హైదరాబాద్: వివాదాస్పద అగ్నిపథ్ పథకం అమలుపై, ప్రధాని నరేంద్ర మోదీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన మాటల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. పెద్దగా చదువుకోని మోడీ అగ్నిపథ్లాంటి మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ ఏ రేవంత్ రెడ్డి ఆదివారం దుయ్యబట్టారు. భారత సాయుధ బలగాల పనితీరును విశ్లేషించేందుకు మోదీ గానీ, ఆయన పార్టీ బీజేపీ గానీ పెద్దగా ప్రయత్నించడం లేదని ఎద్దేవా చేశారు.
అయోమయానికి గురి చేసే అంశాలను అమలు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని రేవంత్రెడ్డి అన్నారు. సాయుధ దళాలలో నాలుగేళ్లు పనిచేసి పదవీ విరమణ తర్వాత అగ్నివీరులు ఏం చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. అగ్నిపథ్ పథకాన్ని మోదీ ఉపసంహరించుకోవాలని, వివాదాస్పద నిర్ణయం తీసుకున్నందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Telangana Pradesh Congress Committee president and Congress @revanth_anumula strongly criticised the Modi government over the #AgnipathScheme military recruitment scheme and demanded its immediate rollback.#RevanthReddy #RollbackAgnipath #AgnipathSchemeProtest pic.twitter.com/3etHZ5gkKR
— Deccan Chronicle (@DeccanChronicle) June 27, 2022