26.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఓవైపు తెగుళ్లు, మరోవైపు అకాల వర్షం…. వెరసి మామిడి రైతుకు తీవ్ర నష్టం!

హైదరాబాద్: ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసాయి. చాలా జిల్లాల్లో వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వర్షాల దాటికి చాలా చోట్ల పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చాలా మంది మామిడి రైతులు  భారీగా నష్టపోయారు. దీనికి తోడు తెగుళ్లు కూడా విజృంభించడంతో మామిడి పంటకు రెట్టింపు నష్టం తప్పలేదు.

వేసవి ఇప్పటికే వచ్చేసింది. వడగళ్ల వాన, ఈదురు గాలులు, తెగుళ్లు కారణంగా  రైతులు దిగుబడి గురించి ఆందోళనపడుతున్నారు. దీంతో ఈ సీజన్‌లో మామిడి ప్రేమికులు వీటి రుచిని ఆస్వాదించేందుకు అదనపు ఖర్చు చేయక తప్పేలా లేదు.

వనపర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, వికారాబాద్, జగిత్యాల తదితర ప్రాంతాల్లో కనీసం 20 నుంచి 30 శాతం దిగుబడి తగ్గే అవకాశం ఉందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు గతేడాది 3.07 లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేయగా ఈ ఏడాది 2.89 లక్షల ఎకరాల్లో సాగు చేశారు.

సీజన్ సానుకూలంగా ప్రారంభమైంది. జనవరి నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడం, పూత, పిందె భారీగా రావడంతో దిగుబడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే చీడపీడల (బ్లాక్ త్రిప్స్) కారణంగా పూలు నుంచి కాయలు సరిగా రాలేదని, బేనిషాన్ రకానికి మామిడికాయల దిగుమతి బాగా తగ్గేటట్టు ఉందని కొల్హాపూర్‌కు చెందిన మామిడి రైతు శివశంకర్ తెలిపారు.

ఇలాంటి తెగుళ్లతో… ఈ సీజన్‌లో తమ పొలంలో 20 టన్నుల దిగుబడి కాస్తా నుంచి 15 టన్నులకు తగ్గే అవకాశం ఉందని వనపర్తికి చెందిన రైతు ప్రవీణ్‌రెడ్డి వాపోయారు.

ఇతర ప్రాంతాలలో, తెగుళ్ల కారణంగా రైతులు పెద్దగా ఇబ్బంది పడనప్పటికీ, గత వారం వర్షాలు, వడగళ్ల వాన కారణంగా గణనీయమైన నష్టాన్ని చవిచూశారు. సంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, వరంగల్‌లోని కొన్ని ప్రాంతాల్లో మామిడి పంటలు బాగా దెబ్బతిన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా జనవరి నుంచి మామిడికి పెద్ద ఎత్తున పూత వచ్చిందని ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. రైతుల నివేదికలను పరిశీలిస్తే, గతేడాది 10.23 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో పోలిస్తే ఈ ఏడాది 14 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని అంచనా వేశారు.

అయితే గత వారం కురిసిన భారీ వర్షాలు, వడగళ్ల వాన కారణంగా రైతులు భారీగా నష్టపోయినట్లు సమాచారం. పంట నష్టాన్ని అంచనా వేసి సమగ్ర నివేదిక సమర్పించేందుకు బృందాలను వివిధ జిల్లాలకు పంపినట్లు ఉద్యానవన శాఖ సీనియర్ అధికారి తెలిపారు.

రాష్ట్రంలో 10 నుంచి 12 లక్షల మెట్రిక్‌ టన్నుల మామిడి ఉత్పత్తి జరుగుతుండగా, అందులో 19,000 నుంచి 20,000 టన్నులు మాత్రమే దేశీయ మార్కెట్లలో వినియోగిస్తుండగా, మిగిలినవి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

తెలంగాణకు చెందిన బేనిషాన్, హిమాయత్ రకాలు ఉత్తరాది రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇవి కాకుండా, గల్ఫ్ దేశాలు, చైనా, ఆస్ట్రేలియా, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయబడినట్లు అధికారి తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles