హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) విజయవాడ రూట్లో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రారంభించనుంది. ఈ పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణీకులకు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, రెడిడ్ లైట్లు, భద్రత కోసం పానిక్ బటన్తో సహా హైటెక్ సౌకర్యాలను అందించేలా రూపొందించారు.
సోమవారం జరిగిన సమీక్షాసమావేశంలో సౌకర్యాలపై రాజీ పడవద్దని, వీలైనంత త్వరగా బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అధికారులకు సూచించారు. ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు 41 సీట్ల కెపాసిటీ కలిగి ఉంటాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. బస్సుల్లో వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్తో పాటు ప్రయాణికుల భద్రత కోసం ఒక్కో బస్సులో మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
అదనంగా, అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి నిరోధించడానికి బస్సులలో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్ (FDSS) ఏర్పాటు చేశారు. డ్రైవర్కు బస్సును సురక్షితంగా నడపడంలో సహాయపడేందుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా అమర్చారు. ర్యావరణ అనుకూల స్వభావం, హైటెక్ ఫీచర్ల కారణంగా ఎలక్ట్రిక్ బస్సులకు ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని TSRTC MD ఆశాభావం వ్యక్తం చేశారు. ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ బస్సులను అందజేస్తుందని, తనిఖీ సమయంలో సౌకర్యాలపై రాజీపడవద్దని సూచించారు.