33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

డీలిమిటేషన్‌లో అన్యాయం జరిగితే దక్షిణాదిన ప్రజాఉద్యమం… మంత్రి కేటీఆర్!

హైదరాబాద్: పార్లమెంటులో దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే అవకాశం ఉందన్న నివేదికలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.  డీలిమిటేషన్ (పునర్విభజన) ద్వారా దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గితే బలమైన ప్రజా ఉద్యమం వస్తుందని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. దేశంలో అత్యున్నతమైన పనితీరును కనబరుస్తున్న రాష్ట్రాలకు ప్రతినిధులుగా, భారతీయులుగా ఉండటాన్ని తాము గర్వంగా భావిస్తున్నామని సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

పార్లమెంట్ దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక, దక్షిణాది రాష్ట్రాల గొంతుని అణచివేయాలని చూస్తే -మౌనం వహించేది లేదని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాలను వింటుందని, న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఓ జాతీయ పత్రిక ప్రచురించిన డిలీటేషన్‌కు సంబంధించిన కథనాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ట్యాగ్  చేశారు.

ఈ వార్తా కథనంలో పేర్కొన్న గణాంకాలే నిజమైతే ప్రజా ఉద్యమం తప్పదని ఆయన స్పష్టం చేశారు. అయితే, దేశంలో ప్రస్తుత జనాభాను పరిగణలోకి తీసుకొని పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిపితే ఉత్తరాది, రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిథ్యం పెరుగనుండగా.. దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా స్థానాలు కోల్పోనున్నాయి.

తాజా అంచనాల ప్రకారం.. ఉత్తరాది రాష్ట్రాలకు అదనంగా 32 స్థానాలు కలిసి వస్తుండగా.. సౌత్ ఇండియాకు చెందిన ఆయా రాష్ట్రాలు 24 స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక, తమిళనాడులో ప్రస్తుతం 39 పార్లమెంట్ స్థానాలుండగా.. డీలిమిటేషన్ తర్వాత అవి 31కి తగ్గుతాయి. తెలంగాణ, ఏపీ, కేరళ నుంచి 8 స్థానాలు, కర్ణాటక రెండు స్థానాలు కోల్పోనుంది. అటు, మధ్యప్రదేశ్ లో నాలుగు. రాజస్థాన్లో 6, బీహార్లో పది, ఉత్తరప్రదేశ్ లో 11 స్థానాలు అదనంగా పెరిగే అవకాశం ఉంది. అందుకే, డీలిమిటేషన్ ప్రమాణాలను మార్చాలని దక్షిణ భారత రాష్ట్రాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.

డీలిమిటేషన్

జనాభా ప్రాతిపదికన.. దేశంలో, రాష్ట్రాల్లో చట్ట సభల నియోజకవర్గాల సంఖ్య పరిధులను నిర్ణయించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. ఈజీగా చెప్పాలంటే ఆయా రాష్ట్రాల్లోని జనాభాకు సరైన ప్రాతినిధ్యం లభించాలా. పార్లమెంటులో, అసెంబ్లీలో సరైన సీట్లుండేలా చూసే ప్రక్రియనే డీలిమిటేషన్ అని అంటారు. అంటే మారుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు ఈ మార్పులు చేర్పులు చేసుకునేలా మన రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు అన్నమాట..

డీలిమిటేషన్‌పై మంత్రి కేటీఆర్ ట్వీట్

https://x.com/KTRBRS/status/1706300891018756525?s=20

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles