న్యూఢిల్లీ: వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ లడఖ్ నుండి ఢిల్లీకి ‘క్లైమేట్ మార్చ్’లో పాల్గొనే కొద్ది గంటల ముందు, ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాలలో నిషేధాజ్ఞలు జారీ చేశారు.
సోమవారం నుండి అక్టోబరు 5 వరకు అమలులో ఉన్న ఈ ఉత్తర్వు, ఐదుగురి కంటే ఎక్కువ మంది సమావేశం కావడాన్ని నిరోధిస్తుంది. ఈ సమయంలో ప్రజలు ప్లకార్డులు, బ్యానర్లను పట్టుకోవడం కూడా చట్టవిరుద్ధం.
అనేక సంస్థలు ఈ వారంలో ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనలు, ప్రచారాలను నిర్వహించాలని యోచిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హర్యానా, జమ్మూ – కాశ్మీర్లలో జరుగుతున్న శాసనసభ ఎన్నికలతో సహా అనేక కారణాల వల్ల భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలో నిషేదాజ్ఞలు విధించాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు.
ఆర్డర్ అమల్లోకి వచ్చిన అదే రాత్రి, వాంగ్చుక్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేసాడు. క్లైమేట్ మార్చ్లో పాల్గొనడానికి వస్తున్న 150 మంది వ్యక్తులు హర్యానాలోని సింగు సరిహద్దుకు సమీపంలో ఉన్నందున వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
క్లైమేట్ మార్చ్లో పాల్గొనేందుకు వస్తున్న పలువురు వ్యక్తులను ఢిల్లీలోని బవానా పోలీస్ స్టేషన్లో అదుపులోకి తీసుకున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి ది వైర్ వార్తాసంస్థకు చెప్పారు. రోహిణిలో మరో 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందింది.
వాంగ్చుక్ నేతృత్వంలోని క్లైమేట్ మార్చ్ సెప్టెంబర్ 1న లేహ్లో ప్రారంభమైంది. అప్పటి నుండి, వాంగ్చుక్… దాదాపు 150 మంది లడఖీలు లెహ్ నుండి ఢిల్లీ వరకు 1,000 కిలోమీటర్లు కాలినడకన సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తులో ఉన్న తగ్లాంగ్ లా పాస్ నుంచి వస్తున్నారు.
భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ప్రకారం లడఖ్కు రాజ్యాంగపరమైన భద్రతల కోసం కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించేలా చేయడం కోసం అక్టోబర్ 1న ఢిల్లీకి, 2న రాజ్ఘాట్కు చేరుకోవడం లక్ష్యంగా పర్యావరణ కార్యకర్త సోనమ్ ఈ యాత్రను తలపెట్టారు.
ఢిల్లీలో నిషేధాజ్ఞలు
సోమవారం రాత్రి, ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా దేశ రాజధానిలో అక్టోబర్ 5 వరకు నిషేధ ఉత్తర్వులు విధించారు, మొదటి వారంలో నగరంలో అనేక సంస్థలు నిరసనలు, ప్రదర్శనలు, ప్రచారాలు వంటి కార్యక్రమాలను నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక ప్రదేశంలో గుమికూడడం, బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించం, బహిరంగ ప్రదేశాల్లో ధర్నాలు చేయడాన్ని నిషేధించారు.
వక్ఫ్ సవరణ బిల్లు, ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల ఫలితాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, దీంతో శాంతి భద్రతల దృష్ట్యా ఢిల్లీలో నిషేదాజ్ఞలు విధించామని ఆయన అన్నారు.
అంతేకాదు దసరా అక్టోబర్ 3-12 వరకు జరుపుకునే తొమ్మిది రోజుల పండుగ అయితే, దీపావళి దాదాపు ఒక నెల తర్వాత, అక్టోబర్ 31 న వస్తుంది.
“ఇంకా, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న న్యూ ఢిల్లీ, సెంట్రల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలలో వీఐపీల రాక ఎక్కువగా ఉంటుంది” అని ఆర్డర్ పేర్కొంది. ఈ ఉత్తర్వు ప్రత్యేకంగా ఢిల్లీ సరిహద్దులోని అన్ని ప్రాంతాలతో పాటు ఉత్తర, మధ్య ఢిల్లీకి వర్తిస్తుంది.
.