రఫా: ఇజ్రాయెల్ సైనికులు యుద్ధంతో దెబ్బతిన్న రఫా సరిహద్దు ప్రాంతంలోని మసీదును రెస్టారెంట్గా మార్చి ప్రజల ఆగ్రహానికి కారణమయ్యారు. గాజా-ఈజిప్ట్లను వేరు చేసే రఫా సరిహద్దులో ఉన్న మసీదు లోపల కొంతమంది ఇజ్రాయెల్ సైనికులు భోజనం సిద్ధం చేస్తున్నట్లు ఇంటర్నెట్లో వెలువడిన వీడియో బాగా వైరల్ అయింది.
రఫాలోని గ్రాండ్ మసీదు స్థానిక ప్రజలకు ముఖ్యమైన ప్రార్థనా స్థలం. అయితే, యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆక్రమణ అధికారులు ఇప్పుడు ఆ సైట్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దానిని రెస్టారెంట్గా మార్చారు, స్థానికులకు ఆ ప్రార్థనా స్థలంలోకి ప్రవేశించడానికి నిరాకరించారు.
వీడియో లింక్
https://x.com/QudsNen/status/1801181350080176352
అసలు ఇజ్రాయెల్ స్థాపన కోసం స్థానికుల మతపరమైన భావాలను పట్టించుకోకుండా వైమానిక దాడులతో మసీదులను పేల్చివేసిన సుదీర్ఘ చరిత్ర ఆ దేశానికి ఉంది.
1,000 మసీదులను ధ్వంసం చేసింది
అక్టోబర్ 7 నుండి, గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కనీసం 1,000 మసీదులను పూర్తిగా ధ్వంసం చేశాయని స్థానిక అధికారులు తెలిపారు.
“ఈ మసీదుల పునర్నిర్మాణానికి సుమారు $ 500 మిలియన్లు ఖర్చు అవుతుందని” గాజా ఎండోమెంట్స్, మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఫిబ్రవరిలో, ఒక ఇజ్రాయెల్ సైనికుడు గాజాలోని మసీదుపై బాంబు దాడికి సంబంధించిన వీడియోను ఫేస్బుక్లో పంచుకున్నాడు, అది అప్పటికే తీవ్రంగా దెబ్బతిని ఉంది.
వీడియో లింక్
https://www.instagram.com/reel/C3FkD-Irl4b/?utm_source=ig_web_button_share_sheet
గత నెలలో, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో క్లిప్, గాజా స్ట్రిప్లో ఒక ఇజ్రాయెల్ సైనికుడు పవిత్ర ఖురాన్ కాపీని మంటల్లోకి విసిరినట్లు చూపించారు, ఈ దుస్సంఘటనను పాలస్తీనా ప్రజలకు విపరీతమైన కోపాన్ని తెప్పించింది. దీనిని వారు తీవ్రంగా ఖండించారు.
ఇజ్రాయెల్ తన చర్యలకు బాధ్యత వహించేలా, పాలస్తీనా ప్రజల మతపరమైన, సాంస్కృతిక హక్కులను పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని అనేక మానవ హక్కుల సంస్థలు అంతర్జాతీయ సమాజాన్ని కోరాయి.
ఇదిలావుండగా, సెంట్రల్ గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడుల పర్యవసానాలను చర్చించడానికి UN భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని అభ్యర్థించాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ UNలోని పాలస్తీనా రాయబారిని ఆదేశించారు.
గాజా, వెస్ట్ బ్యాంక్లో జరుగుతున్న మానవతా విపత్తును అరికట్టడానికి అంతర్జాతీయ జోక్యం తక్షణ అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. “అంతర్జాతీయ మౌనం, యుఎస్ మద్దతుతో” ఇజ్రాయెల్ ఈ ప్రాంతంలో దోపిడి కొనసాగిస్తోంది.