హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా కాలంగా మహారాష్ట్ర రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి కెసిఆర్ చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయనే చెప్పాలి. తాజాగా మహారాష్ట్ర గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తొలి విజయం నమోదు చేసుకుంది. జలగావ్ జిల్లాలోని సవ్ఖేడా గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థి సుష్మా విష్ణు ములే ఎన్నికయ్యారు.
గంగాపూర్ ఖుల్తాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆ పంచాయతీలో వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే అన్నాసాహెబ్ మానె పాటిల్, యువనేత సంతోష్ అన్నాసాహెబ్ మానేతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ విజయం కోసం తీవ్రంగా శ్రమించారని బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదమ్ ఒక ప్రకటనలో తెలిపారు.
బీఆర్ఎస్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా మహారాష్ట్రలో పార్టీకి పెరుగుతున్న ప్రజల మద్దతును ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.