హైదరాబాద్: ఈ-క్రైమ్లకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. సైబర్ నేరాలకు పాల్పడుతున్న వివిధ రాష్ట్రాలకు చెందిన తొమ్మిది మంది వ్యక్తులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
అరెస్టయిన వారిలో ఉమాకాంత్ దీక్షిత్, శుభమ్ తివారీ, రవికుమార్, అతుల్ శర్మ, షాహిన్ మెమన్, నీరజ్ కుమార్ సింగ్, బిపిన్ కుమార్, బిందేశర్ మండల్, సజ్జాద్ షేక్ ఉన్నారు. నిందితుల్లో ఒకరు ఒక మహిళకు మార్ఫింగ్ చేసిన చిత్రాలను పంపి వేధిస్తున్నారు. మిగిలిన వ్యక్తులు వివిధ సైబర్ నేరాలకు పాల్పడ్డారు. ఈ మోసాల విలువ సుమారు రూ. 2 కోట్లు ఉంటుందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులు తెలిపారు.
సైబర్ క్రైమ్ పోలీసుల కూంబింగ్ ఆపరేషన్లో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను అరెస్టు చేశారు. వారందరినీ రిమాండ్కు తరలించారు.