హైదరాబాద్: సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ శనివారం హైదరాబాద్లో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజల సమస్యలపై వారు చర్చించినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో ఇరువురు నేతలు కలుసుకోవడం ఇది మూడో సారి కావడం విశేషం.
ఇటీవల ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబుపై వైసీపీ నేతలు దాడి చేసిన నేపథ్యంలో పవన్ ఈయనకు సంఘీభావం తెలిపారు. పవన్ కళ్యాణ్. ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబు-పవన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణ రాజకీయాల పైనా బాబు-పవన్ భేటీలో ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందని భావిస్తున్న వేళ ఈ ఇద్దరి భేటీ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
అధికార వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీ, జనసేనలు ఏకమై పోరాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే ఇప్పుడు చంద్రబాబుతో పవన్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారడంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుపై అంచనాలు మరింత పెరిగాయి.