బెంగళూరు: హోలెనరసిపుర పోలీస్ స్టేషన్లో నమోదైన లైంగిక వేధింపుల కేసులో మాజీ మంత్రి, జేడీ (ఎస్) నాయకుడు హెచ్డి రేవణ్ణకు ఎంపీలు/ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల ప్రత్యేక కోర్టు నిన్న మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందస్తు బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించింది. అతనిని కస్టడీకి లేదా జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోరింది. 47 ఏళ్ల ఇంటి పనిమనిషిపై లైంగిక వేధింపులకు సంబంధించి హోలెనరసిపురా పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి హసన్ లోక్సభ నియోజకవర్గం ఎంపీ రేవణ్ణ, ఆయన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
గురువారం రేవణ్ణ ముందస్తు బెయిల్ కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఆయనపై బెయిలబుల్ నేరాలు మాత్రమే నమోదు చేసినందున బెయిల్ మంజూరును సిట్ వ్యతిరేకించలేదని రేవణ్ణ తరపు న్యాయవాది వాదించారు.
ముందస్తు బెయిల్ మంజూరును సిట్ వ్యతిరేకిస్తుండడంతో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ప్రీత్. జె శుక్రవారం దీనిపై విచారణ జరపాలని నిర్ణయించి, అప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.