23.7 C
Hyderabad
Monday, September 30, 2024

పెట్టుబడుల్లో మూడు రెట్లు వృద్ధి నమోదు….@తెలంగాణ!

హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో పెట్టుబడులు దాదాపు మూడు రెట్లు వృద్ధిని నమోదు చేసింది. దీంతో  దేశంలోనే మన రాష్ట్రం  పెట్టుబడులకు గమ్యస్థానంగా మరోసారి నిరూపితమైంది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం రూ.18,893.28 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగియడంతో, ఈ కాలంలో పెట్టుబడి రూ.49,579.18 కోట్లకు ఎగబాకినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

గత రెండు ఆర్థిక సంవత్సరాల TS-iPASS నివేదిక ప్రకారం, 2021-22లో 4,093 యూనిట్లు స్థాపించారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేసుకున్న సంస్థల సంఖ్య 4,602కి పెరిగింది. ఈ రెండేళ్లలో స్థాపించింది కేవలం  600 అయినా, పెట్టుబడుల పరిమాణం చాలా ఎక్కువగా ఉంద. దీని ఫలితంగా రూ.30,000 కోట్లకు పైగా భారీ పెరుగుదల ఏర్పడింది.

అదేవిధంగా, పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. 2021-22లో, పెట్టుబడులు 1,01,035 ఉపాధి అవకాశాలను సృష్టించగా, 2022-23లో ఇది 1,02,105.

గ్లోబల్ కార్పొరేట్ దిగ్గజాల నుండి ప్రముఖ దేశీయ తయారీదారుల వరకు, తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది.

ఏప్రిల్ 2022లో, ఐటి మంత్రి కేటీఆర్  గూగుల్ కంపెనీ అతిపెద్ద క్యాంపస్‌ను ప్రారంభించారు. ఇది యునైటెడ్ స్టేట్స్‌లోని గూగుల్ ప్రధాన కార్యాలయం తరువాత బయటి దేశాల్లో ఏర్పాటు చేసిన వాటిలో ఇదే అతిపెద్దది.  అదే నెలలో, హైదరాబాద్‌కు చెందిన బిలిటి ఎలక్ట్రిక్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఫ్యాక్టరీ సదుపాయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.

జూన్‌లో, గోల్డ్ రిటైలర్ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ అనుబంధ సంస్థ అయిన ఎలెస్ట్, రూ.24,000 కోట్ల పెట్టుబడులతో జనరేషన్ 6 అమోలెడ్ డిస్‌ప్లే FABని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి డిస్‌ప్లే ఫ్యాబ్ సౌకర్యం.

ఇవి ఒక్కటే కాదు… వివిధ రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి. దేశంలోని అతిపెద్ద బంగారు, వజ్రాల రిటైల్ గొలుసులలో ఒకటైన మలబార్ గోల్డ్ & డైమండ్స్, రూ.750 కోట్ల పెట్టుబడితో, 2,750 ఉద్యోగాల ఉపాధి అవకాశాలతో  రత్నాలు,ఆభరణాల తయారీ యూనిట్‌కు పునాది రాయి వేసింది. భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక, ఆటోమోటివ్ బ్యాటరీ మేజర్లలో ఒకటైన అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్, మహబూబ్ నగర్ జిల్లాలో 10 సంవత్సరాలలో రూ.9,500 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రణాళికలను ప్రకటించింది.

జనవరి 2023లో, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో రూ.16,000 కోట్ల పెట్టుబడితో మరో మూడు డేటా సెంటర్లను ఏర్పాటు చేసి తన డేటా సెంటర్ పెట్టుబడిని విస్తరించనున్నట్లు తన ప్రణాళికలను ప్రకటించింది, వాటి సంఖ్యను ఆరు కేంద్రాలకు తీసుకువెళ్లింది.

రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి అనుకూల విధానాలు, మౌలిక సదుపాయాలు, జెట్-స్పీడ్ అనుమతులు, టాలెంట్ పూల్‌ను అభివృద్ధి చేసే చర్యలు, ఇతర కార్యక్రమాలు పెట్టుబడిదారులు అనేక ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక కీలకమైన అంశాలుగా నిలిచాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles