గద్వాల్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న వెనకుబడిన తరగుతుల ఉద్యోగార్ఘులకు ట్రైబల్ వెల్ఫేర్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు సమీకృత శిక్షణ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు గద్వాల జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాస్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించే ఈ శిక్షణ, 2025లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు (ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ) అభ్యర్థులను సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
- అర్హత ప్రమాణాలు : – కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలు మించకూడదు.
- దరఖాస్తు ప్రక్రియ: – ఆసక్తి గల అభ్యర్థులు [studycircle.cgg.gov.in](http://studycircle.cgg.gov.in) మరియు [twd.telangana.gov.in](http://twd.telangana.gov.in) వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి .
- దరఖాస్తుకు ఈ నెల 30 చివరి తేదీ.
- శిక్షణ వివరాలు: – హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ కోచింగ్ సెంటర్లో శిక్షణ నిర్వహిస్తారు.
- అభ్యర్థులను ఆబ్జెక్టివ్ టైప్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి గడువులోపు మీ దరఖాస్తును సమర్పించాలని గద్వాల గిరిజన సంక్షేమ శాఖ విజ్ఞప్తి చేసింది.