హైదరాబాద్: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (DDE) జనవరి 2022, 2021-22 సెషన్కు దూర విద్యా విధానంలో ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
కోర్సులు
- ఎం.ఏ ఉర్దూ,
- బి.కాం.
- డిప్లొమా ఇన్ టీచింగ్,
- జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్లో డిప్లొమా,
- ఇంగ్లీష్ ద్వారా ఉర్దూలో ప్రావీణ్యం
- ఫంక్షనల్ ఇంగ్లీషులో సర్టిఫికేట్ కోర్సులకు అడ్మిషన్లు అందిస్తున్నామని ప్రొ|| ముహమ్మద్ రజావుల్లా ఖాన్, డైరెక్టర్ (ఇన్ఛార్జి) పేర్కొన్నారు.
ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ను సమర్పించడానికి, ఫీజు చెల్లింపుకు చివరి తేదీ మార్చి 31,
ఇ-ప్రాస్పెక్టస్, ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్లు, ఫీజు వివరాలు manuu.edu.in/dde (అడ్మిషన్ పోర్టల్ manuuadmission. samarth.edu.in)లో అందుబాటులో ఉన్నాయి.
వివరాల కోసం స్టూడెంట్ సపోర్ట్ యూనిట్ (SSU) హెల్ప్లైన్ని 040-23008463 లేదా 23120600 (extn. 2207), 77939-44799, 60053-03261, 98917-17026లో సంప్రదించవచ్చు లేదా యూనివర్సిటీ వెబ్సైట్ను చూడవచ్చు.
దూర విద్య విధానం ద్వారా కోర్సులు పూర్తి చేయాలనుకుంటున్న అభ్యర్థులు హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, ముంబై, పాట్నా, దర్భంగా, భోపాల్, రాంచీ, అమరావతి, శ్రీనగర్, జమ్ము, నుహ్ (మేవాత్), లక్నోలో ఉన్న మనూ (MANUU) ప్రాంతీయ కేంద్రాలు/ఉప-ప్రాంతీయ కేంద్రాలలో దేనినైనా సంప్రదించి వివరాలు కనుక్కోవచ్చు.