లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. లఖింపూర్ ఖేరిలో బుధవారం మధ్యాహ్నం ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉరికి వేలాడుతూ కనిపించడం కలకలం రేగింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు బాలికలు మైనర్లే. అయితే, తమ కుమార్తెలపై అత్యాచారం చేసి, హత్య చేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. బైక్పై వచ్చిన ఓ వ్యక్తి తమ కుమార్తెలను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని బాలికల తల్లి ఆరోపణలు చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకుంది. దీంతో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని పోస్ట్మార్టం కోసం తరలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి అదే గ్రామానికి చెందిన అనుమానం ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. విచారణ జరగుతోందని స్పష్టం చేశారు. ప్రస్తుతం మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని విషయాలు తెలుసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కాగా, ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు స్పందించారు. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా., ఇద్దరు దళిత అమ్మాయిలను కిడ్నాప్ చేసి, హత్య చేయడం దుర్మార్గమైన చర్య, లఖింపూర్ గతంలో రైతుల దుర్ఘటన జరిగిన తర్వాత, ఇప్పుడు దళితులను చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. యూపీలో శాంతిభద్రతలు సరిగా లేవని ఆరోపించారు. గత ప్రభుత్వాలతో పోల్చితే యూపీలో మహిళలపై దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని.. ప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుందని. ప్రశ్నించారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లను చంపిన ఘటన ఆవేదనకు గురిచేసిందన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
लखीमपुर डबल मर्डर पर एक्शन में यूपी पुलिस, थोड़ी देर में प्रेस कॉन्फ्रेंस कर दी जाएगी मामले की जानकारी@manishtv9 दे रहे हैं पूरी जानकारी@iamdeepikayadav @spbhattacharya #LakhimpurKheri #UPPolice #UttarPradesh pic.twitter.com/cs3tpGJ173
— Times Now Navbharat (@TNNavbharat) September 15, 2022