డిస్పూర్: అస్సాంలో 5 ముస్లిం తెగలు ‘స్వదేశీ’ హోదాను పొందాయి. ఈ మేరకు అస్సాం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. గోరియాలు, మోరియాలు, జోల్హాస్, దేశీలు, సయ్యద్లను స్థానిక అస్సామీ ముస్లిం కమ్యూనిటీలుగా గుర్తించడాన్ని అస్సాం క్యాబినెట్ ఆమోదించిందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్వీట్ చేశారు.
ఆయా తెగలకు స్వదేశీ హోదా గుర్తింపు రావడంతో వారి ఆరోగ్యం, సాంస్కృతిక గుర్తింపు, విద్య, ఆర్థిక స్వావలంబన, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారతలో వారి అభివృద్ధికి హామీ లభించినట్టైందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.
అలాగే ఈ క్యాబినెట్ సమావేశంలో మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. పాత వాహనాలను స్క్రాప్గా పరిగణించడం, మాజీ సైనికులు & వారి వితంతువులకు ఆస్తి పన్ను చెల్లింపు నుండి మినహాయింపు ఇవ్వడం, పునరుత్పాదక శక్తిని పెంచడం, డేటా యాక్సెస్ను మెరుగుపరచడం మొదలైన వాటికి సంబంధించి మేము అనేక నిర్ణయాలు తీసుకున్నాము.” అస్కాం ముఖ్యమంత్రి హిమంత శర్మ ట్వీట్ చేశారు.
దేశానికి చేసిన సేవకు కృతజ్ఞతగా మాజీ సైనికులు మరియు వారి వితంతువులకు ఆస్తిపన్ను చెల్లించకుండా మినహాయింపు ఇవ్వాలని అస్సాం మంత్రివర్గం నిర్ణయించింది. మాజీ సైనికులు/వితంతువులు ఆస్తిపన్ను చెల్లించకుండా మినహాయించేందుకు అస్సాం మున్సిపల్ చట్టం, 1956 మరియు గౌహతి మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, 1969లను సవరించే బిల్లులను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు ఆరోగ్య మంత్రి కేశబ్ మహంత తెలిపారు. సమావేశం అనంతరం మీడియాకు వివరించారు.
అస్సాంలోని సూక్ష్మ మరియు చిన్న యూనిట్లకు సంస్థలు ఇచ్చే రుణాలకు అదనపు గ్యారెంటీ కవరేజీని అందించడానికి కార్పస్ను రూపొందించడానికి సిడ్బీ (SIDBI), అస్సాం ప్రభుత్వం కింద మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ (CGTMSE) మధ్య సహకారాన్ని మంత్రివర్గం ఆమోదించింది.
At our weekly #AssamCabinet, we took several decisions pertaining to scrapping of old vehicles, identification of 5 indigenous Muslim groups, exempting ex-servicemen & their widows from paying property tax, boost to renewable energy, improving data access, etc. pic.twitter.com/3a56XLQfd7
— Himanta Biswa Sarma (@himantabiswa) July 5, 2022