట్టడానికి” రోజంతా గడిపినప్పుడు ఆమె తన షిఫ్ట్ పనికి తిరిగి పంపించారు.
“దాదాపు మొత్తం షిఫ్ట్ పని చేసిన తర్వాత, నన్ను మరోసారి కార్యాలయానికి పిలిచారు. అక్కడ మానవ వనరుల డైరెక్టర్ ఆస్టిన్ బెండర్ నా తొలగింపు లేఖను చదివారు. మఫ్టీలో ఉన్న పోలీసు అధికారితో నన్ను మా ఆఫీసు ప్రాంగణం నుండి బయటికి తీసుకెళ్లారు” అని జబర్ జోడించారు.
గురువారం, మే 30, ఆసుపత్రి ప్రతినిధి, NYU లాంగోన్ హెల్త్, “ఈ విభజన, ఆవేశపూరితమైన సమస్యపై కార్యాలయంలోకి తన అభిప్రాయాలను తీసుకురావద్దని” జబర్ను గతంలో హెచ్చరించారని రాయిటర్స్ నివేదించింది.
అక్టోబరు 7, 2023 నుండి, ఇజ్రాయెల్ దళాలు గాజాపై వినాశకరమైన యుద్ధం చేస్తున్నాయి, 35,000 మందికి పైగా మరణాలు, 79,300 మంది గాయపడ్డారు, దీనివల్ల పాలస్తీనా పూర్తిగా విధ్వంసం అయింది. ఒక మహా మానవతా విపత్తు చోటు చేసుకుంది.
ICJ జారీ చేసిన తాత్కాలిక చర్యలు, అలాగే UN భద్రతా మండలి (UNSC) తక్షణ కాల్పుల విరమణ తీర్మానాన్ని జారీ చేసినప్పటికీ కూడా ఇజ్రాయెల్ యుద్ధాన్ని కొనసాగిస్తోంది.