హైదరాబాద్: స్పూర్తి థియేటర్ ఫర్ ఎడ్యుకేషనల్ పప్పెట్రీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ (STEPARC)కి చెందిన పద్మిని రంగరాజన్ని చూస్తే తప్ప, పిల్లలకు క్లిష్టమైన గణితం మరియు ఆంగ్ల వ్యాకరణాన్ని తోలుబొమ్మల ద్వారా నేర్పించవచ్చని నమ్మడం చాలా కష్టం. ఆమె తన కొడుకుకు ఒక తోలుబొమ్మతో పురాణ కథను చెప్పదం ద్వారా పద్మిని స్వయంగా తోలుబొమ్మలాట యొక్క మాయా ప్రపంచంలోకి అడుగు పెట్టింది. తోలుబొమ్మల ద్వారా ఆమె కథ చెప్పే నైపుణ్యాల గురించి ప్రపంచానికి తెలియడంతో, ఆమె పిల్లలలో గణనీయమైన అభిమానులను సంపాదించుకుంది, ఇది స్పూర్తి థియేటర్ ఫర్ ఎడ్యుకేషనల్ పప్పెట్రీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ని స్థాపించడానికి ఆమెను మరింత ప్రేరేపించింది.
తోలుబొమ్మల పట్ల ఆమెకున్న ప్రేమ, అంతరించి పోతున్న తోలుబొమ్మలాట కళను కాపాడేందుకు పద్మిని రంగరాజన్ కష్టపడేలా చేసింది. వరంగల్ జిల్లాలోని అమ్మాపురంలో తీగతోలు బొమ్మలాట పునరుద్ధరణ ద్వారా ఆమె మంచి గుర్తింపు సంపాదించుకుంది. పద్మిని మీడియాతో మాట్లాడుతూ…“నేను సాంప్రదాయ కథలు చెప్పే కుటుంబం నుండి వచ్చాను. తోలుబొమ్మలతో ప్రయోగాలు చేయడానికి మా నాన్న మార్గనిర్దేశం చేసారు. కానీ నేను సాంప్రదాయ కథలను చెప్పడానికి మాత్రమే తోలుబొమ్మలాట నైపుణ్యాలను పరిమితం చేయలేదు. రామాయణం, మహాభారతం, పురాణాల నుండి తీసిన కథల ద్వారా సమకాలీన ఇతివృత్తాలను మిళితం చేసి కథలు చెప్పటం అలవాటు చేసుకున్నాను.” అని పద్మిని చెప్పారు. తోలుబొమ్మలాట యొక్క పనితీరు శతాబ్దాలుగా అలాగే ఉంది. గతంలో తోలుబొమ్మలాట కళాకారులు సమకాలీన ఇతివృత్తాలతో ప్రయోగాలు చేశారు – కానీ అది కేవలం వినోదం కోసమే. విద్యారంగంలో దీని ఆవశ్యకతను గుర్తించలేదు.
పిల్లలు, పెద్దలు ఇద్దరూ తోలుబొమ్మలాటను బాగా ఇష్టపడతారు. దీంతో ఆమె తోలుబొమ్మలతో పిల్లలకు కథలు చెప్పడం మొదలుపెట్టారు. పిల్లల కోరిక మేరకు ఆమె తన తోలుబొమ్మలకు పేరు పెట్టడం ప్రారంభించారు. ఆ విధంగా, ఆమె మొదటి గ్లోవ్ తోలుబొమ్మ అయిన ‘మల్లు’ అనే కోతి ‘ది మనీ అండ్ ది క్యాప్-సెల్లర్’ కథ జనించింది. 2005లో స్పూర్తి థియేటర్ను స్థాపించినప్పటి నుంచి పద్మిని తోలుబొమ్మలాటలో గిరిజన విద్యార్థులతో పాటు పలువురికి శిక్షణ ఇచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం, స్పూర్తి థియేటర్ ఐటీడీఏ ఉట్నూర్లో ఆరోగ్య సమస్యల గురించి గోండి భాషలో నిర్మించారు., దీనికి మంచి ప్రశంసలొచ్చాయి. కొవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, స్పూర్తి థియేటర్ ఫర్ ఎడ్యుకేషనల్ పప్పెట్రీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంస్థ ఇ-మ్యాగజైన్ ‘పుతాలికా’ తీసుకురావడమే కాకుండా తోలుబొమ్మలాటలో ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తోంది.
అదే సమయంలో, ‘ప్లాస్టిక్, కార్టన్ బాక్స్లు, థర్మాకోల్, పాత కుషన్లలోని నురుగు, కొబ్బరి చిప్పలు, పాత బట్టలు, MLP షీట్లు, పాత టీ స్ట్రైనర్లు, వార్తాపత్రికలు మొదలైన వ్యర్థాల నుండి తోలుబొమ్మలను ఉత్తమంగా’ రూపొందించారు. పద్మిని 2021లో స్వచ్ఛత సారథి ఫెలోషిప్ని అందుకున్నారు..
“భారతదేశంలో, తోలుబొమ్మలాట అనేది కుటుంబ సంప్రదాయంగా వస్తోంది. ఏళ్ల తరబడి ప్రోత్సాహం లేకపోవడంతో కొన్ని సంప్రదాయాలు అంతరించిపోయి అనేక మంది వాటి మనుగడ కోసం పోరాడుతున్నారు. అయినప్పటికీ, ఇతర దేశాలలో విద్యారంగంలో తోలుబొమ్మలాటల ఆవశ్యకతపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి, ”అని ఆమె తెలిపారు. బాల్య వివాహాలు, పరిశుభ్రత, కుటుంబ నియంత్రణ వంటి సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడానికి తోలుబొమ్మలు సమర్థవంతమైన మాధ్యమం, “తోలుబొమ్మ కఠినంగా మాట్లాడినప్పుడు ఎవరూ బాధపడరు” అని పద్మిని చెప్పారు.