హైదరాబాద్: జహీరాబాద్లో ఆసియాలోనే అతిపెద్ద పెంపుడు జంతువుల ఆహార తయారీ పరిశ్రమ త్వరలోనే అందుబాటులోకి రానుంది. 200 కోట్ల పెట్టుబడితో పెట్ ఫుడ్ యూనిట్ నెలకొల్పుతున్నట్లు అల్లానా గ్రూప్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
దేశీయంగా తన వ్యాపారాన్ని విస్తరించడంతోపాటు నూతన ప్రొటిన్ ఆధారిత ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ యూనిట్ను ఏర్పాటు చేయబోతున్నట్టు కంపెనీ సీఈవో రాఘవేంద్ర రావు తెలిపారు.
10 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో నిర్మించతలపెట్టిన ఈ యూనిట్ నిర్మాణ పనులు మరో రెండు వారాలో ప్రారంభించనున్నామని, తద్వారా వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించ నున్నాయని అల్లానా గ్రూప్ సీఈవో చెప్పారు.
ఈ గ్రూప్ ప్రస్తుతం ప్రాసెస్ ఫుడ్ ఉత్పత్తులు, ఆగ్రో కమోడిటీస్లు, ఫ్రొజెన్/చిల్ల్ మీట్, కూరగాయలు, కాఫీ, స్పైసెస్, చిరుధాన్యాలను ఉత్పత్త చేస్తున్నది. మధ్యప్రాచ్య, యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రి కా, ఆస్ట్రేలియా దేశాలు కలుపుకొని 80 దేశాలకు పెట్ ఫుడ్స్ను ఎగుమతి చేస్తున్నది.