హైదరాబాద్: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ రానున్న ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించి తెలంగాణతో పాటు భారతదేశ కీర్తిని మరోసారి ప్రపంచానికి చాటాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ఇప్పటికే ప్రపంచ వేదికలపై ఎన్నో పతకాలు సాధించిన నిఖత్ జరీన్ రాబోయే ఒలింపిక్స్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం తెలిపారు.
నిఖత్ జరీన్ గురువారం సచివాలయంలో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు శిక్షణ, కోచింగ్, రవాణా తదితర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. నిఖత్ జరీన్ ఖర్చుల కోసం ముఖ్యమంత్రి ఆమెకు రూ.2 కోట్లు ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
గురువారం నూతన సచివాలయంలోని మంత్రి మల్లా రెడ్డి ఛాంబర్లో తండ్రితో కలిసి నిఖత్ జరీన్ మర్యాద పూర్వకంగా సీఎంను కలిశారు. ఈ సమావేశంలో ఈ సందర్భంగా క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు మంత్రులు మహమూద్ అలి, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, విఠల్ రెడ్డి, సీఎంఓ కార్యదర్శి భూపాల్ రెడ్డి, క్రీడాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించి తెలంగాణ సహా భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ఇప్పటికే పలు ప్రపంచ వేదికల మీద విజయాలను సొంతం చేసుకుంటూ దేశ ప్రతిష్టిను… pic.twitter.com/AfdupkHChe
— BRS Party (@BRSparty) May 18, 2023