30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఓటీఆర్ తప్పనిసరి… రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం!

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనున్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి వన్​టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) తప్పనిసరని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. కొత్త అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని… ఇప్పటికే నమోదు చేసుకున్న వారు ఓటీఆర్ సవరించుకోవాలని టీఎస్​పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ సూచించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త జిల్లా, జోన్లు, ఒకటి నుంచి ఏడో తరగతి వరకు వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. త్వరలోనే నోటిఫికేషన్లు రానున్నందున… చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఓటీఆర్​తో సిద్ధంగా ఉండాలని కమిషన్ తెలిపింది. ఓటీఆర్ కీలకమని.. వాటిలోని వివరాలే దరఖాస్తులో ఉంటాయని పేర్కొంది. ఓటీఆర్ వల్ల కొన్ని నిమిషాల్లోనే దరఖాస్తుల ప్రక్రియ పూర్తవుతుందని టీఎస్​పీఎస్​సీ కార్యదర్శి తెలిపారు.

రిజిస్ట్రేషన్లు ఇలా…

  • టీఎస్‌పీఎస్​సీ వెబ్‌సైట్‌లో ‘న్యూ రిజిస్ట్రేషన్‌’పై క్లిక్‌ చేయాలి. మొబైల్‌ నంబరు ఎంటర్​చేయాలి. ఈ నంబరుకు ఓటీపీ వస్తుంది. దీన్ని నమోదు చేయాలి.
  • దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత సమాచారం, చిరునామా, ఈ-మెయిల్‌ ఐడీ, 1-7వ తరగతి వరకు 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలు, విద్యార్హతలు నమోదుచేశాలి.
  • అభ్యర్థి ఫొటో, సంతకం అప్‌లోడ్‌ చేయాలి. ఈ వివరాలన్నీ సబ్​మిట్​ చేసిన తరవాత టీఎస్‌పీఎస్​సీ ఐడీ వస్తుంది. దీంతో పాటు జనరేట్‌ అయ్యే పీడీఎఫ్‌ కాపీని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • ఒకవేళ సబ్​మిట్​ కన్నా కన్నా ముందుగానే ‘లాగ్‌అవుట్‌’ అయితే మళ్లీ మొదటి నుంచి చేయాలి.

ఓటీఆర్‌ ఎడిట్‌…

  • వెబ్‌సైట్‌లో ఎడిట్‌ ఓటీఆర్‌పై క్లిక్‌ చేయాలి. టీఎస్‌పీఎస్​సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదు చేసిన తరువాత ఫోన్‌ నంబరుకు ఓటీపీ వస్తుంది. దీన్ని నమోదు చేయాలి.
  • ఎడిట్‌ చేయాల్సిన వివరాలు సవరించడంతో పాటు 1-7వ తరగతి వరకు 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలు, విద్యార్హతలు ఇవ్వాలి. అభ్యర్థి ఫొటో, సంతకం అప్‌లోడ్‌ చేయాలి. ఈ వివరాలన్నీ నమోదు చేసి సబ్మిట్‌ చేసిన తరువాత కొత్త ఓటీఆర్‌ పీడీఎఫ్‌ కాపీ జనరేట్‌ అవుతుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles