హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల విదేశీ చదువుల కోసం ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 2023 విద్యా సంవత్సరంలో విదేశీ విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ కోర్సులు అభ్యసించేందుకు వెళ్లే మైనారిటీ విద్యార్థుల నుంచి మైనారిటీ సంక్షేమ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది.ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 21 వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఈ పథకం ద్వారా విద్యార్థులు USA, UK, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియాలోని విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు.
ఎంపికైన అభ్యర్థులు రూ.20 లక్షల వరకు స్కాలర్షిప్కు అర్హులు. స్కాలర్షిప్ విధి విధానాలకు సంబంధించి మరిన్ని వివరాలను https://telanganaepass.cgg.gov.in నుండి పొందవచ్చు.