సిద్దిపేట: సిద్దిపేటలో ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు. ఆదివారం రాత్రి టీఎస్ఆర్టీసీ బస్సును ఓ వ్యక్తి దొంగిలించి స్టేషన్లోని పార్కింగ్ బేలోకి తీసుకెళ్లి, సోమవారం ఉదయం బస్సు హైదరాబాద్కు బయలుదేరుతుందని ప్రయాణికులకు చెప్పాడు.
ఈ బస్సు హైదరాబాద్ వెళ్తుందని ప్రయాణికులను నమ్మించి బస్సులో ఎక్కించుకున్నాడు. వేములవాడ నుంచి హైదరాబాద్కు బస్సు బయలుదేరింది. బస్సులో కండక్టర్ లేకపోవడాన్ని ప్రయాణికులు ప్రశ్నించగా, కండక్టర్ మధ్య దారిలో కండక్టర్ ఎక్కుతాడని నమ్మించాడు. ‘డ్రైవర్’ అడ్డదిడ్డంగా డ్రైవింగ్ చేయడంతో, అతను నిజంగా ఆర్టీసీ డ్రైవరేనా అని ప్రయాణికులు ప్రశ్నించడం ప్రారంభించారు. తంగళ్లపల్లి మండలం సారంపెల్లి నేరెళ్ల గ్రామ శివారులోకి రాగానే బస్సులో డీజిల్ అయిపోయింది. దీంతో ప్రయాణికులను మార్గ మధ్యలోనే వదిలేసి జంప్ అయ్యాడు.
సిద్దిపేటలోని టీఎస్ఆర్టీసీ అధికారులు సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో ‘డ్రైవర్’ వీడియోను, ఫోటోలను తీయడంతో…దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ , ప్రయాణికులు తీసిన ఫొటోల ఆధారంగా నిందితుడు రాజును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు మరిన్ని వివరాలను వెల్లడించాల్సి ఉంది.