హైదరాబాద్: ఉర్దూ జర్నలిజం భవిష్యత్తు అంధకారాన్ని తలపిస్తున్న వేళ… ఆయన ఆశా కిరణాన్ని రగిలించారు. తన ఏకైక విజయంతో ఉర్దూ భాషగానీ, దాని జర్నలిజంగానీ ఎక్కడా తగ్గలేదని నిరూపించాడు. ఆయనే ఉర్దూ జర్నలిజం చరిత్రలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విలేఖరి… ఈ ఏడాది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవార్డును అందుకున్న ఏకైక ఉర్దూ జర్నలిస్ట్ సయ్యద్ ఫాజిల్ హుస్సేన్ పర్వేజ్. ఆయన ఈ అవార్డు దక్కడంతో మరింత ప్రాముఖ్యత పెరిగింది.
ఆసక్తికరంగా ఈ హైదరాబాద్ ఆధారిత జర్నలిస్ట్ ఏ ప్రధాన స్రవంతి వార్తాపత్రికకు ప్రాతినిధ్యం వహించలేదు. బదులుగా అతను తన సొంతంగా 16 పేజీల వీక్లీ టాబ్లాయిడ్ ‘గవా’ ను నడిపిస్తాడు.
గ్రామీణ రిపోర్టింగ్, ఆరోగ్యం, క్రీడలు, కార్టూన్లు, ఫోటోగ్రఫీ వంటి వివిధ విభాగాల్లో చేసిన కృషికి గాను జర్నలిస్టులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.
“ఉర్దూ సహఫత్ కే గుమ్నామ్ హీరోస్ ఔర్ షహీదాన్” అనే పరిశోధనాత్మక కథనానికి పర్వేజ్కు ఈ అవార్డు లభించింది. వరుస కథనాల ద్వారా, అతను 1960 నుండి 2020 వరకు 150 మందికి పైగా పేరున్న జర్నలిస్టుల జీవితాలను వెలుగులోకి తెచ్చాడు. ముస్లిం సమాజంలోని వివిధ వర్గాలపై పరిశోధన చేసిన ఏకైక ఉర్దూ జర్నలిస్ట్ ఆయనే కావచ్చు.
40 సంవత్సరాలకు పైగా తన సుదీర్ఘ పాత్రికేయ జీవితంలో, పర్వేజ్ అనేక ఉర్దూ వార్తాపత్రికలు, జర్నల్స్లో పనిచేశాడు. అతను హైదరాబాద్ నుండి ప్రచురించబడిన పురాతన ఉర్దూ దినపత్రికలలో ఒకటైన రహ్నుమా-ఎ-డక్కన్లో స్పోర్ట్స్ రిపోర్టర్గా తన వృత్తిని ప్రారంభించాడు. తరువాత తన స్వంత వారపత్రికను తీసుకురావడానికి ముందు అవామ్, నై దునియా (ఢిల్లీ) కోసం పనిచేశాడు.
గవా ఎడిటర్గా, మీడియా ప్లస్, కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్ సంస్థ మేనేజింగ్ పార్టనర్గా, పర్వేజ్ కొత్త బెంచ్మార్క్లను ఏర్పాటు చేశారు. ఈ వారపత్రిక యొక్క ఘాటైన సంపాదకీయాలు. సచ్ తో మగర్ కెహ్నే దో – అనే శీర్షిక ద్వారా… రాజకీయాలు, సాంఘిక దురాచారాలు, అంతర్జాతీయ వ్యవహారాలపై వారం వారం ఆకట్టుకునే రీతిలో బలమైన కథనాలను ప్రచురించాడు. ఉన్నది ఉన్నట్లు రాయటంలో పర్వేజ్ ఏమాత్రం వెనుకాడడు. అతను ముస్లిం సమాజాన్ని కూడా విడిచిపెట్టడు. తప్పులను ఎత్తి చూపడానికి తరచుగా ముందుంటాడు. సాహిత్య రుచి, ఆకర్షణీయమైన శైలి పర్వేజ్ రచనలకు అందాన్ని తెచ్చిపెడుతుంది.
ఆలస్యంగానైనా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవార్డు ఖచ్చితంగా ఉర్దూ జర్నలిస్టుల మనోధైర్యాన్ని పెంచింది. వర్ధమాన విలేఖరులు పర్వేజ్ నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అతను తనకంటూ ఒక ఒక దారి ఏర్పరుచుకున్నాడు.
ప్రెస్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా అవార్డు సందర్భంగా సయ్యద్ ఫాజిల్ హుస్సేన్ మాట్లాడుతూ… “ఉర్దూ జర్నలిజం భవిష్యత్తు అంత ప్రకాశవంతంగాలేదు.. అయితే పరిస్థితి అంత నిరాశాజనకంగా కూడా లేదని” పర్వేజ్ చెప్పారు.