హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల థీమ్ బేస్డ్ లేజర్ లైట్ అండ్ సౌండ్ షో సెప్టెంబర్ 12న ప్రారంభం అయింది. ఈ షో ఆర్ట్స్ కళాశాల ముఖద్వారం వద్ద గల ఫౌంటేన్ వద్ద ప్రతిష్టాత్మక ఓయూ చరిత్ర, ఈ యూనివర్సిటి వివిధ రంగాలలో ఇస్తున్న సహకారాన్ని ఈ షోలు ప్రదర్శిస్తారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల కథ, తెలంగాణ చరిత్రకు ప్రతీక అయిన భవనం వద్ద ప్రతి రోజు సాయంత్రం లైట్ అండ్ సౌండ్ షో రూపంలో అందుబాటులో ఉంటుంది. 30 నిమిషాల వ్యవధితో కూడిన లేజర్ షోను రెండు షోలుగా ప్రదర్శిస్తారు. వారాంతాల్లోనూ లేజర్ లైట్-సౌండ్ షో నిర్వహించనున్నారు.
ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద ఈ లేజర్ లైట్ అండ్ సౌండ్ షో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. “ఆర్ట్స్ కళాశాల భవనం దాని నిర్మాణ సొబగులతో ప్రజలను ఆకర్షించింది. ఇక లైట్ అండ్ సౌండ్ షో ఈ భవన అందాన్నిమరింత మెరుగుపరుస్తుంది” అని మంత్రి చెప్పారు.
“ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల థీమ్ బేస్డ్ లేజర్ లైట్ అండ్ సౌండ్ షో తెలంగాణ ప్రజలకు ఒక ట్రీట్ అందించడానికి సిద్ధంగా ఉంది” అని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పర్యాటక మంత్రిగా ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించడానికి అనుమతించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
https://twitter.com/osmania1917/status/1701661055108407739?s=46&t=9lv1eArzVJs-QjIrRjydgQ