24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

మత సామరస్యాన్ని ప్రోత్సహించడానికి టీపీయూ కృషి!

హైదరాబాద్: ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా, అన్ని మతాల ప్రజల మధ్య మత సామరస్యాన్ని పెంపొందించేందుకు తెలంగాణ పీస్‌ ఫర్‌ యూనిటీ సంస్థ (TPU) వివిధ ప్రాంతాల్లోని ఈద్గాల్లో తాగునీటిని అందించింది. ‘పానీ పిలావ్, ప్యార్ బధావో’ అనే నినాదంతో మంగళవారం నగరంలోని మసీదుల్లో టీపీయూ సభ్యులు సరూర్‌నగర్, మీర్ ఆలం, చిల్కలగూడ మరియు అనేక మసీదులలో వందలాది మంది భక్తులకు తాగునీటిని అందించారు. “పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికీ మండు వేసవిలో నీరు అందించడం కంటే మంచిపని ఏముంటుంది” అని సామాజిక కార్యకర్తలు అన్నారు. “మైనారిటీలకు వ్యతిరేకంగా లక్ష్యంగా హింస, మత కలహాలు పెరుగుతున్న తరుణంలో, ఆయా వర్గాలలో సంఘీభావం, సోదరభావం పెంచేందుకు ప్రయత్నాలు పెంచేందుకు టీపీయూ విశేషంగా కృషిచేస్తోందని ఆ సంస్థ సభ్యుడు అభిప్రాయపడ్డారు. సమాజంలోని అన్ని వర్గాల కోసం రాజ్యాంగ విలువలు, హక్కులను తిరిగి నెలకొల్పేందుకు మేము పని చేస్తూనే ఉంటాము. .” ఈ దేశం ఏ మతానికి చెందినది కాదని రాసి ఉన్న బ్యానర్లను  వాలంటీర్లు ప్రదర్శించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles