న్యూఢిల్లీ: ముస్లింలను “బంగ్లాదేశీ” అని పిలుస్తూ వారిపై హింసను ప్రేరేపించే వీడియోను విడుదల చేసిన హిందుత్వ నాయకుడు సత్యం పండిట్ను సోమవారం ఘజియాబాద్ జిల్లాలో అరెస్టు చేశారు. రాష్ట్రీయ హిందూవీర్ సేన అధ్యక్షుడిగా ఉన్న పండిట్ను ఉత్తరప్రదేశ్ పోలీసులు పటేల్నగర్లోని సెహానీ పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో అతనికి వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారని నివేదికలు సూచిస్తున్నాయి.
సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన వీడియోలో పండిట్ ముస్లింలను హెచ్చరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వీడియోలో అతను మాట్లాడుతూ… “మనతో నివసిస్తున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, కాట్వే (సున్తీ)ని పాటించేవారందరూ 24-72 గంటల్లో మన దేశం విడిచి వెళ్లాలని నేను హెచ్చరిస్తున్నాను. లేకుంటే రాష్ట్రీయ హిందూవీర్ సేన కార్యకర్తలు తమ చేతుల్లో కర్రలు పట్టుకుంటారు’’ అని అన్నారు.
వీలైతే ఏ విధంగానైనా వీళ్లందరినీ తరిమికొట్టేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. “లేకపోతే, రాష్ట్రీయ హిందూవీర్ సేన ఈ సున్తీ చేయించుకున్న వారి గడ్డాలు కత్తిరించి, వారి జుట్టును వేరు చేసి, బంగ్లాదేశ్లో పాతిపెడుతుంది” అని ఆ వీడియోలో పండిట్ ముస్లింలను హెచ్చరించారు.
వీడియో లింక్
https://x.com/ZakirAliTyagi/status/1822919839297491261?t=Nl0TQQwBNrVizWPVWar6pA&s=19
పండిట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘజియాబాద్లోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో CRPC – 151 కింద కేసు నమోదు చేశారు.
పండిత్కు పోలీసులు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఆయనను ప్రైవేట్ కారులో కోర్టుకు తరలించి చేతులు దులుపుకున్నారు. కోర్టు అతడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
అరెస్టుకు సంబంధించి పోలీసులు కూడా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. పండిట్ ఫేస్బుక్ ఖాతా ద్వారా వీడియో పోస్ట్ చేసిన తర్వాతే అరెస్టు గురించి మీడియాకు తెలిసింది.
హిందుత్వ నాయకురాలు పింకీ చౌదరి నేతృత్వంలోని గుంపు ఘజియాబాద్ మురికివాడలో పేద ముస్లింలను “బంగ్లాదేశీ” అని పిలిచి వారిపై దాడి చేసిన ఒక రోజు తర్వాత పండిట్ అరెస్టు జరిగింది.
ఈ సంఘటన వీడియోలు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించడంతో, పోలీసులు చౌదరిని అరెస్టు చేశారు. మురికివాడల నివాసితులు బంగ్లాదేశీయులు కాదని, ఉత్తరప్రదేశ్లోని ఇతర ప్రాంతాల నుండి నివసించడానికి అక్కడికి వచ్చిన భారతీయులని స్పష్టం చేశారు. వారు స్వేచ్ఛా భూమిలో నివసిస్తున్నారు.
ముస్లిం కమ్యూనిటీ సభ్యులపై దాడికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి, ఇందులో దాడి చేసినవారు దాడి సమయంలో వారిని “బంగ్లాదేశీ” అని పిలుస్తున్నారు. కొన్ని వీడియోలు ఒడిశా, ఢిల్లీ నుండి కూడా ఉన్నాయి.
భారత్లోని ముస్లింలపై దాడి చేసేందుకు బంగ్లాదేశ్ పరిస్థితిని ఉదహరిస్తున్నారు. షేక్ హసీనాకు వ్యతిరేకంగా రాజకీయ తిరుగుబాటు తర్వాత, నిరసనకారులు అవామీ లీగ్లోని హిందువులు, ఇతర మైనారిటీలతో సహా కొంతమంది నాయకులు, సభ్యులు, మద్దతుదారులపై కూడా దాడి చేశారు.