న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్ట సవరణ ద్వారా ఇటీవలే రద్దు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో వాదనలు జరగుతున్నాయి. ఇందుకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పిటిషనర్లకు ఒక ప్రశ్న వేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధనేనని, శాశ్వతమైనది కాదని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్కు ధర్మాసనం తెలిపింది. 1957 తర్వాత జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ పనిచేయడం ఆగిపోయినందున, ఈ నిబంధనను ఎలా శాశ్వతం చేస్తారని సీనియర్ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.
సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జిస్టిస్ ఎస్కే కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, సూర్య కాంత్లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం చేపట్టింది. విచారణలో భాగంగా ఆర్టికల్ 370లోని ప్రొవిజో 3ని కూడా గుర్తుచేసింది: “ఈ ఆర్టికల్లోని ముందు పేర్కొన్న నిబంధనలలో ఏదీ ఉన్నప్పటికీ, రాష్ట్రపతి, పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా, ఈ ఆర్టికల్ ఆపరేటివ్గా నిలిచిపోతుంది లేదా అటువంటి మినహాయింపులు, సవరణలతో… అతను పేర్కొన్న తేదీ నుండి మాత్రమే అమలు చేయబడుతుందని ప్రకటించండి: నిబంధన (2)లో సూచించబడిన రాష్ట్ర రాజ్యాంగ సభ సిఫార్సు ) రాష్ట్రపతి అటువంటి నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందు అవసరం.
“రాజ్యాంగ పరిషత్తు పదవీకాలం ముగిసినప్పుడు ఏమి జరుగుతుంది? అని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పిటిషనర్లను ప్రశ్నించారు. ఏ రాజ్యాంగ అసెంబ్లీకి నిరవధిక జీవితం ఉండదు. ఆర్టికల్ 370లోని క్లాజ్ (3)లోని నిబంధన రాష్ట్ర రాజ్యాంగ అసెంబ్లీ సిఫార్సును సూచిస్తుంది. రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసే ముందు, రాజ్యాంగ అసెంబ్లీ సిఫార్సు అవసరం అని పేర్కొంది. కానీ ప్రశ్న ఏమిటంటే, రాజ్యాంగ పరిషత్తు ఉనికిలో లేనప్పుడు ఏమి జరుగుతుంది?
రాజ్యాంగ పరిషత్ సిఫారసు లేకుండా రాష్ట్రపతి కూడా ఆర్టికల్ను రద్దు చేయలేరని పిటిషనర్ల తరఫు న్యాయవాది సిబల్ నొక్కి చెప్పారు. శాసన సభలో ఆర్టికల్ 370 రద్దు లేదా సవరణ కోసం ఎలాంటి బిల్లులు ప్రవేశపెట్టరాదని జమ్ము కశ్మీర్ రాజ్యాంగంలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్టికల్ 370 రద్దు అంశం రాజకీయ ప్రక్రియలో భాగంగా జరిగిందని, రాజ్యాంగబద్ధంగా దీన్ని నిర్వహించాల్సిందని అన్నారు. దీనిపై వాదనలు ఆగస్టు 8న కొనసాగనున్నాయి.