ముంబయి: బిజెపి ఎప్పుడూ ఏ ఉద్యమంలోనూ, పోరాటంలోనూ భాగం కాలేదని, సొంతంగా ఏదీ సృష్టించలేదని, అయితే ఇతరుల నుంచి ఎలా లాక్కోవాలో దానికి మాత్రమే తెలుసునని శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరే అన్నారు. ముంబై సబర్బన్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
“బిజెపి స్వాతంత్య్ర ఉద్యమంలో, మరాఠ్వాడా ముక్తి సంగ్రామంలో భాగం కాదు. కానీ ఆ పార్టీకి లాక్కోవడమే తెలుసు. ఎన్నికల్లో బిజెపి “చోర్ బజార్”ని నాశనం చేస్తాం. అది మన స్నేహాన్ని చూసింది. ఇప్పుడు అది మా ‘మషాల్ (పార్టీ ఎన్నికల చిహ్నం కాగడా)’ వేడిని చూస్తారు,” అని ఆయన అన్నారు.
బిజెపి “అవినీతి కార్యకలాపాల”లో భాగం కావద్దని ఉద్ధవ్ ఠాక్రే ముంబై పౌర అధికారులను కోరారు. ముంబై వాయువ్య లోక్సభ స్థానానికి అమోల్ కీర్తికర్ తన పార్టీ అభ్యర్థిగా ఉంటారని పునరుద్ఘాటించారు. శ్రీ కీర్తికర్ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో భాగమైన సిట్టింగ్ ఎంపీ గజానన్ కీర్తికర్ కుమారుడు.