న్యూఢిల్లీ : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. మోడీ ఇంటి పేరుపై వ్యాఖ్యలకు సంబంధించిన 2019 నాటి కేసులో దోషిగా రాహుల్ను దోషిగా నిర్ధారిస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించిన గుజరాత్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపేసింది. దీంతో రాహుల్ లోక్ సభ సభ్యత్వ పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. సుప్రీం కోర్టు ఆదేశం దరిమిలా రాహుల్ పార్లమెంటరీ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే స్పీకర్ను కోరారు.
”దొంగలందరికీ మోడీ ఇంటిపేరు ఎందుకుంటుంది’ అనే వ్యాఖ్యలకు గాను క్రిమినల్ పరువు నష్టం కేసులో తనపై విధించిన రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ను జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ పివి సంజరు కుమార్లతో కూడిన ధర్మాసనం విచారించింది. భారత శిక్షాస్మృతి (ఐపిసి) ప్రకారం పరువు నష్టం కలిగించే నేరానికి సంబంధించి రెండేళ్ల గరిష్ట జైలు శిక్ష విధించేందుకు ట్రయల్ కోర్టు నిర్దిష్ట కారణాలేవీ చూపలేక పోయిందని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. శిక్ష ఒక రోజు తక్కువగా ఉంటే, నిబంధనలు (అనర్హతకు సంబంధించినవి) వర్తించవు. సెషన్స్ కోర్టు, గుజరాత్ హైకోర్టు భారీ పేజీలు తీర్పు ఇచ్చినప్పటికీ, ఈ అంశాల జోలికి వెళ్లలేదు’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ తరహా వ్యాఖ్యలు మంచివి కావన్న విషయంపై సందేహమే లేదు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి బహిరంగ ప్రసంగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అందరూ ఆశిస్తారు’ అని ధర్మాసనం పేర్కొంది.
“సత్యమేవ జయతే….సుప్రీంకోర్టు తీర్పును మేమంతా సంతోషిస్తున్నాము. స్వాగతిస్తున్నాము, ఇది రాహుల్ గాంధీ విజయం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం విజయం.. ఇది ప్రజల విజయం. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. 24 గంటల్లోగా.. ఎన్ని గంటల్లో ఆయనను తిరిగి నియమిస్తారో చూద్దాం” అని ఖర్గే దేశ రాజధానిలో విలేకరుల సమావేశంలో అన్నారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ప్రజల మద్దతుకు ధన్యవాదాలు, సమయం పట్టవచ్చు కానీ “సత్యమే ఎల్లప్పుడూ గెలుస్తుంది” అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాన్ని ఎదిరిస్తున్న రాహుల్ గాంధీ నోరు మూయించే ప్రయత్నమే ఇది అని, దీన్ని భారత అత్యున్నత న్యాయస్థానం గుర్తించిందని కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితాల అన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో వాయనాడ్ ప్రజలు “సంతోషంగా” ఉన్నారని, రమేష్ చెన్నితలా అన్నారు, “ఈ తీర్పుతో మేము బలోపేతం అవుతాము, కేరళ ప్రజలు, ముఖ్యంగా వాయనాడ్ ప్రజలు తమ పార్లమెంటు సభ్యుడు లభించినందున సంతోషంగా ఉంటారు. తిరిగి మా నేత రాహుల్ సేవలు లోక్సభ మిగిలిన కాలమంతా ఉంటాయి.”
దోషులపై సుప్రీంకోర్టు స్టే విధించిన వెంటనే, కేరళలోని వాయనాడ్ జిల్లా కల్పేట పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు తెల్లవారుజామున వేడుకలు నిర్వహించి, స్వీట్లు పంచిపెట్టారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బెంగళూరులో కాంగ్రెస్ కార్యకర్తలు మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు.
సుప్రీంకోర్టు తీర్పుపై రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ, అంతా సరైన దిశలో జరుగుతోందని, రాజస్థాన్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని అన్నారు.
‘‘స్వాతంత్య్రానంతరం పరువు నష్టం కేసులో రెండేళ్లు పూర్తి శిక్షను అనుభవించిన తొలి వ్యక్తి రాహుల్ గాంధీ. ఈరోజు కింది కోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇప్పుడు అంతా సరైన దిశలో సాగుతోంది.. కాంగ్రెస్ తిరిగి వస్తుంది. రాజస్థాన్లో అధికారంలోకి వస్తామని సీఎం గెహ్లాట్ అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ శుక్రవారం మాట్లాడుతూ ఈ తీర్పు “ప్రజాస్వామ్య మరియు లౌకిక విలువలను బలోపేతం చేయడానికి ప్రతిపక్ష కూటమిని, భారత్ను నైతికంగా పెంచుతుందని” అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ఉదయనిధి స్టాలిన్, వాయనాడ్ ప్రజల మనోభావాలను, ఆదేశాన్ని అత్యున్నత న్యాయస్థానం ధైర్యంగా సమర్థించిందని అన్నారు.
డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ ఛైర్మన్ గులాం నబీ ఆజాద్ దీనిని “మంచి విషయం” అని అన్నారు. “రాహుల్ గాంధీపై అనర్హత ప్రభావం ఏమీ లేదు. అతను ఇంతకు ముందు ఎంపీగా చేసిన పనినే చేస్తున్నాడు” అని ఆజాద్ అన్నారు.
‘న్యాయం గెలిచింది’ అని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ‘దేశ అత్యున్నత న్యాయస్థానం చిన్న చిన్న అంతర్గత సమస్యలను గాలికొదిలేసి, ప్రజాస్వామ్యంలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదని సందేశం ఇచ్చింది. ..24 గంటల్లో ఆయనను పార్లమెంట్ నుంచి ఎలా తొలగించారో, అదే విధంగా పునరుద్ధరించాలి.. అది స్పీకర్ డ్యూటీ. లేకుంటే స్పీకర్ కూడా ఇబ్బందుల్లో పడతారని డీకే శివకుమార్ అన్నారు.